కరోనా కేసుల సంఖ్య.. మరణాల లెక్కలు చూసి వామ్మో అనుకునే రోజులు పోయాయి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు వంద కేసులు నమోదయ్యాయి.. ఐదారుగురు చనిపోయారు అంటేనే చాలా భయపడిపోతూ మాట్లాడుకునే వాళ్లం కానీ ఇప్పుడు వేలల్లో కేసులు.. పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణలో వాస్తవ కేసులు, మరణాల లెక్కల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇక్కడితో పోలిస్తే ఐదారు రెట్ల సంఖ్యలో కేసులుంటున్నాయి. మరణాలైతే మరీ ఎక్కువగా ఉన్నాయి. గత మూణ్నాలుగు రోజుల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది.
వారం నుంచి ఏపీలో ప్రతి రోజూ అటు ఇటుగా పది వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య 70, 80, 90 ప్లస్ ఇలా ఉంటోంది. శని, ఆదివారాల్లో రెండు రోజులూ కేసుల సంఖ్య 90 దాటి వందకు చేరువగా వచ్చింది. ఆదివారం మరణాల సంఖ్య 97 కావడం గమనార్హం.
ఒక్క రాష్ట్రంలో దాదాపు వంద మరణాలంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా జిల్లాల్లో అటు ఇటుగా పది మంది దాకా కరోనాతో మరణిస్తున్నారు. టోటల్ నంబర్ చెబితే జనాలు భయపడతారనో ఏమో.. అలా కాకుండా కరోనా బులిటెన్లో జిల్లాల వారీగా మరణాల లెక్కలు ఇచ్చి కవర్ చేసే ప్రయత్నం చేస్తోంది ఏపీ సర్కారు. ఇలా నిలకడగా రోజూ పది వేల కేసులు, వంద దాకా మరణాలు అంటే.. ఇంకెప్పుడు అక్కడ కరోనా అదుపులోకి వస్తుందో మరి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…