Political News

జగన్ కోరినట్లే శంకుస్థాపనకు మోడీ వస్తారా?

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో జగన్ సర్కారు ఎంత కచ్ఛితంగా ఉందన్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా మూడు రాజధానుల మాటను వాస్తవరూపం దాల్చేలా చేయటంతో పాటు.. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని మార్చాలన్న పట్టుదలతో యువ సీఎం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ తన ప్రభుత్వ ఎజెండాగా ఉన్న మూడు రాజధానులకు.. మోడీ ఆమోదముద్ర ఉందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నంలో పడ్డారా? అంటే అవునని చెప్పాలి.

తన తాజా కాన్సెప్ట్ అయిన మూడు రాజధానుల అంశాన్ని పీఎంవోకు లేఖ రాయటం.. అపాయింట్ మెంట్ కోసం టైం కోరటం చూస్తుంటే.. మోడీ అభయహస్తంతోనే రాజధాని వ్యవహారం ముందుకు వెళుతుందన్న సంకేతాల్ని ప్రజలకు ఇవ్వాలన్న ఆసక్తితో ఉన్నట్లుగా అర్థం కాక మానదు. మరి.. జగన్ కోరినట్లే ప్రధాని మోడీ విశాఖ శంకుస్థాపనకు వస్తారా? అన్నది క్వశ్చన్.

ఏపీ ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్లుగా మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై స్పష్టత. పూర్తిగా జగన్ రాజకీయ ఎజెండాతో ఏర్పాటు అవుతున్న మూడు రాజధానుల వ్యవహారంలోకి ప్రధాని మోడీ తలదూర్చరన్న మాట బలంగా వినిపిస్తోంది. అమరావతి శంకుస్థాపనను ఆర్భాటంగా నిర్వహించిన నేపథ్యంలో.. మరో రాజధాని శంకుస్థాపనకు హాజరు కావటం ద్వారా.. తన ఇమేజ్ కు డ్యామేజ్ కలిగే ప్రమాదం ఉందన్న అంశంపై మోడీ రాకపోవచ్చని చెబుతున్నారు.

ఏపీ రాజధానిగా విశాఖను ఎంపిక చేసిన వైనంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేకున్నా.. శంకుస్థాపన పేరుతో ఇప్పుడు తమను లాగే ప్రయత్నాన్ని సీఎం జగన్ చేస్తున్నారన్న మాటను ఏపీ బీజేపీ నేతల నోట రావటం గమనార్హం. మంచికో చెడుకో ఒక రాజధాని ఎంపికై.. దాని శంకుస్థాపన జరిగిన తర్వాత.. మరోసారి అదే పేరుతో ఏపీకి రావటం ప్రధాని మోడీకి నష్టమే తప్పించి లాభం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూమిపూజ కోసమైతే.. ప్రధాని మోడీ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ విషయంలో జగన్ కోరుకున్నట్లుగా జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on August 9, 2020 11:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago