Political News

జగన్ కోరినట్లే శంకుస్థాపనకు మోడీ వస్తారా?

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో జగన్ సర్కారు ఎంత కచ్ఛితంగా ఉందన్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా మూడు రాజధానుల మాటను వాస్తవరూపం దాల్చేలా చేయటంతో పాటు.. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని మార్చాలన్న పట్టుదలతో యువ సీఎం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ తన ప్రభుత్వ ఎజెండాగా ఉన్న మూడు రాజధానులకు.. మోడీ ఆమోదముద్ర ఉందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నంలో పడ్డారా? అంటే అవునని చెప్పాలి.

తన తాజా కాన్సెప్ట్ అయిన మూడు రాజధానుల అంశాన్ని పీఎంవోకు లేఖ రాయటం.. అపాయింట్ మెంట్ కోసం టైం కోరటం చూస్తుంటే.. మోడీ అభయహస్తంతోనే రాజధాని వ్యవహారం ముందుకు వెళుతుందన్న సంకేతాల్ని ప్రజలకు ఇవ్వాలన్న ఆసక్తితో ఉన్నట్లుగా అర్థం కాక మానదు. మరి.. జగన్ కోరినట్లే ప్రధాని మోడీ విశాఖ శంకుస్థాపనకు వస్తారా? అన్నది క్వశ్చన్.

ఏపీ ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్లుగా మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై స్పష్టత. పూర్తిగా జగన్ రాజకీయ ఎజెండాతో ఏర్పాటు అవుతున్న మూడు రాజధానుల వ్యవహారంలోకి ప్రధాని మోడీ తలదూర్చరన్న మాట బలంగా వినిపిస్తోంది. అమరావతి శంకుస్థాపనను ఆర్భాటంగా నిర్వహించిన నేపథ్యంలో.. మరో రాజధాని శంకుస్థాపనకు హాజరు కావటం ద్వారా.. తన ఇమేజ్ కు డ్యామేజ్ కలిగే ప్రమాదం ఉందన్న అంశంపై మోడీ రాకపోవచ్చని చెబుతున్నారు.

ఏపీ రాజధానిగా విశాఖను ఎంపిక చేసిన వైనంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేకున్నా.. శంకుస్థాపన పేరుతో ఇప్పుడు తమను లాగే ప్రయత్నాన్ని సీఎం జగన్ చేస్తున్నారన్న మాటను ఏపీ బీజేపీ నేతల నోట రావటం గమనార్హం. మంచికో చెడుకో ఒక రాజధాని ఎంపికై.. దాని శంకుస్థాపన జరిగిన తర్వాత.. మరోసారి అదే పేరుతో ఏపీకి రావటం ప్రధాని మోడీకి నష్టమే తప్పించి లాభం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూమిపూజ కోసమైతే.. ప్రధాని మోడీ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ విషయంలో జగన్ కోరుకున్నట్లుగా జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on August 9, 2020 11:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

36 minutes ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

2 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

2 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

4 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

4 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

6 hours ago