Political News

జగన్ విజ్ఝప్తికి మోదీ ఓకే… డిసెంబర్ దాకా సీఎస్ గా సాహ్నినే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్ని ఈ ఏడాది చివరి దాకా కొనసాగనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఓ మూడు నెలల పాటు నీలం సాహ్ని పదవీ కాలాన్ని పెంచుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ గడువు వచ్చే నెలాఖరు (సెప్టెంబర్ 30)తో ముగియనుంది. దీంతో ఆమె పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖకు సానుకూలంగానే స్పందించిన మోదీ సర్కారు… నీలం పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించేందుకు సమ్మతి తెలిపింది.

ఈ మేరకు కేంద్రం నుంచి సమాచారం వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వం నీలం సాహ్నిని ఈ ఏడాది చివరి (డిసెంబర్ 31) దాకా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించనున్నట్లుగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి జూన్ నెలాఖరుకే నీలం పదవీ విరమణ చేయాల్సి ఉంది.

అయితే సీఎస్ గా నీలంనే మరింత కాలం కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఆమె పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగించాలని కేంద్రానికి జగన్ లేఖ రాశారు. జగన్ ఆరు నెలల కోరితే… అప్పుడు కేంద్రం మూడు నెలల పొడిగింపును మాత్రమే ఇచ్చింది. ఈ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుంది.

అయితే సీఎస్ గా నీలం సాహ్నిని ఈ ఏడాది చివరి దాకా కొనసాగించాల్సిందేనన్న భావనతో జగన్ మరోమారు కేంద్రానికి లేఖ రాశారు. సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని ఆయన సదరు లేఖలో కేంద్రాన్ని కోరారు.

జగన్ విజ్ఝప్తి మేరకు సాహ్ని పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమాచారం అందిన మరుక్షణమే సీలం సాహ్నిని మరో మూడు నెలల అంటే… ఈ ఏడాది చివరి (డిసెంబర్ 31)దాకా సీఎస్ గా కొనసాగించనున్నట్లు జగన్ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

This post was last modified on August 8, 2020 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

7 hours ago