ఏపీ ఉప ముఖ్యమంత్రిని అనూహ్య అనుభవం ఎదురైంది. సాధారణంగా ఈ స్థాయి నేత తమ ఊరికి వస్తున్నారంటే.. ఆ హడావుడి వేరే ఉంటుంది. అందుకు భిన్నంగా ఊరంతా తాళాలు వేసుకొని బయటకు వెళ్లిపోయిన ఉదంతం బయటకు రావటంతో ఇప్పుడీ అంశం సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం వస్తున్న వేళ.. ఊరు వదిలి ఎందుకు వెళ్లాలి? ఆ అవసరం ఏమిటి? అన్న ప్రశ్నలకు ఆసక్తికర ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గ్రామస్తుల తీరుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
ఓవైపు ప్రభుత్వ పథకాల లబ్థి పొందుతూనే.. మరోవైపు తాను ఊరికి వస్తున్న వేళలో.. తాళాలు పెట్టుకొని వెళ్లటాన్ని తప్పు పడుతున్నారు. ఇంతకీ ఈ విచిత్రమైన ఊరు ఎక్కడుందన్న విషయంలోకి వెళితే.. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఉండటం విశేషం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నసంగతి తెలిసిందే.
తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తమ ఊరుకు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు.. తమ ఇళ్లకు తాళాలు వేసేసి వేరే చోటుకు వెళ్లారు. మొత్తం పాతిక ఇళ్లు కూడా లేని ఈ గ్రామంలో ఇద్దరు.. ముగ్గురు తప్పించి.. మిగిలిన వారంతా తమ ఇళ్లకు తాళాలు వేసేసి వెళ్లిపోయారు. ఊరికి వెళితే తాళాలు కప్ప మాత్రమే కనిపిస్తాయన్న సమాచారాన్ని అందుకున్న డిప్యూటీ సీఎం ఆ ఊరి వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇంతకూ ఆ ఊరి వారు ఎందుకంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తమ సమస్యల గురించి ప్రశ్నిస్తే.. ఎక్కడ ప్రతీకార చర్యలు.. హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో హడలిపోయిన్త గ్రామస్తులు ఊరి విడిచి వెళ్లేలా ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకున్నట్ల చెబుతున్నారు. తాజా పరిణామం గురించి తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిన వారి ఇళ్లల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాకు చెక్ పెట్టమన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలోఇప్పుడు వైరల్ గా మారింది.
This post was last modified on May 25, 2023 7:04 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…