Political News

ఏపీలో ఆసుపత్రులు లేవా? హైదరాబాద్ కే రావాలా?

ఏపీలో చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రాష్ట్రంలో కరోనా వైద్యం అద్భుతంగా సాగుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో వైద్య వ్యవస్థలో భారీ ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా ఆ మధ్యన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేయటాన్ని మర్చిపోలేం. అలాంటి ఆయనే.. తనకు కరోనాపాజిటివ్ అన్న విషయం తేలిన వెంటనే హైదరాబాద్ కు వచ్చేసి.. కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిపోయారు.

సామాన్య ప్రజలకు.. తమ రాజకీయ ప్రత్యర్థులకు ఏపీలో ఆసుపత్రులు లేవా? వైద్యులు లేరా?అంటూ నీతులు బోధించే ఏపీ అధికారపక్ష నేతలు.. తమకు మాత్రం కరోనా పాజిటివ్ అన్న విషయం తేలిన వెంటనే.. ఆగకుండా వచ్చేసి హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

మొన్నటికి మొన్న విజయసాయి రెడ్డి అయితే.. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుతో పాటు.. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేరటం ఆసక్తికరంగా మారింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు చొప్పున హైదరాబాద్ లోన కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యానికి వచ్చేయటం చూసినప్పుడు ఏపీలో వైద్య సౌకర్యాలు అంత బాగా లేవా? అన్న సందేహం రాక మానదు.

ఏపీలో అద్భుతమైన పాలన సాగుతున్నప్పుడు.. సరైన ఆసుపత్రి కూడా లేకపోవటమా? అన్నది ప్రశ్నగా మారింది.జగన్ అద్భుత పాలనతో.. కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ.. ఏపీలో జాయిన్ కాకుండా హైదరాబాద్ కు వచ్చేయటంలో మర్మం ఏమిటన్నది ఇప్పుడు అర్థం కానిదిగా మారింది.

ఏపీ అధికారపక్షానికి చెందిన నేతలు వరుస పెట్టి హైదరాబాద్ కు వైద్యానికి రావటం.. ఏపీ ప్రజల్లో అయోమయాన్ని పెంచుతున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే..తమకు సర్కారు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నప్పుడు.. ఆ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకోకుండా హైదరాబాద్ వైపు పరుగులు పెట్టటం లో అసలు కారణం ఏమిటన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతోంది.

ఏమైనా.. కరోనాకు చెక్ పెట్టేందుకు ఎంత భారీగా ఖర్చు చేయటం బాగానే ఉన్నామని చెప్పే ప్రభుత్వం.. తమ పార్టీకి చెందిన నేతలకు కరోనా తేలి.. తీవ్రత పెద్దగా లేకున్నా వెంటనే వారిని హైదరాబాద్ కు పంపించే ధోరణిని పలువురు తప్పు పడుతున్నారు. సామాన్యులు.. ఒక మోస్తరు వారంతా ఏపీ ఆసుపత్రులకు పరిమితమవుతున్నారు. ఇందుకు భిన్నంగా ఏపీ అధికార పక్ష నేతలు మాత్రం హైదరాబాద్ కు పరుగులు తీసి.. వైద్యం చేయించుకోవటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.

This post was last modified on August 9, 2020 7:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

3 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

4 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

4 hours ago

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…

6 hours ago

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…

6 hours ago

కల్కి 2 ప్లానింగ్… ఒక పద్ధతి ఒక ప్రణాళిక

ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…

7 hours ago