జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి రాజధాని నుంచి తరలించడం.. మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేయించుకోవడం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ అంశం మీద అసెంబ్లీని రద్దు చేసి ప్రజా క్షేత్రంలోకి వెళ్దామని.. మళ్లీ ఎన్నికలు జరిపించి ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామని సవాలు విసురుతూ వీరావేశంతో 48 గంటల గడువు ప్రకటించారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.
కానీ ఆయన సవాల్ గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. అమరావతి విషయంలో బాబుకు చిత్త శుధ్ధి ఉన్నా.. లేదంటే మూడు రాజధానుల ప్రతిపాదనపై జనాభిప్రాయం ఏంటో తెలుసుకోవాలన్నా.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని వైకాపా నేతలు సవాలు విసిరితే బాబు ప్రతిగా అసెంబ్లీ రద్దు చేయాలంటూ సవాల్ విసిరారు.
48 గంటల గడువిస్తున్నా.. తర్వాత మళ్లీ వస్తా అంటూ వెళ్లిపోయారు. కానీ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేయడమే కాక.. 40 ఏళ్ల అనుభవం ఉన్న బాబును ఎవరూ పట్టించుకోలేదు. ఆయన సవాల్ గురించి మాట్లాడేవాళ్లే లేదు. మధ్యలో తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లోఇంకో 12 గంటల గడువుందంటూ జగన్కు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయాయి. టీడీపీ అనుకూల మీడియా ఈ సవాల్ గురించి ఆరంభంలో తెగ హడావుడి చేసింది. ఏదో జరగబోతున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ ఈ సవాల్ను జగన్ దాకా ఎందుకు చోటా మోటా వైకాపా నాయకులు కూడా పట్టించుకోలేదు. వేరే పార్టీల వాళ్లూ దీని గురించి స్పందించలేదు. టీడీపీలోనూ దీనిపై చర్చ లేదు. మీడియా వాళ్లు కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్లే ఉన్నారు.
This post was last modified on August 6, 2020 10:47 am
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…