జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి రాజధాని నుంచి తరలించడం.. మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేయించుకోవడం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ అంశం మీద అసెంబ్లీని రద్దు చేసి ప్రజా క్షేత్రంలోకి వెళ్దామని.. మళ్లీ ఎన్నికలు జరిపించి ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామని సవాలు విసురుతూ వీరావేశంతో 48 గంటల గడువు ప్రకటించారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.
కానీ ఆయన సవాల్ గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. అమరావతి విషయంలో బాబుకు చిత్త శుధ్ధి ఉన్నా.. లేదంటే మూడు రాజధానుల ప్రతిపాదనపై జనాభిప్రాయం ఏంటో తెలుసుకోవాలన్నా.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని వైకాపా నేతలు సవాలు విసిరితే బాబు ప్రతిగా అసెంబ్లీ రద్దు చేయాలంటూ సవాల్ విసిరారు.
48 గంటల గడువిస్తున్నా.. తర్వాత మళ్లీ వస్తా అంటూ వెళ్లిపోయారు. కానీ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేయడమే కాక.. 40 ఏళ్ల అనుభవం ఉన్న బాబును ఎవరూ పట్టించుకోలేదు. ఆయన సవాల్ గురించి మాట్లాడేవాళ్లే లేదు. మధ్యలో తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లోఇంకో 12 గంటల గడువుందంటూ జగన్కు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయాయి. టీడీపీ అనుకూల మీడియా ఈ సవాల్ గురించి ఆరంభంలో తెగ హడావుడి చేసింది. ఏదో జరగబోతున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ ఈ సవాల్ను జగన్ దాకా ఎందుకు చోటా మోటా వైకాపా నాయకులు కూడా పట్టించుకోలేదు. వేరే పార్టీల వాళ్లూ దీని గురించి స్పందించలేదు. టీడీపీలోనూ దీనిపై చర్చ లేదు. మీడియా వాళ్లు కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్లే ఉన్నారు.
This post was last modified on August 6, 2020 10:47 am
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…