Political News

కరోనా బిల్లు చూసి.. ఆఫీసును ఆసుపత్రిగా మార్చేశాడు

విన్నంతనే నమ్మలేం. కానీ.. ఇది నిజంగా నిజం. కరోనా పాజిటివ్ కావటంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన ఒక వ్యాపారవేత్త.. ఎట్టకేలకు కోలుకోవటం బాగానే ఉన్నా.. అతగాడి చేతికి ఇచ్చిన బిల్లును చూసి గుండె ఆగినంత పనైందట. దాంతో ఆ వ్యాపారస్తుడు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వైరల్ గా మారిన ఈ ఉదంతం గురించి చెబితే..

గుజరాత్ లోని సూరత్ పట్టణానికి చెందిన ఖాదర్ షేక్ అనే బడా వ్యాపారికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దాదాపు ఇరవై రోజుల పాటు ఆసుపత్రిలోచికిత్స పొందిన ఆయన.. చివరకు డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. సదరుఆసుపత్రి వారు వేసిన బిల్లు చూసి అవాక్కు అయ్యాడు.

తనలాంటి సంపన్నుడైతే వైద్యం చేసుకోవటం ఓకే. మరి..ఇదే జబ్బు పేదలకు వస్తే పరిస్థితి ఏమిటన్న ఆలోచన చేసిన తర్వాత ఆయన ఆస్సలు ఆగలేదు. ఆసుపత్రి నుంచి వచ్చిన ఆయన.. తన ఆఫీసు కార్యాలయాన్ని ఏకంగా కొవిడ్ ఆసుపత్రిగా మార్చేయాలని డిసైడ్ అయ్యారు. వెంటనే.. పరిష్మన్ల కోసం ప్రయత్నించి.. తాను ఆసుపత్రి పెట్టాలనుకున్న కారణాన్ని చెప్పుకొచ్చారు.

దీంతో.. యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చేశారు. దీంతో.. అప్పటివరకూ తన ఆఫీసుగా ఉన్న కార్యాలయాన్ని ఏకంగా ఆసుపత్రిగా మార్చేశాడు. మొత్తం 85 బెడ్లతో ఆసుపత్రిగా మార్చేశాడు. రోగులకు అవసరమై సకల సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చేశాడు. ఇతగాడి ప్రయత్నం చూసిన గుజరాత్ ప్రభుత్వం.. వైద్య సిబ్బంది.. యంత్రాలు.. మెడిసిన్లను పంపింది.

ఇక.. బెడ్లను.. కరెంటు బిల్లుల్ని తాను భరిస్తానని ఖాదర్ డిసైడ్ అయ్యాడు. మొత్తంగా ఆసుపత్రిని సిద్ధం చేశారు. తన ఆసుపత్రిలో కులం.. మతంతో సంబంధం లేకుండా ఎవరినైనా చేర్చుకుంటామని సెలవిస్తున్నారు. ఇలాంటి మనసున్న మారాజులు.. వెంటనే స్పందించే ప్రభుత్వాలుఊరికొకటి ఉంటే.. కరోనా కారణంగా ఆగమాగం అయ్యే పరిస్థితి ఉండదేమో?

This post was last modified on August 5, 2020 2:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

5 minutes ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

3 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

3 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

4 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

6 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

10 hours ago