మొత్తానికి బీసీసీఐ దిగి రాక తప్పలేదు. చైనా వ్యతిరేక ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ ఆ దేశానికి చెందిన వివో మొబైల్ కంపెనీని ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా కొనసాగించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించడంపై తీవ్ర స్థాయిలో దుమారం రేగడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ ఏడాదికి ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి వివో తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. బోర్డు వర్గాలు మాత్రం వివో తప్పుకున్న మాట వాస్తవమే అంటున్నాయి.
చైనా భాగస్వామ్యం ఉన్న పెద్ద పెద్ద కాంట్రాక్టుల్నే రద్దు చేస్తున్నారు. కొన్ని నెలలుగా క్రితం భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, 23 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఈ నేపథ్యంలో భారత్లో చైనా వస్తువులను బాయ్కాట్ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికడం తెలిసిందే.స్వయంగా ప్రభుత్వమే 59 యాప్లను నిషేధించింది. చైనా వస్తువుల్ని బహిష్కరించాలని జనాలకు నేతలు పిలుపునిస్తున్నారు. కానీ బీసీసీఐ ఇదేమీ పట్టించుకోకుండా కానీ వివోతో భాగస్వామ్యం కొనసాగుతుందని ఇటీవల తేల్చేసింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తయ్యాయి.
ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ స్పాన్సర్గా కొనసాగడం భావ్యం కాదని భావించిన వివో స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వెనుకంజ ఈ ఏడాది వరకేనట. భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుబడి.. చైనా వ్యతిరేక ఉద్యమం చల్లబడితే వచ్చే రెండేళ్లు యధావిధిగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా కొనసాగాలన్నది వివో ఆలోచన. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను వివో ఇండియా ఐదేళ్లకు గానూ 2017లో రూ. 2199 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రతీ ఏటా రూ.440 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. మరి ఈ 440 కోట్ల లోటును బీసీసీఐ ఎలా భర్తీ చేస్తుందో.. ఏ కంపెనీ ఈ ఒక్క ఏడాదికి టైటిల్ స్పాన్సర్ అవుతుందో చూడాలి.
This post was last modified on August 4, 2020 9:04 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…