Political News

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల్లో అసంతృప్తి

వైసీపీ సర్కార్ కు ఓ విషయంలో విపక్షం కన్నా స్వపక్షం నుంచి విమర్శలు ఎక్కువయ్యాయట. కొత్త జిల్లాల ఏర్పాటుతో మరిన్ని పదవులు, నామినేటెడ్ పోస్టులు క్రియేట్ చేయొచ్చన్న సీఎం జగన్ ఆలోచన ఇపుడు ఆయనకే బూమరాంగ్ అవుతోందట. కొత్త జిల్లాల ఏర్పాటుతో తమ ఉనికిని కోల్పోతామంటూ రాష్ట్రంలోని పలువురు వైసీపీ సీనియర్, జూనియర్ నాయకులు సీఎంకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మొర పెట్టుకుంటున్నారట. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు…ఈ కొత్త జిల్లాల ప్రతిపాదనపై కక్కలేక మింగలేక ఉన్నారట. జిల్లాలను విభజిస్తే భౌగోళికంగా తమ ప్రాంతం రూపు రేఖలు మారిపోతాయని, తమ నియోజకవర్గాల్లో పట్టు కోల్పోతామని సీఎం జగన్ కు విన్నవించుకుంటున్నారట.

ప‌క్క జిల్లాల్లో తమ ప్రాంతాలను క‌లప‌వ‌ద్దని కొందరు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అంటుంటే….పెద్ద జిల్లాని చిన్న జిల్లాలుగా ముక్కలు చేయొద్దని మరికొందరు అంటున్నారట. ఉత్తరాంధ్రకు చెందిన నేతలకు కొత్త జిల్లాల విభజన ఏ మాత్రం ఇష్టం లేదట. కొత్త జిల్లాల వ్యవహారంపై ఉత్తరాంధ్రవాసులకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఉన్న అసంతృప్తికి అనేక కారణాలున్నాయట. పార్లమెంటు ప‌రిధి ప్రకారం అరకు నియోజ‌క‌వ‌ర్గం విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో విస్తరించింది. అర‌కును జిల్లాగా ప్రక‌టిస్తే.. ఆ జిల్లాల్లోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు అరకులో క‌లుస్తాయి. అదే జరిగితే పార్టీకి డ్యామేజీ అని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అంటున్నారట. అరకు జిల్లా అయితే విజయనగరం జిల్లాలో ఉన్న పార్వతీపురం, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు, శ్రీకాకుళం జిల్లా పాలకొండ సెగ్మెంట్, తూర్పు గోదావ‌రి జిల్లాలోని రంప‌చోడ‌వ‌రం అర‌కు జిల్లాలోకే వెళతాయి.

అందుకే, అరకును రెండు జిల్లాలు చేయాలని కొందరు నేతలు అంటుంటే పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటించాలని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్ చేస్తున్నారట. ఇక, సాలూరు కేంద్రంగా మ‌రో గిరిజ‌న జిల్లా ఏర్పాటు చేయాల‌ని స్థానిక ఎమ్మెల్యే రాజ‌న్నదొర‌ కోరుకుంటున్నారట. లోక్ సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటుతో సిక్కోలుకు అన్యాయం జరుగుతుందని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇలా సొంత పార్టీలోనే జిల్లాల విషయంలో తీవ్ర గందరగోళం ఉండడంతో వైసీపీ అధిష్టానం ఏం చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతోందట. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర నేతలంతా అలా చేయొద్దంటూ జగన్ ను రిక్వెస్ట్ చేస్తున్నారట. ఏది ఏమైనా…కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో విపక్షాల కన్నా స్వపక్షంతోనే జగన్ కు చిక్కులు తప్పేలా లేవు. మరి, ఉత్తరాంధ్ర నేతల రిక్వెస్ట్ ను జగన్ పరిగణిస్తారా….లేదంటే వారిని బుజ్జగిస్తారా…అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on August 4, 2020 8:58 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…

43 minutes ago

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…

1 hour ago

కల్కి 2 ప్లానింగ్… ఒక పద్ధతి ఒక ప్రణాళిక

ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…

1 hour ago

తిరుమలలో పాము కాటు… నిజమెంత?

తిరుమ‌ల‌పై మ‌రో దుష్ప్ర‌చారం జ‌ర‌గ‌డంపై ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కార‌ణం ఎవ‌రు? ఎక్క‌డ నుంచి జ‌రిగింది?…

5 hours ago

అసెంబ్లీలో ల‌డ్డూపై చ‌ర్చ‌.. కానీ జగన్…

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దానికి త‌గిన విధంగా ప‌నిచే స్తున్నారా? అనేది…

8 hours ago

జగన్ వస్తే లోకేష్ టికెట్ ఇస్తారట

త‌న‌పై వైసీపీ నాయ‌కులు స‌హా.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…

9 hours ago