Political News

జగన్ కు రఘురామకృష్ణంరాజు బస్తీ మే సవాల్

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం కొంతకాలంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు వైసీపీపై, సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తోన్న ఆర్ ఆర్ ఆర్…తాను వైసీపీని వీడనంటూ మొండిపట్టు పట్టారు. సొంత పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేసినా…ఆ దిశగా అడుగులు పడలేదు. ఇక, నిమ్మగడ్డ మొదలు తాజాగా రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం వరకు…ప్రభుత్వంపై, జగన్ పై విమర్శలు గుప్పిస్తున్న ఎంపీని ఇప్పటివరకూ ఎందుకు సస్పెండ్ చేయలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏపీలో రాష్ట్రపతి పాలన వచ్చేవరకు జగన్ తెచ్చుకోవద్దంటూ ఉచిత సలహా ఇచ్చినా…ఇంకా జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అదే అలుసుగా…మరోసారి వైసీపీ సర్కార్, జగన్ పై ఆర్ ఆర్ ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓదార్పు యాత్రతో అధికారంలోకి వచ్చిన జగన్….అమరావతి రైతుల కోసం ఓదార్పు యాత్ర చేయాలని, సాక్షిని కాకుండా మనస్సాక్షిని నమ్మాలంటూ జగన్ కు రఘురామకృష్ణంరాజు హితబోధ చేశారు.

అమరావతి కోసం ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాల్ని పరామర్శించి మంచి పేరు తెచ్చుకోవాలంటూ జగన్ కు రఘురామకృష్ణంరాజు ఉచిత సలహా ఇచ్చారు. ఈ నెల నుంచి రూ.250 పెన్షన్ పెంచుతానని చెప్పి మాట తప్పారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఈ ఉదంతం నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో వేల కోట్లతో 3 రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో అసలు అర్థమే లేదని, అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించి…అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులంటూ ముసుగేశారని సెటైర్ వేశారు. మహిళా రైతులు తలచుకుంటే రాజధాని తరలింపు ఆగిపోతుందనీ, వారికి తమందరి మద్దతు ఉంటుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజధాని కోసం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ సహేతుకమైనదేనని రఘురామకృష్ణంరాజు చెప్పారు.

కానీ, రాజీనామా కన్నా రాజీలేని పోరాటం చేస్తే బాగుంటుందని అన్నారు. బీటెక్ చదివి బీటెక్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్న బీటెక్ రవి, తన పదవికి రాజీనామా చేయడంలో అర్థంలేదన్నారు. మండలి సభ్యుడిగా ఉంటూనే పోరాడాలన్నారు. రవికి భవిష్యత్తులో భద్రతపరమైన సమస్యలు ఏర్పడవచ్చని, ఎంపీనైన తనకు కేంద్ర బలగాల భద్రత వస్తుందన్న నమ్మకమైనా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై రిఫరెండం నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని అన్నారు.కనీసం విశాఖలో అయినా 3 రాజధానుల డిమాండ్‌తో ఉప ఎన్నికలకు వెళ్ళే దైర్యముందా? అని జగన్ కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో శానిటైజర్‌ తాగి చనిపోతున్నవారి సంఖ్య…కరోనా మరణాల్ని మించిపోయేలా ఉందని ఎద్దేవా చేశారు. సన్నబియ్యం విషయంలో ‘సాక్షి తప్పు రాసిందంటూ అసెంబ్లీలో జగన్ స్వయంగా అంగీకరించారని, ఇకపై అయినా…జగన్ సాక్షి విశ్వసనీయతను కాకుండా….మనస్సాక్షిని నమ్మాలని సెటైర్ వేశారు.

This post was last modified on August 3, 2020 11:06 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

58 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

3 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago