Political News

14 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవా?

అనంతపురం జిల్లా…ఏపీలోని 13 జిల్లాల్లో ఒకటి…. బ్రిటిష్ హయాంలోనే అత్యధిక పనులు చెల్లించిన ప్రాంతంగా పేరు గాంచిన జిల్లా ఇది. కానీ, ఎన్నో దశాబ్దాలుగా అనంతపురం జిల్లాను కరువు రక్కసి కబలిస్తోంది. వర్షాలు లేక, ఉపాధి దొరక్క…గ్రామాలకు గ్రామాలే వలస వెళ్లిపోతున్నాయి. కొన్ని పల్లెల్లో వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. పశువులకు గడ్డి కూడా దొరకని పరిస్థితి ఉందంటే అనంతపురం వెనుకబాటు ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. కరువు, ఏటా తగ్గిపోతున్న వర్షపాతం, పాతాళానికి పడిపోతున్న భూగర్భజలాలు…ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో చాలామంది బలవంతంగా సొంతూళ్లను విడిచి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు పొట్టచేతబట్టుకొని వలస వెళ్లాల్సిన పరిస్థితి. రాజకీయ వెనుకబాటుతనం వల్లే అనంతపురం జిల్లా ఇంకా వెనుకబడి ఉందని రాజకీయ మేధావులు సైతం విశ్లేషిస్తున్నారు.

పాలకులంతా ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపుతూ…జిల్లావాసులను మధ్యపెడుతున్నారని అభిప్రాయపడుతున్నారు అనంతపురం ప్రజలపై రాజకీయ నేతలకు చిన్నచూపు ఓ వైపు….గెలిచిన ఆ రాజకీయ నాయకులపై అధికారంలో ఉన్న పార్టీ చిన్నచూపు మరోవైపు…వెరసి అనంతపురం రాజకీయంగానూ వెనుకబడుతూనే ఉందని అంటున్నారు. 14 మంది ఎమ్మెల్యేలున్న అనంతపురానికి ఒక్క మంత్రిపదవే దక్కడం ఆ రాజకీయ వెనుకబాటుతనానికి అద్దం పడుతోందన్న అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు పదవుల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆ ప్రాంత రాజకీయ నేతలు…వైసీపీ శ్రేణులు సైతం పెదవి విరుస్తున్నారట. 14 మంది ఎమ్మెల్యేలున్న అనంతపురం జిల్లాకు ఒకటే మంత్రి పదవి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

ఆ మాటకొస్టే ఉమ్మడి ఏపీలో అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహించేవారని, ఇపుడు రాష్ట్రం విడిపోయాక కేవలం 13 జిల్లాలే ఉన్నా ఒక్క మంత్రి పదవి మాత్రమే దక్కిందని మదనపడుతున్నారట. ఏపీలో తమకంటే చిన్న జిల్లాలకు రెండేసి మంత్రి పదవులు ఇచ్చి అనంతపురానికి ఒక్క మంత్రి పదవే ఇవ్వడం..రాజకీయ వివక్షేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మంత్రి పదవులు సంగతి పక్కనబెడితే. .నామినేటెడ్ పోస్టులు కూడా పెద్దగా దక్కలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇక, రాజధాని విషయంలోనూ అనంతపురం వైసీపీ శ్రేణలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయట. నాడు రాజధానిగా అమరావతి ఎంపిక విషయంలోనూ…నేడు పాలనా రాజధానిగా విశాఖపట్నం విషయంలోనూ సంతృప్తిగా లేరట. అనంతపురంలోని హిందూపురానికి తమ రాష్ట్ర రాజధాని కంటే కూడా తమిళనాడు, కర్ణాటక రాజధానులు దగ్గరన్న భావన వారిలో బలంగా ఉందట. మరి, ఈ అసంతృప్తులను వైసీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.

This post was last modified on August 3, 2020 10:19 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మణిరత్నం సినిమా… పెర్ఫామెన్సులు పేలిపోతాయ్

నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే…

3 hours ago

215 కోట్ల ఆఫర్ వద్దనుకున్నారా

దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…

4 hours ago

‘భ‌ర్త సంపాద‌న ఎంతో భార్య‌కు చెప్ప‌క్క‌ర్లేదు’

స‌హ‌జంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్య‌లు ఆస‌క్తి చూపుతారు. ఈ విష‌యం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…

4 hours ago

డేర్ చేయకపోవడమే డెకాయిట్ తెలివి

ముందు ప్రకటించిన ప్రకారమైతే అడివి శేష్ డెకాయిట్ మార్చి 19 విడుదల కావాలి. కానీ అదే రోజు దురంధర్ 2,…

6 hours ago

ఇండియా ముందుకు వెళ్లాలంటే?

టీ20 ప్రపంచకప్‌లో మొన్నటిదాకా భారత జట్టు టైటిల్‌కు హాట్ ఫేవరెట్. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచింది. మొత్తం…

6 hours ago

తల్లి సినిమాలు ఒక్కటీ చూడని హీరో పిల్లలు

సినిమాల పట్ల ఆసక్తి లేని పిల్లలు తక్కువగా ఉంటారు. అందులోనూ సినీ కుటుంబానికి చెందిన వాళ్లయితే కచ్చితంగా అటు వైపు…

7 hours ago