Political News

14 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవా?

అనంతపురం జిల్లా…ఏపీలోని 13 జిల్లాల్లో ఒకటి…. బ్రిటిష్ హయాంలోనే అత్యధిక పనులు చెల్లించిన ప్రాంతంగా పేరు గాంచిన జిల్లా ఇది. కానీ, ఎన్నో దశాబ్దాలుగా అనంతపురం జిల్లాను కరువు రక్కసి కబలిస్తోంది. వర్షాలు లేక, ఉపాధి దొరక్క…గ్రామాలకు గ్రామాలే వలస వెళ్లిపోతున్నాయి. కొన్ని పల్లెల్లో వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. పశువులకు గడ్డి కూడా దొరకని పరిస్థితి ఉందంటే అనంతపురం వెనుకబాటు ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. కరువు, ఏటా తగ్గిపోతున్న వర్షపాతం, పాతాళానికి పడిపోతున్న భూగర్భజలాలు…ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో చాలామంది బలవంతంగా సొంతూళ్లను విడిచి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు పొట్టచేతబట్టుకొని వలస వెళ్లాల్సిన పరిస్థితి. రాజకీయ వెనుకబాటుతనం వల్లే అనంతపురం జిల్లా ఇంకా వెనుకబడి ఉందని రాజకీయ మేధావులు సైతం విశ్లేషిస్తున్నారు.

పాలకులంతా ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపుతూ…జిల్లావాసులను మధ్యపెడుతున్నారని అభిప్రాయపడుతున్నారు అనంతపురం ప్రజలపై రాజకీయ నేతలకు చిన్నచూపు ఓ వైపు….గెలిచిన ఆ రాజకీయ నాయకులపై అధికారంలో ఉన్న పార్టీ చిన్నచూపు మరోవైపు…వెరసి అనంతపురం రాజకీయంగానూ వెనుకబడుతూనే ఉందని అంటున్నారు. 14 మంది ఎమ్మెల్యేలున్న అనంతపురానికి ఒక్క మంత్రిపదవే దక్కడం ఆ రాజకీయ వెనుకబాటుతనానికి అద్దం పడుతోందన్న అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు పదవుల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆ ప్రాంత రాజకీయ నేతలు…వైసీపీ శ్రేణులు సైతం పెదవి విరుస్తున్నారట. 14 మంది ఎమ్మెల్యేలున్న అనంతపురం జిల్లాకు ఒకటే మంత్రి పదవి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

ఆ మాటకొస్టే ఉమ్మడి ఏపీలో అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహించేవారని, ఇపుడు రాష్ట్రం విడిపోయాక కేవలం 13 జిల్లాలే ఉన్నా ఒక్క మంత్రి పదవి మాత్రమే దక్కిందని మదనపడుతున్నారట. ఏపీలో తమకంటే చిన్న జిల్లాలకు రెండేసి మంత్రి పదవులు ఇచ్చి అనంతపురానికి ఒక్క మంత్రి పదవే ఇవ్వడం..రాజకీయ వివక్షేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మంత్రి పదవులు సంగతి పక్కనబెడితే. .నామినేటెడ్ పోస్టులు కూడా పెద్దగా దక్కలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇక, రాజధాని విషయంలోనూ అనంతపురం వైసీపీ శ్రేణలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయట. నాడు రాజధానిగా అమరావతి ఎంపిక విషయంలోనూ…నేడు పాలనా రాజధానిగా విశాఖపట్నం విషయంలోనూ సంతృప్తిగా లేరట. అనంతపురంలోని హిందూపురానికి తమ రాష్ట్ర రాజధాని కంటే కూడా తమిళనాడు, కర్ణాటక రాజధానులు దగ్గరన్న భావన వారిలో బలంగా ఉందట. మరి, ఈ అసంతృప్తులను వైసీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.

This post was last modified on August 3, 2020 10:19 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

పరీక్షలో కథ రాసిన హీరో.. కట్ చేస్తే..!

డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…

19 seconds ago

ఆ మహిళ తో వీడియోలు వ్యక్తిగత విషయమంటోన్న MLA

తనపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తొలిసారి మీడియా ముందు స్పందించారు. అది…

6 minutes ago

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

2 hours ago

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

4 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

6 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

12 hours ago