అవును.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మాత్రం.. ఆ మనమడికి తాతేగా. సీఎంగా ఆయన చాలానే కార్యక్రమాలకు.. విషాదాల వేళ పరామర్శలకు బయటకు రావటానికి ఇష్టపడని ఆయన.. తన ప్రియాతి ప్రియమైన మనమడి ప్లస్ టూ పాస్ అయిన సందర్భంగా జరిగే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండటమా? మనమడు సాధించిన విజయాన్ని స్వయంగా చూసి సంతసించే అవకాశాన్ని ఆయన ఎందుకు పోగొట్టుకుంటారు. అందుకే.. తీరిక లేనట్లుగా ఉండే బిజీగా షెడ్యూల్ ను పక్కన పెట్టేసి.. తన మనమడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి స్వయంగా హాజరైన కేసీఆర్ ను చూసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే తాత పాత్రకే నూటికి నూరుశాతం న్యాయం చేస్తున్నారని చెప్పక తప్పదు.
గచ్చిబౌలిలోని ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న కేసీఆర్ మనమడు హిమాన్షురావు 12వ తరగతి పూర్తి చేసి పట్టా అందుకున్నారు. కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డును అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన సతీమణిశోభమ్మ.. కొడుకు కేటీఆర్.. ఆయన సతీమణి.. కుమార్తె.. ఇలా మొత్తం కుటుంబం ఈ వేడుకను చూసేందుకు హాజరయ్యారు.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…