అవును.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మాత్రం.. ఆ మనమడికి తాతేగా. సీఎంగా ఆయన చాలానే కార్యక్రమాలకు.. విషాదాల వేళ పరామర్శలకు బయటకు రావటానికి ఇష్టపడని ఆయన.. తన ప్రియాతి ప్రియమైన మనమడి ప్లస్ టూ పాస్ అయిన సందర్భంగా జరిగే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండటమా? మనమడు సాధించిన విజయాన్ని స్వయంగా చూసి సంతసించే అవకాశాన్ని ఆయన ఎందుకు పోగొట్టుకుంటారు. అందుకే.. తీరిక లేనట్లుగా ఉండే బిజీగా షెడ్యూల్ ను పక్కన పెట్టేసి.. తన మనమడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి స్వయంగా హాజరైన కేసీఆర్ ను చూసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే తాత పాత్రకే నూటికి నూరుశాతం న్యాయం చేస్తున్నారని చెప్పక తప్పదు.
గచ్చిబౌలిలోని ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న కేసీఆర్ మనమడు హిమాన్షురావు 12వ తరగతి పూర్తి చేసి పట్టా అందుకున్నారు. కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డును అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన సతీమణిశోభమ్మ.. కొడుకు కేటీఆర్.. ఆయన సతీమణి.. కుమార్తె.. ఇలా మొత్తం కుటుంబం ఈ వేడుకను చూసేందుకు హాజరయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…
కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…
జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…
కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…
ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…
ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…