టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే నిమ్మకూరు, గుడివాడ ప్రాంతాల్లో ఆయన వరుసగా సభలు పెట్టారు. అదేవిధంగా మచిలీపట్నంలోనూ పర్యటించారు. అయితే.. చంద్రబాబు పర్యటనలో తమకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని.. తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు చూసీ చూడనట్టే వ్యవహరించారు. ముఖ్యంగా నాలుగు నియోజకవ ర్గాల్లో నేతల మధ్య సమస్యలు ఉన్నాయి.
గుడివాడ, నూజివీడు, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని టీడీపీ నాయకుల మధ్య వివాదాలు జరు గుతున్నాయి. ముఖ్యంగా గుడివాడలో కొత్తగా వచ్చిన వెనిగళ్ల రాముకు టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది. తాజాగా ఇక్కడ సభ పెట్టారు. ఈ సభను విజయవంతం చేయడంలో రాము సక్సెస్ అయ్యారు. ఇక, ఈ సభ వేదికగానే.. ఆయన పేరు ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, చంద్రబాబు కనీసం పేరు కూడా ఎత్తే ప్రయత్నం చేయలేదు.
మరోవైపు పెనమలూరులోనూ.. బోడే ప్రసాద్కు వ్యతిరేకంగా రెండు వర్గాలు పనిచేస్తున్నాయి. ఈ రెండు వర్గాల కారణంగానే.. గత ఎన్నికల్లో బోడే ప్రసాద్ పరాజయం పాలయ్యారనే వాదన ఉంది. ఈ పర్యటన ద్వారా ఆయా వర్గాలను కూర్చోబెట్టి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తారని.. చంద్రబాబుపై ఇక్కడి నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, దీనిపైనా చంద్రబాబు స్పందించలేదు. మరోవైపు.. పామర్రులోనూ.. టికెట్ పోరు తారస్థాయికి చేరింది.
వర్ల రామయ్య కుమారుడు, కుమార్ రాజా కు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా.. మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కూడా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇక్కడ ఇరు వర్గాల మధ్య అంతర్యుద్ధం జోరుగా సాగుతోంది. అదేవిధంగా నూజివీడులోనూ చంద్రబాబు పర్యటనపై ఆశలు రేకెత్తాయి. ఇక్కడ కూడా వర్గ పోరు తారస్థాయిలో ఉండడంతో వాటిని పరిష్కరించాలని.. తమ్ముళ్లు కోరుతున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం కేవలం.. ఒక వైపే చూస్తుండడంతో ఎక్కడి ఘర్షణలు అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయాయి.
This post was last modified on April 14, 2023 10:15 pm
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…