Political News

మ‌ళ్లీ అదే స‌మ‌స్య‌.. క్లారిటీ ఇవ్వ‌ని చంద్ర‌బాబు…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే నిమ్మ‌కూరు, గుడివాడ ప్రాంతాల్లో ఆయ‌న వ‌రుస‌గా స‌భ‌లు పెట్టారు. అదేవిధంగా మ‌చిలీప‌ట్నంలోనూ ప‌ర్య‌టించారు. అయితే.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో త‌మ‌కు ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని.. త‌మ్ముళ్లు ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, చంద్ర‌బాబు చూసీ చూడ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించారు. ముఖ్యంగా నాలుగు నియోజ‌క‌వ ర్గాల్లో నేత‌ల మ‌ధ్య స‌మ‌స్య‌లు ఉన్నాయి.

గుడివాడ‌, నూజివీడు, పెన‌మ‌లూరు, పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గాల్లోని టీడీపీ నాయ‌కుల మ‌ధ్య వివాదాలు జ‌రు గుతున్నాయి. ముఖ్యంగా గుడివాడ‌లో కొత్త‌గా వ‌చ్చిన వెనిగ‌ళ్ల రాముకు టికెట్ ఇస్తార‌నే ప్ర‌చారం ఉంది. తాజాగా ఇక్క‌డ స‌భ పెట్టారు. ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డంలో రాము స‌క్సెస్ అయ్యారు. ఇక‌, ఈ స‌భ వేదిక‌గానే.. ఆయ‌న పేరు ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, చంద్ర‌బాబు క‌నీసం పేరు కూడా ఎత్తే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

మ‌రోవైపు పెన‌మలూరులోనూ.. బోడే ప్ర‌సాద్‌కు వ్య‌తిరేకంగా రెండు వ‌ర్గాలు ప‌నిచేస్తున్నాయి. ఈ రెండు వ‌ర్గాల కార‌ణంగానే.. గ‌త ఎన్నిక‌ల్లో బోడే ప్ర‌సాద్ ప‌రాజ‌యం పాల‌య్యార‌నే వాద‌న ఉంది. ఈ ప‌ర్య‌ట‌న ద్వారా ఆయా వ‌ర్గాల‌ను కూర్చోబెట్టి స‌మ‌స్య ప‌రిష్క‌రించే ప్ర‌యత్నం చేస్తార‌ని.. చంద్ర‌బాబుపై ఇక్క‌డి నాయ‌కులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, దీనిపైనా చంద్ర‌బాబు స్పందించ‌లేదు. మ‌రోవైపు.. పామ‌ర్రులోనూ.. టికెట్ పోరు తార‌స్థాయికి చేరింది.

వ‌ర్ల రామ‌య్య‌ కుమారుడు, కుమార్ రాజా కు టికెట్ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నా.. మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న కూడా ప్ర‌చారం చేసుకుంటున్నారు. దీంతో ఇక్క‌డ ఇరు వ‌ర్గాల మ‌ధ్య అంత‌ర్యుద్ధం జోరుగా సాగుతోంది. అదేవిధంగా నూజివీడులోనూ చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై ఆశ‌లు రేకెత్తాయి. ఇక్క‌డ కూడా వ‌ర్గ పోరు తార‌స్థాయిలో ఉండ‌డంతో వాటిని ప‌రిష్క‌రించాల‌ని.. త‌మ్ముళ్లు కోరుతున్నారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం కేవ‌లం.. ఒక‌ వైపే చూస్తుండ‌డంతో ఎక్క‌డి ఘ‌ర్ష‌ణ‌లు అక్క‌డే ఉన్న‌ట్టుగా ఉండిపోయాయి.

Satya

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

2 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

2 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

4 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

6 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

7 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

8 hours ago