టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే నిమ్మకూరు, గుడివాడ ప్రాంతాల్లో ఆయన వరుసగా సభలు పెట్టారు. అదేవిధంగా మచిలీపట్నంలోనూ పర్యటించారు. అయితే.. చంద్రబాబు పర్యటనలో తమకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని.. తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు చూసీ చూడనట్టే వ్యవహరించారు. ముఖ్యంగా నాలుగు నియోజకవ ర్గాల్లో నేతల మధ్య సమస్యలు ఉన్నాయి.
గుడివాడ, నూజివీడు, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని టీడీపీ నాయకుల మధ్య వివాదాలు జరు గుతున్నాయి. ముఖ్యంగా గుడివాడలో కొత్తగా వచ్చిన వెనిగళ్ల రాముకు టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది. తాజాగా ఇక్కడ సభ పెట్టారు. ఈ సభను విజయవంతం చేయడంలో రాము సక్సెస్ అయ్యారు. ఇక, ఈ సభ వేదికగానే.. ఆయన పేరు ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, చంద్రబాబు కనీసం పేరు కూడా ఎత్తే ప్రయత్నం చేయలేదు.
మరోవైపు పెనమలూరులోనూ.. బోడే ప్రసాద్కు వ్యతిరేకంగా రెండు వర్గాలు పనిచేస్తున్నాయి. ఈ రెండు వర్గాల కారణంగానే.. గత ఎన్నికల్లో బోడే ప్రసాద్ పరాజయం పాలయ్యారనే వాదన ఉంది. ఈ పర్యటన ద్వారా ఆయా వర్గాలను కూర్చోబెట్టి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తారని.. చంద్రబాబుపై ఇక్కడి నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, దీనిపైనా చంద్రబాబు స్పందించలేదు. మరోవైపు.. పామర్రులోనూ.. టికెట్ పోరు తారస్థాయికి చేరింది.
వర్ల రామయ్య కుమారుడు, కుమార్ రాజా కు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా.. మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కూడా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇక్కడ ఇరు వర్గాల మధ్య అంతర్యుద్ధం జోరుగా సాగుతోంది. అదేవిధంగా నూజివీడులోనూ చంద్రబాబు పర్యటనపై ఆశలు రేకెత్తాయి. ఇక్కడ కూడా వర్గ పోరు తారస్థాయిలో ఉండడంతో వాటిని పరిష్కరించాలని.. తమ్ముళ్లు కోరుతున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం కేవలం.. ఒక వైపే చూస్తుండడంతో ఎక్కడి ఘర్షణలు అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయాయి.
This post was last modified on April 14, 2023 10:15 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…