Political News

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం.. ఈసారి ఎవరిని తిడతారు?


సంక్షేమ పథకాల విషయంలో ముందుండే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న విషయం తెలిసిందే. ఆర్థికంగా గడ్డు పరిస్థితికి.. కరోనా తోడుకావటంతో నెల తిరిగేసరికి ఆర్థికశాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఏనెలకు ఆ నెలకు అడ్జెస్ట్ మెంట్లతో కిందామీదా పడాల్సి వస్తోంది. దీనికి తోడు.. రాష్ట్రంలో ఆదాయం బాగా పడిపోవటంతో ఎప్పటికప్పుడు రాష్ట్రం రుణాల దిశగా అడుగులు వేయాల్సి వస్తోంది.

గత నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావటం తెలిసిందే. మండలిలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుతో.. బిల్లుపాస్ కాలేదన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అప్పట్లో టీడీపీ తీరుతోనే ఉద్యోగులకు సమయానికి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేకపోయినట్లుగా ఆరోపించింది ఏపీ అధికారపక్షం. అయితే.. ఇదంతా అధికారపక్ష ప్లానింగ్ లోపమని చెప్పినా.. అంతో ఇంతో చెడ్డపేరు టీడీపీ ఖాతాలో పడింది.

ఇదిలా ఉంటే.. ఈ నెలలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల్ని ఒకటో తేదీన ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. దీనికి కారణం.. ఆర్థికంగా గడ్డు పరిస్థితేనని చెబుతున్నారు. గత నెలలో మాదిరే ఈ నెలలోనూ ఐదోతేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే అవకావం ఉందని.. పెన్షనర్లకు మాత్రం ఈ నెల 8న అందుతాయని చెబుతున్నారు.

ఎందుకింత ఆలస్యమన్న విషయంలోకి వెళితే.. ఆర్బీఐకి బాండ్లు వేలం వేయటం.. నిధుల సమీకరణ చేపట్టి.. ప్రభుత్వం నిధుల్ని విడుదల చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఏ నెలకు ఆ నెల అన్నట్లు పరిస్థితి ఉందని చెబుతున్నారు. గత నెలలో నిందించటానికి తెలుగుదేశం పార్టీ దొరికిందని.. ఈసారి ఎవరి మీద నిందమోపి తిడతారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఇలా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా జీతాలు ఇచ్చే విషయంలో తరచూ ఆలస్యమైతే ప్రభుత్వానికి చెడ్డపేరు పక్కా అని చెబుతున్నారు.

This post was last modified on August 3, 2020 8:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

4 hours ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

5 hours ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

5 hours ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

6 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

7 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

7 hours ago