బీజేపీ ముఖ్య నేత, మోడీ తర్వాత నాయకుడు అయిన అమిత్ షాకు కరోనా సోకింది. కొద్దిగా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్టు చేయించుకోగా… పాజిటివ్ అని తేలినట్లు ఆయన స్వయంగా ట్విట్టరు ద్వారా తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నా కూడా వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉండగా మరో మూడు రోజుల్లో అయోధ్య రామాలయానికి శంకుస్థాపన, భూమిపూజ జరగనున్న నేపథ్యంలో అతిథుల్లో ఒకరైన అమిత్ షాకు కరోనా సోకడం గమనార్హం. ఆగస్టు 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరగనుంది. తాజాగా కరోనా అని తేలడంతో అమిత్ షా ఇక ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదు.
గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోమని అమిత్ షా సూచించారు. ఫలితాలు వెల్లడయ్యే వరకు ఐసోలేషన్లో ఉండమని ఆయన కోరారు. హోం శాఖ మంత్రిగానే కాకుండా పార్టీ పరంగా కాకుండా అమిత్ షా కీలక వ్యక్తి.
ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కమల్ రాణి వరుణ్ కొద్దిరోజులుగా కరోనా సోకి చికిత్స పొందుతూ ఉన్నారు. ఆమె ఈరోజు ఉదయం మరణించారు.
This post was last modified on August 2, 2020 5:07 pm
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…