బీజేపీ ముఖ్య నేత, మోడీ తర్వాత నాయకుడు అయిన అమిత్ షాకు కరోనా సోకింది. కొద్దిగా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్టు చేయించుకోగా… పాజిటివ్ అని తేలినట్లు ఆయన స్వయంగా ట్విట్టరు ద్వారా తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నా కూడా వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉండగా మరో మూడు రోజుల్లో అయోధ్య రామాలయానికి శంకుస్థాపన, భూమిపూజ జరగనున్న నేపథ్యంలో అతిథుల్లో ఒకరైన అమిత్ షాకు కరోనా సోకడం గమనార్హం. ఆగస్టు 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరగనుంది. తాజాగా కరోనా అని తేలడంతో అమిత్ షా ఇక ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదు.
గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోమని అమిత్ షా సూచించారు. ఫలితాలు వెల్లడయ్యే వరకు ఐసోలేషన్లో ఉండమని ఆయన కోరారు. హోం శాఖ మంత్రిగానే కాకుండా పార్టీ పరంగా కాకుండా అమిత్ షా కీలక వ్యక్తి.
ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కమల్ రాణి వరుణ్ కొద్దిరోజులుగా కరోనా సోకి చికిత్స పొందుతూ ఉన్నారు. ఆమె ఈరోజు ఉదయం మరణించారు.
This post was last modified on August 2, 2020 5:07 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…