బీజేపీ ముఖ్య నేత, మోడీ తర్వాత నాయకుడు అయిన అమిత్ షాకు కరోనా సోకింది. కొద్దిగా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్టు చేయించుకోగా… పాజిటివ్ అని తేలినట్లు ఆయన స్వయంగా ట్విట్టరు ద్వారా తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నా కూడా వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉండగా మరో మూడు రోజుల్లో అయోధ్య రామాలయానికి శంకుస్థాపన, భూమిపూజ జరగనున్న నేపథ్యంలో అతిథుల్లో ఒకరైన అమిత్ షాకు కరోనా సోకడం గమనార్హం. ఆగస్టు 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరగనుంది. తాజాగా కరోనా అని తేలడంతో అమిత్ షా ఇక ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదు.
గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోమని అమిత్ షా సూచించారు. ఫలితాలు వెల్లడయ్యే వరకు ఐసోలేషన్లో ఉండమని ఆయన కోరారు. హోం శాఖ మంత్రిగానే కాకుండా పార్టీ పరంగా కాకుండా అమిత్ షా కీలక వ్యక్తి.
ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కమల్ రాణి వరుణ్ కొద్దిరోజులుగా కరోనా సోకి చికిత్స పొందుతూ ఉన్నారు. ఆమె ఈరోజు ఉదయం మరణించారు.
This post was last modified on August 2, 2020 5:07 pm
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…