Political News

బాబు నోట ఎప్పుడూ రాని మాట వచ్చిందే?

తెలుగు రాజకీయాలు పరిచయం ఉన్న ప్రతిఒక్కరికి టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఒక అభిప్రాయం ఉంటుంది. ఆయన్ను అభిమానించే వారెందరో.. విమర్శించే వారు కనిపిస్తారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న ఆయన తీరు మూసపోసినట్లుగా ఒకే ధోరణిలో ఉంటుంది.

ప్రాక్టికల్ గా ఉండే మాటల్లో భావోద్వేగం చాలా తక్కువ. ఎప్పుడో ఒకట్రెండు సార్లకు మించి ఆయన నోటి వెంట ఆ తరహా మాటలు వినిపించవు.

ఇక.. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న దాని మీద కూడా మాట్లాడటం కనిపించదు. అన్నింటికి మించి.. మరణం గురించి ఆయన మాటల్లో ప్రస్తావనకే రాదు. అలాంటి చంద్రబాబు తొలిసారి భిన్నమైన తరహాలో స్పందించారు. ఏపీ రాజధాని అమరావతి స్థానే మూడు రాజధానుల కాన్సెప్టును జగన్ సర్కారు తీసుకోవటం.. తాజాగా దానికి గవర్నర్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో చంద్రబాబు ఎమోషనల్ గా బరస్ట్ అయ్యారు.

తాను అనుభవించటానికి రాజధాని కట్టలేదన్న ఆయన.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా.. నలభై ఏళ్ల రాజకీయాల్లో ఉన్నానని.. తనకు అంతకు మించి ఏం కావాలన్నారు. ఆరోగ్యం బాగుంటే మరో పదేళ్లు ఎక్కువగా బతికి ఉంటానన్న బాబు.. అమరావతి తనకోసమేమీ కాదని..ఈ విషయాన్ని ఏదో ఒకరోజు అందరూ తెలుసుకుంటారన్నారు.

ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆమోదించిన గవర్నర్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఈ రోజు చీకటి రోజుగా అభివర్ణించారు. తాను చెప్పిన మాటల్లో నిజాన్ని.. భవిష్యత్తులో అందరూ ఒప్పుకుంటారని పేర్కొన్నారు. తనకు నచ్చని విషయాల్లో బాబు ఆగ్రహం వ్యక్తం చేయటం మామూలే. అందుకు భిన్నంగా ఈ స్థాయిలో భావోద్వేగంతో మాట్లాడటం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పక తప్పదు.

This post was last modified on August 1, 2020 12:04 pm

Share

Recent Posts

విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తున్నారా

నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…

24 minutes ago

అర్జెంటీనా సముద్రం ఇంకి పోయిందా?

అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని,…

51 minutes ago

శాంసంగ్ ఏడేళ్ల కష్టం.. యాపిల్ ఎందుకింత ఆలస్యం

ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్‌ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…

1 hour ago

ఫౌజీ వెనుక అసలేం జరుగుతోంది

ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…

1 hour ago

స్కూలు సెలవు కోసం మర్డర్ ప్లాన్

మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…

2 hours ago

టాలీవుడ్ హీరోలూ… స్పీడ్ పెంచండయ్యా

కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…

2 hours ago