Political News

బాబు నోట ఎప్పుడూ రాని మాట వచ్చిందే?

తెలుగు రాజకీయాలు పరిచయం ఉన్న ప్రతిఒక్కరికి టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఒక అభిప్రాయం ఉంటుంది. ఆయన్ను అభిమానించే వారెందరో.. విమర్శించే వారు కనిపిస్తారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న ఆయన తీరు మూసపోసినట్లుగా ఒకే ధోరణిలో ఉంటుంది.

ప్రాక్టికల్ గా ఉండే మాటల్లో భావోద్వేగం చాలా తక్కువ. ఎప్పుడో ఒకట్రెండు సార్లకు మించి ఆయన నోటి వెంట ఆ తరహా మాటలు వినిపించవు.

ఇక.. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న దాని మీద కూడా మాట్లాడటం కనిపించదు. అన్నింటికి మించి.. మరణం గురించి ఆయన మాటల్లో ప్రస్తావనకే రాదు. అలాంటి చంద్రబాబు తొలిసారి భిన్నమైన తరహాలో స్పందించారు. ఏపీ రాజధాని అమరావతి స్థానే మూడు రాజధానుల కాన్సెప్టును జగన్ సర్కారు తీసుకోవటం.. తాజాగా దానికి గవర్నర్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో చంద్రబాబు ఎమోషనల్ గా బరస్ట్ అయ్యారు.

తాను అనుభవించటానికి రాజధాని కట్టలేదన్న ఆయన.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా.. నలభై ఏళ్ల రాజకీయాల్లో ఉన్నానని.. తనకు అంతకు మించి ఏం కావాలన్నారు. ఆరోగ్యం బాగుంటే మరో పదేళ్లు ఎక్కువగా బతికి ఉంటానన్న బాబు.. అమరావతి తనకోసమేమీ కాదని..ఈ విషయాన్ని ఏదో ఒకరోజు అందరూ తెలుసుకుంటారన్నారు.

ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆమోదించిన గవర్నర్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఈ రోజు చీకటి రోజుగా అభివర్ణించారు. తాను చెప్పిన మాటల్లో నిజాన్ని.. భవిష్యత్తులో అందరూ ఒప్పుకుంటారని పేర్కొన్నారు. తనకు నచ్చని విషయాల్లో బాబు ఆగ్రహం వ్యక్తం చేయటం మామూలే. అందుకు భిన్నంగా ఈ స్థాయిలో భావోద్వేగంతో మాట్లాడటం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పక తప్పదు.

This post was last modified on August 1, 2020 12:04 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

3 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

4 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

7 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

10 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

11 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

12 hours ago