బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే పేరు ఉన్నట్లుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెపై ఓ సంచలన ఆరోపణ రావడమే ఇందుక్కారణం. ఈ ఏడాది జనవరిలో అల్లర్లతో అట్టుడుకుతున్న ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్శిటీలోకి దీపిక వెళ్లడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. యూనివర్శిటీలో చేపట్టిన కొన్ని సంస్కరణలకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు హింసాత్మక ఆందోళనలకు దిగడం, పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించి విద్యార్థులను చితకబాదడం.. ఈ నేపథ్యంలో దీపిక ధైర్యంగా జేఎన్యూకు వెళ్లి వారికి సంఘీభావం పలకడం చర్చనీయాంశమైంది. తన కొత్త చిత్రం ‘చపాక్’ విడుదలకు ముందు పబ్లిసిటీ కోసమే దీపిక జేఎన్యూకు వెళ్లి హడావుడి చేసిందని కొందరు విమర్శించినప్పటికీ.. చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.
ఐతే ఇప్పుడా వ్యవహారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. జాతీయ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ అధికారి ఎన్కే సూద్ దీపిక మీద సంచలన ఆరోపణ చేశారు. పాకిస్థాన్కు చెందిన బడా పారిశ్రామిక వేత్త అనీల్ ముసారత్ కోరిక మేరకే దీపిక జేఎన్యూకు వెళ్లిందని.. ఇందుకు గాను ఆమెకు రూ.5 కోట్లు ముట్టాయని ఆరోపించాడు. ఎవరో ఆషామాషీ వ్యక్తి ఈ ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన పని లేదు కానీ.. ‘రా’ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేసిన మాజీ అధికారి యూట్యూబ్ వీడియో ద్వారా ఇలా ఆరోపించడంతో దీనిపై చర్చ నడుస్తోంది. జేఎన్యూలో లెఫ్ట్ భావజాలంతో ఉండే చాలామంది.. దేశ వ్యతిరేక నినాదాలు చేయడం, వివిధ అంశాల్లో పాకిస్థాన్ను సమర్థించడం చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇక్కడి వారికి పాక్ నుంచి ఆర్థిక సహకారం అందుతూ ఉంటుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీపిక మీద వచ్చిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
This post was last modified on August 1, 2020 5:53 am
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…