Political News

దీపికా పదుకొనేపై సంచలన ఆరోపణలు

బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే పేరు ఉన్నట్లుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెపై ఓ సంచలన ఆరోపణ రావడమే ఇందుక్కారణం. ఈ ఏడాది జనవరిలో అల్లర్లతో అట్టుడుకుతున్న ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్శిటీలోకి దీపిక వెళ్లడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. యూనివర్శిటీలో చేపట్టిన కొన్ని సంస్కరణలకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు హింసాత్మక ఆందోళనలకు దిగడం, పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించి విద్యార్థులను చితకబాదడం.. ఈ నేపథ్యంలో దీపిక ధైర్యంగా జేఎన్యూకు వెళ్లి వారికి సంఘీభావం పలకడం చర్చనీయాంశమైంది. తన కొత్త చిత్రం ‘చపాక్’ విడుదలకు ముందు పబ్లిసిటీ కోసమే దీపిక జేఎన్‌యూకు వెళ్లి హడావుడి చేసిందని కొందరు విమర్శించినప్పటికీ.. చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

ఐతే ఇప్పుడా వ్యవహారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. జాతీయ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ అధికారి ఎన్కే సూద్ దీపిక మీద సంచలన ఆరోపణ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన బడా పారిశ్రామిక వేత్త అనీల్ ముసారత్ కోరిక మేరకే దీపిక జేఎన్‌యూకు వెళ్లిందని.. ఇందుకు గాను ఆమెకు రూ.5 కోట్లు ముట్టాయని ఆరోపించాడు. ఎవరో ఆషామాషీ వ్యక్తి ఈ ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన పని లేదు కానీ.. ‘రా’ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేసిన మాజీ అధికారి యూట్యూబ్ వీడియో ద్వారా ఇలా ఆరోపించడంతో దీనిపై చర్చ నడుస్తోంది. జేఎన్‌యూలో లెఫ్ట్ భావజాలంతో ఉండే చాలామంది.. దేశ వ్యతిరేక నినాదాలు చేయడం, వివిధ అంశాల్లో పాకిస్థాన్‌ను సమర్థించడం చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇక్కడి వారికి పాక్ నుంచి ఆర్థిక సహకారం అందుతూ ఉంటుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీపిక మీద వచ్చిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

This post was last modified on August 1, 2020 5:53 am

Share
Show comments
Published by
suman

Recent Posts

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

52 minutes ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

2 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

2 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

3 hours ago

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన `లేబ‌ర్ అడ్డా` గురించి తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త 2024లో కూట‌మి క‌ట్టి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌..…

5 hours ago

టబు పాత్రను హీరో తగ్గించాడా?

బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…

14 hours ago