ఆంత్రాక్స్.. ఒకప్పుడు ఈ పదం ఓ సంచలనం. ఇదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అమెరికాపై బయోవార్ చేసే ఉద్దేశంతో ఉగ్రవాదులు ఈ ఇన్ఫెక్షన్ కలిగించే పౌడర్ను ఆ దేశానికి పంపేవాళ్లు. అమెరికన్ల అడ్రస్లు సేకరించి.. రాండమ్గా ఆంత్రాక్స్ పౌడర్ను కొరియర్, పోస్టు చేసేవాళ్లు. ఆ ప్యాకెట్ తెరవగానే ఇన్ఫెక్షన్ సోకేది. 2001 సెప్టెంబరు 11 దాడుల తర్వాత మీడియా వాళ్లతో పాటు వివిధ వర్గాల వాళ్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదవాదులు ఆంత్రాక్స్ ఎటాక్స్ చేశారు. అప్నట్లో ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడు అమెరికాకు బద్ధ విరోధిగా మారిన చైనా.. ఆ దేశంపై ఇలాగే మరో రకమైన దాడి చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా నుంచి అమెరికన్లకు ప్యాకెట్ల ద్వారా విత్తనాలు వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది.
అమెరికా వాతావరణాన్ని దెబ్బ తీసే ఉద్దేశంతో చైనీయులు ఈ విత్తనాలు తయారు చేసి పంపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విత్తనాలు నాటితే అవి వాతావరణ సమతుల్యాన్ని దెబ్బ తీస్తాయని అంటున్నారు. వందల సంఖ్యలో అమెరికన్లు ఈ విత్తనాల ప్యాకెట్లను పోస్ట్, ఇతర మార్గాల్లో అందుకున్నారు. వీటి గురించి తెలుసుకున్న యుఎస్ వ్యవసాయ విభాగం శాస్త్రవేత్తలు వాటిని సేకరించి పరిశోధన జరుపుతున్నారు. కచ్చితంగా ఇది చైనా కుట్రలో భాగమే అని భావిస్తున్నారు. ప్రపంచంలో తమ ఆధిపత్యానికి సవాలు విసిరే చైనాతో అమెరికాకు ఎప్పుడూ కయ్యమే. ఈ మధ్య అది మరింత ముదిరింది. ప్రస్తుతం అమెరికా కరోనాతో అల్లాడుతుండటానికి చైనానే కారణమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. ఆ దేశం గురించి తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తున్నాడు. దీంతో ఇరు దేశాల మధ్య అగాథం మరింత పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఈ విత్తనాల గొడవ చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏం తేలుస్తారో చూడాలి.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…