Political News

అమెరికాపై చైనా ‘విత్తనాల’ కుట్ర?

ఆంత్రాక్స్.. ఒకప్పుడు ఈ పదం ఓ సంచలనం. ఇదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అమెరికాపై బయోవార్ చేసే ఉద్దేశంతో ఉగ్రవాదులు ఈ ఇన్ఫెక్షన్ కలిగించే పౌడర్‌ను ఆ దేశానికి పంపేవాళ్లు. అమెరికన్ల అడ్రస్‌లు సేకరించి.. రాండమ్‌గా ఆంత్రాక్స్ పౌడర్‌ను కొరియర్, పోస్టు చేసేవాళ్లు. ఆ ప్యాకెట్ తెరవగానే ఇన్ఫెక్షన్ సోకేది. 2001 సెప్టెంబరు 11 దాడుల తర్వాత మీడియా వాళ్లతో పాటు వివిధ వర్గాల వాళ్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదవాదులు ఆంత్రాక్స్ ఎటాక్స్ చేశారు. అప్నట్లో ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడు అమెరికాకు బద్ధ విరోధిగా మారిన చైనా.. ఆ దేశంపై ఇలాగే మరో రకమైన దాడి చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా నుంచి అమెరికన్లకు ప్యాకెట్ల ద్వారా విత్తనాలు వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది.

అమెరికా వాతావరణాన్ని దెబ్బ తీసే ఉద్దేశంతో చైనీయులు ఈ విత్తనాలు తయారు చేసి పంపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విత్తనాలు నాటితే అవి వాతావరణ సమతుల్యాన్ని దెబ్బ తీస్తాయని అంటున్నారు. వందల సంఖ్యలో అమెరికన్లు ఈ విత్తనాల ప్యాకెట్లను పోస్ట్, ఇతర మార్గాల్లో అందుకున్నారు. వీటి గురించి తెలుసుకున్న యుఎస్ వ్యవసాయ విభాగం శాస్త్రవేత్తలు వాటిని సేకరించి పరిశోధన జరుపుతున్నారు. కచ్చితంగా ఇది చైనా కుట్రలో భాగమే అని భావిస్తున్నారు. ప్రపంచంలో తమ ఆధిపత్యానికి సవాలు విసిరే చైనాతో అమెరికాకు ఎప్పుడూ కయ్యమే. ఈ మధ్య అది మరింత ముదిరింది. ప్రస్తుతం అమెరికా కరోనాతో అల్లాడుతుండటానికి చైనానే కారణమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. ఆ దేశం గురించి తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తున్నాడు. దీంతో ఇరు దేశాల మధ్య అగాథం మరింత పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఈ విత్తనాల గొడవ చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏం తేలుస్తారో చూడాలి.

This post was last modified on July 31, 2020 6:38 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

39 minutes ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

1 hour ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

10 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

11 hours ago