Political News

వీర్రాజు వ‌చ్చారు…బీజేపీ నేత‌ల బీపీ పెంచేస్తున్నారు

సోము వీర్రాజు…ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీకరించిన పార్టీ సీనియ‌ర్ నేత‌. ఆయ‌న ఎంట్రీతోనే త‌న వైఖ‌రి ఏంటో స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుత అధికార ప‌క్షం, గ‌తంలో ప‌రిపాలించిన టీడీపీ అనే తేడా లేకుండా త‌న‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ తప్పిదాల‌ను విమర్శిస్తూనే గతంలో జరిగిన అవినీతిని వెలికితీయడానికి కూడా కృషిచేస్తామన్నారు.

పోలవరం నిధులు రాబట్టడానికి సహకరిస్తామంటూనే గతంలో ఇచ్చిన దానికి లెక్కలు రావాలన్నారు. వైసీపీ టీడీపీలు రెండు కళ్లయితే తాము త్రినేత్రులుగా వ్యవహరిస్తామన్నారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా, బీజేపీలోని నేత‌ల‌కు సైతం వీర్రాజు బీపీ పెంచేస్తున్నార‌నే టాక్ తెర‌మీద‌కు వ‌స్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి విష‌యంలో ఆయ‌న ఇచ్చిన త‌క్ష‌ణ కౌంట‌ర్ దీనికి నిద‌ర్శనం.

ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఇంకా రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని అన్నారు. అమరావతి రైతులు, కోర్టులు చూస్తూ ఉండవన్న ఆయన కేంద్రం సరైన సమయంలో..సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కేంద్రానికి ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

పోలవరం…కానీ రాజధాని కాని ఏమైనా ముందుకు సాగిందా..? అని ప్రశ్నించిన ఆయన అధికార వికేంద్రీకరణ అంటే… అవసరాల కోసం రాజధానులు పెట్టడం కాదని అన్నారు. శాస‌న మండ‌లి ఆమోదించకుండా మూడు రాజధానుల బిల్లును గవర్నర్ కి పంపడమే రాజ్యాంగ విరుద్ధమని సుజ‌నా చౌద‌రి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెంట‌నే దీనిపై స్పందించారు. ఏపీ రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదని తేల్చిచెప్పారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు పెడుతున్నారన్న వీర్రాజు ఆ విషయంలో ఎప్పుడూ కేంద్రం జోక్యం చేసుకోలేదని తేల్చిచెప్పారు. రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అని చంద్రబాబు కథలు చెప్పారని, చంద్రబాబు మాటల పై కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు మూడు రాజధానుల విషయంలోనూ అదే వైఖరితో ఉన్నామని చెప్పుకొచ్చారు.

కాగా, గ‌తంలో బీజేపీ అధ్య‌క్షుడిగా క‌న్నా లక్ష్మినారాయణ ఉన్న స‌మ‌యంలో ఆయ‌న వివిధ ప్రకటనలు చేయడం ఆ వెంటనే జివిఎల్‌ నరసింహరావు, రాం మాధవ్‌ వంటివారు భిన్నస్వరం వినిపించడం తెలిసిన సంగ‌తే. తాజాగా, ఢిల్లీ నేత‌ల వ‌ద్ద‌కు ఎపిసోడ్ వెళ్ల‌కుండా వీర్రాజే నేరుగా ఎంట్రీ ఇచ్చి వెంట‌నే కౌంట‌ర్లు ఇస్తున్న నేప‌థ్యంలో వీర్రాజు కాక పెంచేస్తున్నార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on August 1, 2020 5:54 am

Share

Recent Posts

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

36 minutes ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

5 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

8 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

8 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

9 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

9 hours ago