Political News

వీర్రాజు వ‌చ్చారు…బీజేపీ నేత‌ల బీపీ పెంచేస్తున్నారు

సోము వీర్రాజు…ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీకరించిన పార్టీ సీనియ‌ర్ నేత‌. ఆయ‌న ఎంట్రీతోనే త‌న వైఖ‌రి ఏంటో స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుత అధికార ప‌క్షం, గ‌తంలో ప‌రిపాలించిన టీడీపీ అనే తేడా లేకుండా త‌న‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ తప్పిదాల‌ను విమర్శిస్తూనే గతంలో జరిగిన అవినీతిని వెలికితీయడానికి కూడా కృషిచేస్తామన్నారు.

పోలవరం నిధులు రాబట్టడానికి సహకరిస్తామంటూనే గతంలో ఇచ్చిన దానికి లెక్కలు రావాలన్నారు. వైసీపీ టీడీపీలు రెండు కళ్లయితే తాము త్రినేత్రులుగా వ్యవహరిస్తామన్నారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా, బీజేపీలోని నేత‌ల‌కు సైతం వీర్రాజు బీపీ పెంచేస్తున్నార‌నే టాక్ తెర‌మీద‌కు వ‌స్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి విష‌యంలో ఆయ‌న ఇచ్చిన త‌క్ష‌ణ కౌంట‌ర్ దీనికి నిద‌ర్శనం.

ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఇంకా రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని అన్నారు. అమరావతి రైతులు, కోర్టులు చూస్తూ ఉండవన్న ఆయన కేంద్రం సరైన సమయంలో..సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కేంద్రానికి ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

పోలవరం…కానీ రాజధాని కాని ఏమైనా ముందుకు సాగిందా..? అని ప్రశ్నించిన ఆయన అధికార వికేంద్రీకరణ అంటే… అవసరాల కోసం రాజధానులు పెట్టడం కాదని అన్నారు. శాస‌న మండ‌లి ఆమోదించకుండా మూడు రాజధానుల బిల్లును గవర్నర్ కి పంపడమే రాజ్యాంగ విరుద్ధమని సుజ‌నా చౌద‌రి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెంట‌నే దీనిపై స్పందించారు. ఏపీ రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదని తేల్చిచెప్పారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు పెడుతున్నారన్న వీర్రాజు ఆ విషయంలో ఎప్పుడూ కేంద్రం జోక్యం చేసుకోలేదని తేల్చిచెప్పారు. రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అని చంద్రబాబు కథలు చెప్పారని, చంద్రబాబు మాటల పై కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు మూడు రాజధానుల విషయంలోనూ అదే వైఖరితో ఉన్నామని చెప్పుకొచ్చారు.

కాగా, గ‌తంలో బీజేపీ అధ్య‌క్షుడిగా క‌న్నా లక్ష్మినారాయణ ఉన్న స‌మ‌యంలో ఆయ‌న వివిధ ప్రకటనలు చేయడం ఆ వెంటనే జివిఎల్‌ నరసింహరావు, రాం మాధవ్‌ వంటివారు భిన్నస్వరం వినిపించడం తెలిసిన సంగ‌తే. తాజాగా, ఢిల్లీ నేత‌ల వ‌ద్ద‌కు ఎపిసోడ్ వెళ్ల‌కుండా వీర్రాజే నేరుగా ఎంట్రీ ఇచ్చి వెంట‌నే కౌంట‌ర్లు ఇస్తున్న నేప‌థ్యంలో వీర్రాజు కాక పెంచేస్తున్నార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on August 1, 2020 5:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

16 minutes ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

2 hours ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

3 hours ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

4 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

5 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

6 hours ago