Political News

కేసీఆర్ అండ్ జగన్.. కేజ్రీవాల్‌ను చూడండయ్యా

కరోనా అందరినీ కష్టపెడుతోంది. ఆదాయం పడిపోయి.. ఉపాధి కోల్పోయి అల్లాడిపోతున్నారు జనం. ఇలాంటి సమయంలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఏ రకంగా అయినా జనాల్ని దోపిడీ చేయడం అన్యాయం. జనాల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాన్ని నడపడానికి, తమ ఆదాయం పెంచుకోవడానికి జనాల్నే బాదేస్తున్నాయి.

గత కొన్ని వారాల్లో పెట్రోలు రేట్లు ఎలా పెరుగుతూ పోయాయో తెలిసిందే. 75 రూపాయల్లోపు ఉన్న పెట్రోలు ధర 83 రూపాయలకు చేరువైంది. పెట్రోలుతో పోలిస్తే తక్కువ ఉండే డీజిల్ దానికి దీటుగా తయారవడం పెద్ద విషాదం. ఆటోలు, లారీలు, ఇతర వాహనాల మీద బతికే పేద, మధ్య తరగతి జీవుల కష్టం ఎవరికి అర్థమవుతుంది. ఇంధన ఖర్చు కలిసొస్తుందని డీజిల్ వెహికల్ కొన్నవారి పరిస్థితి ఏంటి?

అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గుతున్నా సరే.. కేంద్రం పెట్రోలు, డీజిలు ధరలు పెంచుతూ పోతోంది. మరోవైపు రాష్ట్రాలు ఎడాపెడా పన్నులు బాదేస్తున్నాయి. వీళ్లయినా పన్నులు తగ్గిస్తారనుకుంటే.. అదనంగా వడ్డిస్తున్నారు. ఇటీవలే జగన్ సర్కారు ఎలా వడ్డన చేసిందో తెలిసిందే. తెలంగాణ కూడా తక్కువేమీ కాదు. ఇలాంటి సమయంలో కేసీఆర్, జగన్ సహా ఇండియాలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ పాఠం నేర్పే పని చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.

ఆయన డీజిల్ మీద ఢిల్లీలో 30 శాతంగా ఉన్న రాష్ట్ర వ్యాట్‌ను 16.75 శాతానికి తగ్గించేశారు. దీంతో ఢిల్లీలో డీజిల్ ధర 82 రూపాయల నుంచి 73.64 రూపాయలకు తగ్గింది. డీజిల్ ధర పెరిగితే డీజిల్ వాహనాల మీద ఆధారపడ్డ పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోవడమే కాదు.. సరకు రవాణా భారమై నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతాయి. అలా కూడా జనాల మీద భారం పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఢిల్లీ సీఎం కరుణ చూపారు. మిగతా సీఎంలు కూడా ఆయన్ని అనుసరించాల్సిన అవసరముంది.

This post was last modified on July 31, 2020 8:35 am

Share
Show comments
Published by
satya

Recent Posts

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

7 mins ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

2 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

2 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

2 hours ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

3 hours ago

ఇటు సత్యదేవ్ అటు రోహిత్ మధ్యలో కోతులు

మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…

4 hours ago