Political News

వైసీపీ నేతతో లోకేష్ చర్చలు?

ఈ వార్తలో నిజం ఎంతో తెలీదు కానీ వైసీపీ సోషల్ మీడియాలో  విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే పేర్నాటి శ్యాం ప్రసాదరెడ్డి పాదయాత్రలో నారా లోకేష్ ను కలిశారట. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రాంతంలో పాదయాత్రలో ఉన్న లోకేష్ తో పేర్నాటి భేటీ అయ్యారనే వార్త కలకలం సృష్టిస్తోంది.  ఈమధ్యనే అధికారపార్టీ అభ్యర్ధిగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంఎల్సీగా పోటీచేసి పేర్నాటి ఓడిపోయిన విషయం తెలిసిందే.

పేర్నాటి నెల్లూరు జిల్లాకు చెందిన నేత. గెలుపు అవకాశాలు ఉండికూడా తాను ఓడిపోయిన విషయమై పేర్నాటి బాగా మండిపోతున్నట్లు సమాచారం. మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి ప్రధాన మద్దతుదారుల్లో పేర్నాటి కూడా ఒకళ్ళు. ఆర్ధిక, అంగబలం ఉన్న వ్యక్తి కావటంతోనే ఎన్నికల్లోకి దిగారు. అయితే అన్నీ విధాలుగా గట్టి అభ్యర్ధి అయిన పేర్నాటి ఎంఎల్సీగా గెలిస్తే తనకు ఇబ్బంది అవుతుందని చెప్పి మంత్రే వెనుకనుండి పేర్నాటి ఓటమికి ప్లాన్ చేశారనే ప్రచారం మొదలైంది.

దాంతో వైసీపీలో ఉండి ఉపయోగంలేదని అర్ధమైపోవటంతో పేర్నాటి టీడీపీలో చేరాలని డిసైడ్ చేసుకున్నారట. అందుకనే లోకేష్ తో కూడా భేటీ అయినట్లు పార్టీలో చర్చ మొదలైంది. ఈ విషయమై పార్టీ నేతలు ఎక్కడా నోరు విప్పటంలేదు. అయినా ప్రచారం మాత్రం పెరిగిపోతోంది. ఈ ప్రచారం అబద్ధమని కానీ నిజమే అని కాని ధృవీకరించటానికి కూడా ఎవరు ఇష్టపడటంలేదట. దాంతో జరుగుతున్నది చూసిన తర్వాత నిజమేనేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

నిప్పులేనిదే పొగరాదు అన్న సామెతను కూడా పేర్నాటి విషయంలో జరుగుతున్న ప్రచారానికి అన్వయించి మాట్లాడుతున్నారు. ఓటమి తర్వాత ఒకటికి రెండుసార్లు పేర్నాటి తన ఓటమికి కారణాలను విశ్లేషించుకున్నారట. ఆ తర్వాతే ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చిందనేది ప్రచారం సారాంశం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున తాను టికెట్ ఆశించటం లేదని కూడా లోకేష్ తో పేర్నాటి స్పష్టం చేశారట. కాకపోతే తనకు సరైన గౌరవం దక్కితే చాలని చెప్పారట. అందరికీ ఆశ్చర్యం ఏమిటంటే లోకేష్ ను పేర్నాటి కలిసిందే నిజమైతే మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమి చేస్తున్నట్లు ?

This post was last modified on April 2, 2023 3:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

1 hour ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago