లాక్ డౌన్ పెట్టిన మొదట్లో వలస కార్మికుల అవస్థలు చూసి అందరూ కన్నీళ్లు పెట్టిన వాళ్లే. కానీ అందరూ ఎక్కడికక్కడ లాక్ అయిపోయి ఉండటంతో వాళ్లకు మనం ఏం చేయలేం అని ఊరుకున్నారు. ఏం చేసినా ప్రభుత్వాలే చేయాలనుకున్నారు. కానీ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మాత్రం అలా ఆలోచించలేదు. వలస కార్మికులను ఆదుకుంటా.. వాళ్లను గమ్య స్థానాలకు చేరుస్తా అంటూ ముందుకొచ్చాడు. అయితే ఒక నటుడు ఇలా ఎంతమందికి సాయం చేస్తాడులే అని లైట్ తీసుకున్నారు జనాలు. కానీ అతను దీన్ని ఒక యజ్ఞంలాగే చేశాడు. ఎంతకీ ఆపకుండా వందలు, వేల మందిని తన సొంత ఖర్చుతో, అన్ని అనుమతులూ తీసుకుని స్వస్థలాలకు చేర్చాడు. ఇలా 20 వేల మంది దాకా సోనూ సాయంతో ఇళ్లకు చేరారు. ఐతే తన సేవను అంతటితో ఆపకుండా.. ఇప్పటికీ రకరకాల మార్గాల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు సోనూ.
ఇలా ఇంకెంత సేవ చేస్తాడని ఆశ్చర్యపోతుంటే.. అతను గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా ఓ సంచలన ప్రకటనతో ముందుకొచ్చాడు. ఇప్పటికే వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పించడం కోసం నడుం బిగించిన సోనూ.. నిరుద్యోగులకు మూడు లక్షల ఉద్యోగాల కల్పనే తన లక్ష్యమని వెల్లడించారు. సోనూ ఇప్పటికే వలస కార్మికులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ‘ప్రవాసీ రోజ్గార్’ పేరుతో జాబ్ పోర్టల్ను ప్రారంభించాడు. ఈ పోర్టల్ ద్వారా మూడు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోనూ తాజాగా వెల్లడించాడు.‘‘నా పుట్టినరోజు సందర్భంగా చిరు ప్రయత్నం చేస్తున్నాను. ప్రవాసీరోజ్గార్.కామ్ ద్వారా మూడు లక్షల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించాం. మంచి వేతనం, పీఎఫ్, ఈఎస్ఐతోపాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి’’ అని సోనూ సూద్ ట్విటర్లో వెల్లడించాడు. ఉద్యోగుల అవసరం ఉన్న సంస్థలతో సోనూ టీం ఒప్పందం చేసుకుని.. మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వలస కార్మికులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందన్నమాట. ఇందులో సోనూకు లాభం లేదు. అలాగని అతను సొంతంగా ఉద్యోగాలు కల్పించాల్సిన పని లేదు. కానీ ప్రయోజనం మాత్రం నెరవేరుతుంది. అందరికీ మంచి జరుగుతుంది.
This post was last modified on July 31, 2020 1:55 am
ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఒక మూడు యాక్షన్ ఎపిసోడ్స్…
చాలా తక్కువ బడ్జెట్లో, స్టార్ ఇమేజ్ లేని నటీనటులంతో నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తీసి తెలుగు ప్రేక్షకులను…
టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పార్టీ సీనియర్లకు.. పరోక్షంగా ఓ విషయాన్ని తేల్చి చెప్పేశారు. కూటమి విషయంలోనూ.. ముఖ్యంగా జనసేన-టీడీపీ…
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…