లాక్ డౌన్ పెట్టిన మొదట్లో వలస కార్మికుల అవస్థలు చూసి అందరూ కన్నీళ్లు పెట్టిన వాళ్లే. కానీ అందరూ ఎక్కడికక్కడ లాక్ అయిపోయి ఉండటంతో వాళ్లకు మనం ఏం చేయలేం అని ఊరుకున్నారు. ఏం చేసినా ప్రభుత్వాలే చేయాలనుకున్నారు. కానీ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మాత్రం అలా ఆలోచించలేదు. వలస కార్మికులను ఆదుకుంటా.. వాళ్లను గమ్య స్థానాలకు చేరుస్తా అంటూ ముందుకొచ్చాడు. అయితే ఒక నటుడు ఇలా ఎంతమందికి సాయం చేస్తాడులే అని లైట్ తీసుకున్నారు జనాలు. కానీ అతను దీన్ని ఒక యజ్ఞంలాగే చేశాడు. ఎంతకీ ఆపకుండా వందలు, వేల మందిని తన సొంత ఖర్చుతో, అన్ని అనుమతులూ తీసుకుని స్వస్థలాలకు చేర్చాడు. ఇలా 20 వేల మంది దాకా సోనూ సాయంతో ఇళ్లకు చేరారు. ఐతే తన సేవను అంతటితో ఆపకుండా.. ఇప్పటికీ రకరకాల మార్గాల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు సోనూ.
ఇలా ఇంకెంత సేవ చేస్తాడని ఆశ్చర్యపోతుంటే.. అతను గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా ఓ సంచలన ప్రకటనతో ముందుకొచ్చాడు. ఇప్పటికే వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పించడం కోసం నడుం బిగించిన సోనూ.. నిరుద్యోగులకు మూడు లక్షల ఉద్యోగాల కల్పనే తన లక్ష్యమని వెల్లడించారు. సోనూ ఇప్పటికే వలస కార్మికులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ‘ప్రవాసీ రోజ్గార్’ పేరుతో జాబ్ పోర్టల్ను ప్రారంభించాడు. ఈ పోర్టల్ ద్వారా మూడు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోనూ తాజాగా వెల్లడించాడు.‘‘నా పుట్టినరోజు సందర్భంగా చిరు ప్రయత్నం చేస్తున్నాను. ప్రవాసీరోజ్గార్.కామ్ ద్వారా మూడు లక్షల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించాం. మంచి వేతనం, పీఎఫ్, ఈఎస్ఐతోపాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి’’ అని సోనూ సూద్ ట్విటర్లో వెల్లడించాడు. ఉద్యోగుల అవసరం ఉన్న సంస్థలతో సోనూ టీం ఒప్పందం చేసుకుని.. మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వలస కార్మికులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందన్నమాట. ఇందులో సోనూకు లాభం లేదు. అలాగని అతను సొంతంగా ఉద్యోగాలు కల్పించాల్సిన పని లేదు. కానీ ప్రయోజనం మాత్రం నెరవేరుతుంది. అందరికీ మంచి జరుగుతుంది.
This post was last modified on July 31, 2020 1:55 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…