తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బలమైన ప్రతిపక్షంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటీవలి కాలంలో రెండు అంశాలపై ఈ విమర్శలు-ప్రతి విమర్శల పరంపర కొనసాగుతోంది.
తెలంగాణలో కరోనా కలకలం ఒకటి కాగా, ప్రస్తుత సచివాలయం కూల్చివేసి కొత్తది నిర్మించడం ఇంకో విషయం. అయితే, రెండో విషయంలో ఇన్నాళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్పై విరుచుకుపడుతున్న బీజేపీ సరిగ్గా అలాంటి చాన్సే గులాబీ దళపతి టీంకు అందించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
‘సెంట్రల్ విస్టా రెనోవేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు’లో భాగంగా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడానికి కేంద్రం సంకల్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్టు అవశ్యకతను సవాలు చేస్తూ నిఖిల్ సూరి అనే లాయర్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అఫిడవిట్ సమర్పించింది.
ప్రస్తుత పార్లమెంటు భవనం పురాతనమైనదని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేదని అందులో పేర్కొన్నది. 100 ఏళ్లు పైబడిన ఈ భవనంలో సాంకేతిక సమస్యలతో పాటు భద్రతాపరంగా లోపాలున్నాయని తెలిపింది. పార్లమెంటు భవనం అగ్నిమాపక శాఖ నిబంధనలకు అనుగుణంగా లేదని, అగ్ని ప్రమాదాలు జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని పేర్కొంది.
కాగా, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం సచివాలయం విషయంలో ఇదే వాదన వినిపిస్తోంది. సచివాలయంలో ఇప్పుడున్న భవనాలు ఒక్కొక్కటి ఒక్కోసారి కట్టినవి. ఒకటి పాతదైందని కూల్చి కొత్తది కట్టేసరికి మరొకటి పాతది అవుతోంది.
ఈ అతుకుల బొంత సంసారం దశాబ్దాలుగా కొనసాగుతోందని పేర్కొంటూ… ఎప్పటికైనా కొత్త సచివాలయం కట్టుకోక తప్పదు కాబట్టి ఇప్పుడు మొదలు పెడుతున్నట్లు చెప్తోంది. తాజాగా, కేంద్రం పార్లమెంటు భవనం విషయంలో ముందుకు సాగుతున్న తీరును ప్రస్తావిస్తూ ఒకింత దూకుడుగానే స్పందించనున్నట్లు సమాచారం.
This post was last modified on July 30, 2020 4:50 pm
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…