Political News

బాబు చేసిన పొరపాటే జగన్ కూడా చేస్తున్నారా?

రాజకీయంగా ఒప్పులు చేయకున్నా ఫర్లేదు తప్పులు మాత్రం చేయకూడదు. బలంగా ఉన్నప్పుడు.. అందునా అధికారంలో చేతిలో ఉన్నప్పుడు చేసే తప్పులు కొట్టుకుపోతాయి. అయితే.. తర్వాతి రోజుల్లో మత్రం ఇవన్నీ కలిసి కట్టుగా దండయాత్ర చేసినట్లుగా మీద పడతాయి. అప్పుడు వరుస ఎదురుదెబ్బలు తప్పవు. అందుకు నిలువెత్తు రూపంగా టీడీపీ అధినేత చంద్రబాబును చెప్పొచ్చు.

తెలుగు రాజకీయాల్లో ప్రతి విషయంలోనూ బాబును వేలెత్తి చూపించినంతగా మరే నేతను ఎవరూ చూపించరు. దీనికి కారణం.. చాలా విషయాల్లో బాబు అనుసరించిన విధానమే అని చెబుతారు. మరిన్ని తప్పులు చేసి కూడా అంతబలమైన నాయకుడిగా ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారంటే.. దాన్నే కాలమహిమగా చెబుతారు. పవర్ వచ్చినంతనే అప్పటివరకూ లేని కొత్త ఇమేజ్ చాలామందిలో వస్తుంది. అదంతా గెలుపు పుణ్యంగా చెప్పొచ్చు.

ఏపీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికే వస్తే.. ఆయన తీసుకునే నిర్ణయాల్ని ఎవరూ ప్రశ్నించే స్థితిలో లేరు. ఆ మాటకు వస్తే.. ఆయన్ను ప్రభావితం చేసేటోళ్లు కూడా ఎవరూ లేరు. ఆ మాటకు వస్తే.. చంద్రబాబును ప్రభావితం చేసే కొన్ని లాబీలు.. వ్యక్తులు ఉండనైనా ఉన్నారు. కానీ.. జగన్ అందుకు భిన్నం.

ఆయన ఏమనుకుంటే అదే ఫైనల్. ఎవరూ ఆయన మనసును మార్చలేరు. అంతటి పవర్ ఆయన సొంతం. అలాంటి జగన్.. కొన్ని విషయాల్లో తప్పులు చేస్తున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. పార్టీలో ఎంతోకాలంగా పని చేస్తూ.. జగన్ ఇచ్చే పదవుల కోసం చకోర పక్షుల మాదిరి వెయిట్ చేసేటోళ్లకు కొదవ లేదు. అయినప్పటికీ ఆయన మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కేటాయిస్తున్న తీరుపై మాత్రం కినుకు వ్యక్తమవుతోంది. అయితే.. అదేమీ బయటకు రావట్లేదు. తమ ప్రైవేటు సంభాషణల్లో అది కూడా చాలా నమ్మకమైన వారి వద్ద మాత్రమే తమ ఫీలింగ్స్ ను చెబుతున్నట్లుగా చెబుతున్నారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట ఉన్న వారిలో కొందరికి సరైన పదవులు లభించింది లేదు. కానీ.. పార్టీ పవర్ లోకి వచ్చిన తర్వాత వచ్చే ప్యారాచూట్ నేతలకు మాత్రం పదవులు వస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. బాబు కూడా ఇలాంటి తీరునే ప్రదర్శిస్తారన్న పేరుంది. మొన్నటికి మొన్న డొక్కా విషయంలోనూ అదే జరిగింది. అంతకు ముందు కూడా టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వటం కనిపిస్తుంది.

తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీల ఎంపికలోనూ పండుల రవీంద్రబాబుకు అవకాశం ఇచ్చారు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఆయనకు టికెట్ ఇవ్వకపోవటం.. తర్వాత సర్దుబాబు చేస్తానని చెప్పిన దానికి తగ్గట్లే.. ఆయనకు ఎమ్మెల్స ఇచ్చినట్లుగా చెబుతారు. ఇప్పటికే పదవుల కోసం ఎదురుచూస్తున్న ఎంతో మందిని వదిలి రవీంద్రబాబుకు ఇవ్వటం సరికాదన్న వాదన వినిపిస్తోంది.

నిజంగానే రవీంద్రబాబుకు న్యాయం చేయాలంటే ఏదైనా కార్పొరేషన్ ఛైర్మన్ గిరి ఇవ్వొచ్చుగా? అన్న మాట కొందరి నోట వినిపిస్తుండటం గమనార్హం. బాబు మాదిరే జగన్ సైతం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేయటం ఏమిటన్నది ఇప్పుడు చర్చగా ఉంది. ఈ విషయాన్ని జగన్ గుర్తిస్తున్నారా?

This post was last modified on July 30, 2020 11:58 am

Share
Show comments
Published by
satya

Recent Posts

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

54 mins ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

1 hour ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

2 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

2 hours ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

2 hours ago

బీఆర్ ఎస్‌కు భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠ‌ల్‌రావు…

3 hours ago