Political News

బాబు చేసిన పొరపాటే జగన్ కూడా చేస్తున్నారా?

రాజకీయంగా ఒప్పులు చేయకున్నా ఫర్లేదు తప్పులు మాత్రం చేయకూడదు. బలంగా ఉన్నప్పుడు.. అందునా అధికారంలో చేతిలో ఉన్నప్పుడు చేసే తప్పులు కొట్టుకుపోతాయి. అయితే.. తర్వాతి రోజుల్లో మత్రం ఇవన్నీ కలిసి కట్టుగా దండయాత్ర చేసినట్లుగా మీద పడతాయి. అప్పుడు వరుస ఎదురుదెబ్బలు తప్పవు. అందుకు నిలువెత్తు రూపంగా టీడీపీ అధినేత చంద్రబాబును చెప్పొచ్చు.

తెలుగు రాజకీయాల్లో ప్రతి విషయంలోనూ బాబును వేలెత్తి చూపించినంతగా మరే నేతను ఎవరూ చూపించరు. దీనికి కారణం.. చాలా విషయాల్లో బాబు అనుసరించిన విధానమే అని చెబుతారు. మరిన్ని తప్పులు చేసి కూడా అంతబలమైన నాయకుడిగా ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారంటే.. దాన్నే కాలమహిమగా చెబుతారు. పవర్ వచ్చినంతనే అప్పటివరకూ లేని కొత్త ఇమేజ్ చాలామందిలో వస్తుంది. అదంతా గెలుపు పుణ్యంగా చెప్పొచ్చు.

ఏపీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికే వస్తే.. ఆయన తీసుకునే నిర్ణయాల్ని ఎవరూ ప్రశ్నించే స్థితిలో లేరు. ఆ మాటకు వస్తే.. ఆయన్ను ప్రభావితం చేసేటోళ్లు కూడా ఎవరూ లేరు. ఆ మాటకు వస్తే.. చంద్రబాబును ప్రభావితం చేసే కొన్ని లాబీలు.. వ్యక్తులు ఉండనైనా ఉన్నారు. కానీ.. జగన్ అందుకు భిన్నం.

ఆయన ఏమనుకుంటే అదే ఫైనల్. ఎవరూ ఆయన మనసును మార్చలేరు. అంతటి పవర్ ఆయన సొంతం. అలాంటి జగన్.. కొన్ని విషయాల్లో తప్పులు చేస్తున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. పార్టీలో ఎంతోకాలంగా పని చేస్తూ.. జగన్ ఇచ్చే పదవుల కోసం చకోర పక్షుల మాదిరి వెయిట్ చేసేటోళ్లకు కొదవ లేదు. అయినప్పటికీ ఆయన మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కేటాయిస్తున్న తీరుపై మాత్రం కినుకు వ్యక్తమవుతోంది. అయితే.. అదేమీ బయటకు రావట్లేదు. తమ ప్రైవేటు సంభాషణల్లో అది కూడా చాలా నమ్మకమైన వారి వద్ద మాత్రమే తమ ఫీలింగ్స్ ను చెబుతున్నట్లుగా చెబుతున్నారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట ఉన్న వారిలో కొందరికి సరైన పదవులు లభించింది లేదు. కానీ.. పార్టీ పవర్ లోకి వచ్చిన తర్వాత వచ్చే ప్యారాచూట్ నేతలకు మాత్రం పదవులు వస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. బాబు కూడా ఇలాంటి తీరునే ప్రదర్శిస్తారన్న పేరుంది. మొన్నటికి మొన్న డొక్కా విషయంలోనూ అదే జరిగింది. అంతకు ముందు కూడా టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వటం కనిపిస్తుంది.

తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీల ఎంపికలోనూ పండుల రవీంద్రబాబుకు అవకాశం ఇచ్చారు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఆయనకు టికెట్ ఇవ్వకపోవటం.. తర్వాత సర్దుబాబు చేస్తానని చెప్పిన దానికి తగ్గట్లే.. ఆయనకు ఎమ్మెల్స ఇచ్చినట్లుగా చెబుతారు. ఇప్పటికే పదవుల కోసం ఎదురుచూస్తున్న ఎంతో మందిని వదిలి రవీంద్రబాబుకు ఇవ్వటం సరికాదన్న వాదన వినిపిస్తోంది.

నిజంగానే రవీంద్రబాబుకు న్యాయం చేయాలంటే ఏదైనా కార్పొరేషన్ ఛైర్మన్ గిరి ఇవ్వొచ్చుగా? అన్న మాట కొందరి నోట వినిపిస్తుండటం గమనార్హం. బాబు మాదిరే జగన్ సైతం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేయటం ఏమిటన్నది ఇప్పుడు చర్చగా ఉంది. ఈ విషయాన్ని జగన్ గుర్తిస్తున్నారా?

This post was last modified on July 30, 2020 11:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

25 seconds ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

27 minutes ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

2 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

2 hours ago

కొట్లాట కొత్త కాదు రేవంత్ చెబితే రాజీనామా దానం కీలక కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…

3 hours ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

3 hours ago