Political News

జగన్ కు కేంద్రం ఝలక్… మాతృభాషలోనే ప్రాథమిక విద్య

ఏపీ సీఎం హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా కొత్త నిర్ణయాలను అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో కోర్టులు, రాజకీయ పార్టీలు, సామాన్య జనం ఏమనుకుంటున్నా కూడా పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తున్న జగన్… తాను అనుకుంటున్న నిర్ణయాలను అమలు చేసి తీరేందుకే సిద్ధ పడుతున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పటికే పలుమార్లు కోర్టుల నుంచి మొట్టికాయలు తిన్న జగన్… తాజాగా కేంద్రం నుంచి కూడా పెద్ద ఎదురు దెబ్బ తిన్నారనే చెప్పాలి. ప్రభుత్వ విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతానని, ఎవరు అడ్డుకున్నా.. ముందుకే సాగుతామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం మాతృభాషలోనే జరగాలని తాజాగా కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రాథమికోన్నత విద్యను కూడా మాతృభాషలోనే కొనసాగిస్తే మరింత మంచిదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ2020) పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది.

కేంద్రం జారీ చేసిన ఆదేశాల్లో ప్రాథమిక విద్య పూర్తిగా మాతృభాషలో గానీ, ఆయా ప్రాంతాలకు చెందిన ప్రాంతీయ భాషల్లోనే జరగాలని విస్పష్టంగానే ప్రకటించింది. అంటే అంగన్ వాడీ విద్యతో పాటు 1 నుంచి 5 తరగతుల వరకు విద్యాభ్యాసం అంతా మతృభాషలోనే కొనసాగించాలన్న మాట. అంతేకాకుండా ఐదో తరగతి తర్వాత కూడా వీలయితే 8వ తరగతి దాకా కూడా మాతృభాషలోనే విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తే మంచిదని, 8వ తరగతి తర్వాత కూడా మాతృభాషలోనే విద్యా భ్యాసం కొనసాగితే మరింత మంచిదని కూడా కేంద్రం తన నివేదకలో పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల విషయంలో ఏపీలో మాత్రం సర్కారీ బడుల్లో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టి తీరతామని ప్రకటించిన జగన్ సర్కారుకు మాత్రం ఇబ్బందికరమైన పరిణామమేనని చెప్పక తప్పదు.

ఓ వైపు విపక్షాలు, మరోవైపు కోర్టులు కూడా ఆంగ్ల మాద్యమంపై ఇప్పటికే జగన్ సర్కారుకు పలు సలహాలు, సూచనలు చేశాయి. అంతేకాకుండా మాతృభాషలో ప్రాధమిక విద్యాభ్యాసం జరిగితేనే బాగుంటుందని కూడా పలువురు విద్యావేత్తలు కూడా చెప్పారు. అయితే ధనికుల పిల్లలు మాత్రమే ఆంగ్ల మాద్యమంలో చదివి అవకాశాలన్నీ ఎగురవేసుకుపోతూ ఉంటే.. తెలుగు మాద్యమంలో విద్యనభ్యసించే పేదల పిల్లలు… ఆ అవకాశాలకు దూరంగా ఉండాల్సిందేనా? అన్న వాదనను వినిపిస్తూ వస్తున్న జగన్ సర్కారు… ఇప్పుడు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలతో వెనకడుగు వేయక తప్పదన్న వాదన వినిపిస్తోంది. జాతీయ విద్యా విధానం అంటే… ఏ ఒక్క రాష్ట్రంలోనో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం చేసే విషయం కాదు. దేశవ్యాప్తంగా తప్పనిసరిగా అమలు చేసి తీరాల్సిన విషయం. మరి ఆంగ్ల మాద్యమంపై జగన్ ఎలా ముందుకు సాగుతారో చూడాలి.

This post was last modified on July 29, 2020 10:29 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

58 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

3 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago