Political News

జగన్ కు కేంద్రం ఝలక్… మాతృభాషలోనే ప్రాథమిక విద్య

ఏపీ సీఎం హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా కొత్త నిర్ణయాలను అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో కోర్టులు, రాజకీయ పార్టీలు, సామాన్య జనం ఏమనుకుంటున్నా కూడా పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తున్న జగన్… తాను అనుకుంటున్న నిర్ణయాలను అమలు చేసి తీరేందుకే సిద్ధ పడుతున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పటికే పలుమార్లు కోర్టుల నుంచి మొట్టికాయలు తిన్న జగన్… తాజాగా కేంద్రం నుంచి కూడా పెద్ద ఎదురు దెబ్బ తిన్నారనే చెప్పాలి. ప్రభుత్వ విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతానని, ఎవరు అడ్డుకున్నా.. ముందుకే సాగుతామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం మాతృభాషలోనే జరగాలని తాజాగా కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రాథమికోన్నత విద్యను కూడా మాతృభాషలోనే కొనసాగిస్తే మరింత మంచిదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ2020) పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది.

కేంద్రం జారీ చేసిన ఆదేశాల్లో ప్రాథమిక విద్య పూర్తిగా మాతృభాషలో గానీ, ఆయా ప్రాంతాలకు చెందిన ప్రాంతీయ భాషల్లోనే జరగాలని విస్పష్టంగానే ప్రకటించింది. అంటే అంగన్ వాడీ విద్యతో పాటు 1 నుంచి 5 తరగతుల వరకు విద్యాభ్యాసం అంతా మతృభాషలోనే కొనసాగించాలన్న మాట. అంతేకాకుండా ఐదో తరగతి తర్వాత కూడా వీలయితే 8వ తరగతి దాకా కూడా మాతృభాషలోనే విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తే మంచిదని, 8వ తరగతి తర్వాత కూడా మాతృభాషలోనే విద్యా భ్యాసం కొనసాగితే మరింత మంచిదని కూడా కేంద్రం తన నివేదకలో పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల విషయంలో ఏపీలో మాత్రం సర్కారీ బడుల్లో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టి తీరతామని ప్రకటించిన జగన్ సర్కారుకు మాత్రం ఇబ్బందికరమైన పరిణామమేనని చెప్పక తప్పదు.

ఓ వైపు విపక్షాలు, మరోవైపు కోర్టులు కూడా ఆంగ్ల మాద్యమంపై ఇప్పటికే జగన్ సర్కారుకు పలు సలహాలు, సూచనలు చేశాయి. అంతేకాకుండా మాతృభాషలో ప్రాధమిక విద్యాభ్యాసం జరిగితేనే బాగుంటుందని కూడా పలువురు విద్యావేత్తలు కూడా చెప్పారు. అయితే ధనికుల పిల్లలు మాత్రమే ఆంగ్ల మాద్యమంలో చదివి అవకాశాలన్నీ ఎగురవేసుకుపోతూ ఉంటే.. తెలుగు మాద్యమంలో విద్యనభ్యసించే పేదల పిల్లలు… ఆ అవకాశాలకు దూరంగా ఉండాల్సిందేనా? అన్న వాదనను వినిపిస్తూ వస్తున్న జగన్ సర్కారు… ఇప్పుడు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలతో వెనకడుగు వేయక తప్పదన్న వాదన వినిపిస్తోంది. జాతీయ విద్యా విధానం అంటే… ఏ ఒక్క రాష్ట్రంలోనో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం చేసే విషయం కాదు. దేశవ్యాప్తంగా తప్పనిసరిగా అమలు చేసి తీరాల్సిన విషయం. మరి ఆంగ్ల మాద్యమంపై జగన్ ఎలా ముందుకు సాగుతారో చూడాలి.

This post was last modified on July 29, 2020 10:29 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ఒక్క ఓటుతో కోడల్ని గెలిపించిన ‘అమెరికా మామ’

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఫలితాలు నిన్న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల ఫలితాల…

12 minutes ago

చ‌ర‌ణ్‌ vs నాని.. ఇద్ద‌రూ త‌గ్గేదే లే

సినిమాలకు సంబంధించి క్రేజీ సీజ‌న్లకు చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసేస్తుంటారు. తెలుగులో ఏడాది ఆరంభంలో సంక్రాంతి సీజ‌న్‌కు బాగా…

3 hours ago

‘కూట‌మి’లో ప్ర‌క్షాళన‌.. త్వ‌ర‌లో మార్పులు?

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలోనే కాదు.. పార్టీల్లోనూ ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నుందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. పార్టీల ప‌రంగా పైస్థాయిలో నాయ‌కులు…

3 hours ago

జన నాయకుడు మీద ఏంటీ ప్రచారం

రాజకీయ రంగ ప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా చెప్పుకున్న జన నాయకుడు జనవరి 9 విడుదల కానుంది. మలేసియాలో…

3 hours ago

అసలు యుద్ధానికి అఖండ 2 సిద్ధం

సోమవారం వచ్చేసింది. ఎంత పెద్ద సినిమా అయినా వీక్ డేస్ మొదలుకాగానే థియేటర్ ఆక్యుపెన్సీలో తగ్గుదల ఉంటుంది. కాకపోతే అది…

4 hours ago

చిరు వెంకీ కలయిక… ఎంతైనా ఊహించుకోండి

మన శంకరవరప్రసాద్ గారులో వెంకటేష్ క్యామియో గురించి ఎన్ని అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. పేరుకి గెస్టు రోల్ అంటున్నా ఇరవై…

6 hours ago