ఏపీ సీఎం హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా కొత్త నిర్ణయాలను అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో కోర్టులు, రాజకీయ పార్టీలు, సామాన్య జనం ఏమనుకుంటున్నా కూడా పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తున్న జగన్… తాను అనుకుంటున్న నిర్ణయాలను అమలు చేసి తీరేందుకే సిద్ధ పడుతున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పటికే పలుమార్లు కోర్టుల నుంచి మొట్టికాయలు తిన్న జగన్… తాజాగా కేంద్రం నుంచి కూడా పెద్ద ఎదురు దెబ్బ తిన్నారనే చెప్పాలి. ప్రభుత్వ విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతానని, ఎవరు అడ్డుకున్నా.. ముందుకే సాగుతామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం మాతృభాషలోనే జరగాలని తాజాగా కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రాథమికోన్నత విద్యను కూడా మాతృభాషలోనే కొనసాగిస్తే మరింత మంచిదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ2020) పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది.
కేంద్రం జారీ చేసిన ఆదేశాల్లో ప్రాథమిక విద్య పూర్తిగా మాతృభాషలో గానీ, ఆయా ప్రాంతాలకు చెందిన ప్రాంతీయ భాషల్లోనే జరగాలని విస్పష్టంగానే ప్రకటించింది. అంటే అంగన్ వాడీ విద్యతో పాటు 1 నుంచి 5 తరగతుల వరకు విద్యాభ్యాసం అంతా మతృభాషలోనే కొనసాగించాలన్న మాట. అంతేకాకుండా ఐదో తరగతి తర్వాత కూడా వీలయితే 8వ తరగతి దాకా కూడా మాతృభాషలోనే విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తే మంచిదని, 8వ తరగతి తర్వాత కూడా మాతృభాషలోనే విద్యా భ్యాసం కొనసాగితే మరింత మంచిదని కూడా కేంద్రం తన నివేదకలో పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల విషయంలో ఏపీలో మాత్రం సర్కారీ బడుల్లో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టి తీరతామని ప్రకటించిన జగన్ సర్కారుకు మాత్రం ఇబ్బందికరమైన పరిణామమేనని చెప్పక తప్పదు.
ఓ వైపు విపక్షాలు, మరోవైపు కోర్టులు కూడా ఆంగ్ల మాద్యమంపై ఇప్పటికే జగన్ సర్కారుకు పలు సలహాలు, సూచనలు చేశాయి. అంతేకాకుండా మాతృభాషలో ప్రాధమిక విద్యాభ్యాసం జరిగితేనే బాగుంటుందని కూడా పలువురు విద్యావేత్తలు కూడా చెప్పారు. అయితే ధనికుల పిల్లలు మాత్రమే ఆంగ్ల మాద్యమంలో చదివి అవకాశాలన్నీ ఎగురవేసుకుపోతూ ఉంటే.. తెలుగు మాద్యమంలో విద్యనభ్యసించే పేదల పిల్లలు… ఆ అవకాశాలకు దూరంగా ఉండాల్సిందేనా? అన్న వాదనను వినిపిస్తూ వస్తున్న జగన్ సర్కారు… ఇప్పుడు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలతో వెనకడుగు వేయక తప్పదన్న వాదన వినిపిస్తోంది. జాతీయ విద్యా విధానం అంటే… ఏ ఒక్క రాష్ట్రంలోనో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం చేసే విషయం కాదు. దేశవ్యాప్తంగా తప్పనిసరిగా అమలు చేసి తీరాల్సిన విషయం. మరి ఆంగ్ల మాద్యమంపై జగన్ ఎలా ముందుకు సాగుతారో చూడాలి.
This post was last modified on July 29, 2020 10:29 pm
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…