Political News

తన బట్టలు తనే ఉతుక్కుంటున్న ముఖ్యమంత్రి

ఒకప్పటి భారత ప్రధాని లాబ్ బహదూర్ శాస్త్రిని కలుద్దామని ఓ నాయకుడు ముందు చెప్పకుండా ఆయన ఇంటికి వెళ్తే.. బట్టలు ఉతుక్కుంటూ కనిపించారట. దీని గురించి జనాలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.

కానీ ఇప్పటి మన నేతాశ్రీల నుంచి ఇలాంటి సింప్లిసిటీని ఊహించగలమా? కానీ చోటా నేతలు కూడా వందలు, వేల కోట్లకు పడగలెత్తి విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న ఈ రోజుల్లో కూడా ఓ ముఖ్యమంత్రి కొన్ని రోజులుగా తన బట్టలు తనే ఉతుక్కుంటున్నాడంటే షాకవ్వాల్సిందే.

ప్రస్తుత భారత దేశ ముఖ్యమంత్రుల్లో అత్యంత సింపుల్‌గా ఉండే నాయకుల్లో ఒకడిగా పేరున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదే పని చేస్తుండటం విశేషం. ఈ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కొన్ని రోజుల కిందటే కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.

ఐతే మన నాయకుల్లా చౌహాన్ వెంటనే కార్పొరేట్ ఆసుపత్రికి పరుగులు పెట్టేయలేదు. ముఖ్యమంత్రిగా తాను అందరికీ ఆదర్శంగా ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రులపై జనాల్లో నమ్మకం పెంచాలనే ఉద్దేశంతో అందులోనే చేరారు. అక్కడ ఆయన తన పనులన్నీ సొంతంగా చేసుకుంటున్నారట.

తాను వాడిన బట్టలు, వస్తువులు వేరొకరు ముట్టుకుంటే వారికి వైరస్ సోకుతుందన్న ఉద్దేశంతో ఆయనే స్వయంగా బట్టలు ఉతుక్కుంటున్నారట. ఈ విషయాన్ని ఆయన తన మంత్రులతో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో వెల్లడించారు.

ఆసుపత్రి నుంచే వర్చువల్ మీటింగ్ ద్వారా చౌహాన్ మంత్రిమండలి సమావేశం నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలామంది తమ బట్టలు తాము ఉతుక్కోవడాన్ని నామోషీగా భావిస్తారని.. కానీ తాను అలా భావించలేదని.. కొంత కాలం కిందట తన చేతికి శస్త్రచికిత్స జరిగిందని.. ఇప్పుడు బట్టలు ఉతకడంతో దానికి ఉపశమనం లభించిందని సమావేశంలో చమత్కరించడం విశేషం.

Share
Show comments
Published by
satya

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

29 mins ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

3 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

3 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

4 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

5 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

6 hours ago