Political News

బాబు ట్రాక్టర్లను మరిచిపోయారు.. జగన్ అంబులెన్సులు గుర్తుంటాయా?

ప్రజలను ఆకర్షించేందుకు ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అధికారంలోకి వచ్చేందుకు ఆయా సంక్షేమ పథకాలు చాలావరకు ఉపయోగపడుతుంటాయి. కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలు మనసులకు హత్తుకునేలా ఉంటాయి. ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం, వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకం, చంద్రబాబుకు అన్న క్యాంటీన్లు…వంటి పథకాలు జనానినికి సెంటిమెంట్ గా మారాయి. అయితే, కొన్ని పథకాలకు తగినంత ఆదరణ రాదు. చంద్రబాబు హయాంలో రైతులకు 20 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు అందించే రైతు రథంపథకం కూడా ఈ కోవకే వస్తుంది. 6 వేల ట్రాక్టర్లతో చంద్రబాబు నాడు చేసిన రోడ్ షోకు విపరీతమైన పబ్లిసిటీ లభించింది. ఎన్నికలకు ఏడాది ముందు చేసిన ఈ ట్రాక్టర్ షో…బాబుకు మళ్లీ అధికారం కట్టబెట్టడంలో కీలక భూమిక వహిస్తుందనుకున్నారు టీడీపీ నేతలు. అయితే, 2019 ఎన్నికలలో జనంపై ఆ పథకం పెద్దగా ఎఫెక్ట్ చూపలేకపోయింది. తాజాగా, జగన్ చేసిన 1088 అంబులెన్స్ ల ర్యాలీ ఎఫెక్ట్ కూడా రైతు రథం మాదిరిగానే ఉండబోతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏప్రిల్ 27, 2018న సన్నకారు రైతుల సాగు కష్టాలు తీర్చేందుకు ‘రైతు రథం’ పథకాన్ని నాటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ద్వారా రెండేళ్ళలో రాయితీపై 20 వేల ట్రాక్టర్లను అందించాలనే లక్ష్యంతో తొలి ఏడాది 6,000 ట్రాక్టర్లు మంజూరు చేశారు. ఆనాడు రాష్ట్రమంతటా వేలాది అన్నదాతల ముంగిళ్లు రైతు రథాలతో సందడి చేశాయి. కట్ చేస్తే… ఈ ఏడాది జులై 1ను ఏపీ సీఎం జగన్ 1088 అధునాతన వసతులు కలిగిన 108,104 వాహనాలతో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆ 1088లో 676 వాహనాలు 104 కాగా.. మరో 412 వాహనాలు 108లు. మారుమూల ప్రాంతాలతోపాటు ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండేలా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా వాటిని సిద్ధం చేశారు. కరోనా విపత్తు సమయంలోనూ దాదాపు 203.47 కోట్లతో అంబులెన్స్ వాహనాలను కొనుగోలు చేసిన జగన్ సర్కార్ పై పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ప్రశంసలు కురిపించారు.

నేడు జగన్ అంబులెన్సుల ర్యాలీ, నాడు చంద్రబాబు ట్రాక్టర్ల ర్యాలీ…ఈ రెండు ర్యాలీల వల్ల ఆయా పార్టీలకు అధికారంలో ఉండగా ఎంతోకొంత మైలేజి వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఎన్నికల ముందు ఏ పార్టీ హవా ఎలా ఉంది….ఎన్నికలకు ముందు ఎవరి హామీలు ఎలా ఉన్నాయన్న దానిపైనే ఆయా పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఎన్నికల ముందు ఏ నాయకుడికి ఎంత వెయిట్ ఉంది అన్నదే జనం ఆలోచించే ఏకైక పాయింట్ అనడంలో సందేహం లేదు. ఎన్నికల ముందు ఏ నాయకుడి వైపు గాలి వీస్తోంది….ఏ పార్టీ గెలిచే అవకాశాలెక్కువగా ఉన్నాయన్న సమీకరణాలే జనం నాడిని నిర్ణయిస్తాయని చెప్పవచ్చు. కాబట్టి, జగన్ కు అంబులెన్సుల ర్యాలీ ఇచ్చే మైలేజీ కన్నా…రాబోయే ఎన్నికలకు ముందు జగన్ పరిస్థితి ఎలా ఉంది అన్నది ఆ పార్టీ గెలుపోటములను నిర్ణయిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

This post was last modified on July 29, 2020 2:38 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

49 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago