Political News

న‌డ్డా పోస్టు త‌ర్వాత‌.. ఏపీలో మార్పు ఇదే!!

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. సోష‌ల్ మీడియాలో రెండురోజుల కిందట పెట్టిన ఒక పోస్టు.. ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. ఆయ‌న ఉద్దేశం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పోస్టులో ఉన్న సందేశం.. ఆయ‌న చేసిన కామెంట్లు మాత్రం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇది భ‌విష్య‌త్తు రాజ‌కీయాల‌కు సంకేతమా? అనే సందేహాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. అయితే.. ఏపీ బీజేపీ నాయ‌కులు మాత్రం దీనిపై పెద‌వి విప్ప‌డం లేదు.

ఇంత‌కీ న‌డ్డా పోస్టు ఏంటంటే.. ఎక్క‌డో దేశం నుంచి విసేరిసిన‌ట్టు ఉండే.. అండ‌మాన్‌-పోర్టుబ్లెయిర్ దీవుల్లో ఒక మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఉంది. వాస్త‌వానికి ఇవ‌న్నీ..కేంద్ర పాలిత ప్రాంతాలు. అయిన‌ప్ప‌టికీ.. స్థానికంగా పాల‌న జ‌రుగుతోంది. గ‌త మూడేళ్ల కింద‌ట పోర్ట్‌బ్లెయిర్ మునిసిపాలిటీకి ఎన్నిక‌లు జ‌రిగాయి. అంటే.. ఇది జ‌రిగింది 2019 త‌ర్వాతే. సుమారు 2020 ప్ర‌థ‌మ‌, ద్వితీయార్థంలోనే.

ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ కూడా పోటీ చేసి.. మొత్తం 18 స్థానాలున్న మునిసిప‌ల్ కార్ప‌రేష‌న్ వార్డుల్లో రెండు స్థానాల‌ను(వార్డులు) టీడీపీ ద‌క్కించుకుంది. ఇదేస‌మ‌యంలో బీజేపీ 6 చోట్ల విజ‌యం ద‌క్కించుకుంది. అయినా.. అధికారంలోకి రావాలంటే.. నాలుగు సీట్లు అవ‌స‌రం. ఈ క్ర‌మంలో బీజేపీకి.. టీడీపీ మ‌ద్ద‌తిచ్చింది. దీంతో బీజేపీ మునిసిప‌ల్ ప‌గ్గాలు చేప‌ట్టింది. ఇక‌, పొత్తుల క్ర‌మంలో జ‌రిగిన ఒప్పందం మేర‌కు చివ‌రి రెండు సంవ‌త్స‌రాల స్థానిక పాల‌న ప‌గ్గాలు టీడీపీకి ద‌క్కాయి.

ఈ క్ర‌మంలో పోర్ట్‌బ్లెయిర్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గిరీ టీడీపీకి ద‌క్కింది. దీనినే న‌డ్డా ట్వీట్ చేశారు. బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ అభ్య‌ర్థి చైర్మ‌న్ ప‌ద‌విని చేప‌డుతున్నార‌ని పేర్కొంటూ.. ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే.. ఈ ట్విట్ ఏపీ రాజ‌కీయాల్లో కాక రేపింది. ఏపీలో కొన్నాళ్లుగా బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. బీజేపీ నుంచి ఎలాంటి స్పంద‌నా రావ‌డం లేదు.

ఇప్పుడు పోర్టుబ్లెయిర్ విష‌యాన్ని న‌డ్డానే వెలుగులోకి తెచ్చిన క్ర‌మంలో ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు కు ఆయ‌న మాన‌సికంగా సిద్ధ‌మ‌వుతున్నారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం అయితే.. దీనిపై బీజేపీ రాష్ట్ర నేత‌ల‌ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ, టీడీపీ మాత్రం న‌డ్డా పోస్టును జోరుగా వైర‌ల్ చేసి.. ప్ర‌జ‌ల‌కు ఒక సందేశం పంపిస్తున్న‌ట్టుగా ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. మ‌రి దీనిని ప్ర‌జ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

This post was last modified on March 16, 2023 10:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

3 minutes ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

4 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

6 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

10 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

11 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

11 hours ago