నాయకులు.. సినిమా యాక్టర్లు అన్న తర్వాత వారిని అభిమానించే వారు.. ఆరాధించే వారికి కొదవ ఉండదు. కానీ.. వారందరికి కాస్తంత భిన్నంగా కనిపిస్తారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు. తమ నటుడు కమ్ నాయకుడి మీద వారు చూపించే అభిమానం రోటీన్ కు కాస్త భిన్నంగా ఉంటుంది. పవన్ ను ఆరాధించే చాలామంది.. ఆయన్ను తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తుంటారు. తమ ఇంట్లో మనిషిగా మాట్లాడుకోవటం కనిపిస్తూ ఉంటుంది. పవన్ కు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు.. ‘పెద్దోడు బాగా గడ్డి పెట్టాడు.. లేకపోతే ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటాడా’ అంటూ ఇంట్లో కొడుకు మాదిరి భావించేటోళ్లకు కొదవ లేదు.
పవన్ అంటే ఎందుకంత అభిమానం.. ఆయన్ను ఎందకంత పిచ్చిగా ప్రేమిస్తారు? అంటే.. ఆయన గుణగణాలే కారణంగా చెప్పాలి. రాజకీయంగా ఆయన్ను బోలెడన్ని విమర్శలు చేసేవారు.. బూతులు తిట్టే నేతలు సైతం వ్యక్తిగత సంభాషణల్లో మాత్రం ఆయన్ను వేలెత్తి చూపించేందుకు.. వంక పెట్టేలా వ్యాఖ్యలు చేసేందుకు జంకుతారు. అలాంటి వ్యక్తిత్వం పవన్ సొంతంగా చెప్పాలి. అదే.. ఆయనకు అంతమంది అభిమానుల్ని తెచ్చి పెట్టిందని చెప్పాలి.
పవన్ మీద అంత అభిమానాన్ని ఎందుకు ప్రదర్శిస్తారన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా పార్టీ ఆవిర్భావ సభకు వారాహితో ఊరేగింపుగా వెళుతున్న వేళ.. చోటుచేసుకున్న ఒక ఉదంతాన్ని ప్రస్తావించాల్సిందే. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లేందుకు వారాహి వాహనం మీద వెళుతున్న పవన్ ను.. వేలాది మంది ఆయన్ను బైకుల మీద అనుసరించటం తెలిసిందే.
అయితే.. అంచనాలకు మించిన వచ్చిన జనసందోహంతో విజయవాడ – మచిలీపట్నం హైవే మీద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఇలాంటి వేళ.. ఒక అంబులెన్సు చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన పవన్ వెంటనే.. తన వారాహి వాహనాన్ని పది నిమిషాల పాటు నిలిపేశారు. అంబులెన్సు వెళ్లేందుకు వీలుగా దారి ఇవ్వటంతో పాటు.. దానికి ఎవరూ అడ్డు కాకూడదన్న విషయాన్ని అదే పనిగా చెప్పటం.. అందుకు తగ్గట్లే జనసైనికులు అంబులెన్సు వెళ్లేందుకు దారివ్వటం చూసినోళ్లు.. పవన్ మానత్వాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. ఇదే జనసేనాని గొప్ప మనసుకు నిదర్శనమని అభివర్ణిస్తున్నారు.
This post was last modified on March 15, 2023 10:43 am
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…