నాయకులు.. సినిమా యాక్టర్లు అన్న తర్వాత వారిని అభిమానించే వారు.. ఆరాధించే వారికి కొదవ ఉండదు. కానీ.. వారందరికి కాస్తంత భిన్నంగా కనిపిస్తారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు. తమ నటుడు కమ్ నాయకుడి మీద వారు చూపించే అభిమానం రోటీన్ కు కాస్త భిన్నంగా ఉంటుంది. పవన్ ను ఆరాధించే చాలామంది.. ఆయన్ను తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తుంటారు. తమ ఇంట్లో మనిషిగా మాట్లాడుకోవటం కనిపిస్తూ ఉంటుంది. పవన్ కు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు.. ‘పెద్దోడు బాగా గడ్డి పెట్టాడు.. లేకపోతే ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటాడా’ అంటూ ఇంట్లో కొడుకు మాదిరి భావించేటోళ్లకు కొదవ లేదు.
పవన్ అంటే ఎందుకంత అభిమానం.. ఆయన్ను ఎందకంత పిచ్చిగా ప్రేమిస్తారు? అంటే.. ఆయన గుణగణాలే కారణంగా చెప్పాలి. రాజకీయంగా ఆయన్ను బోలెడన్ని విమర్శలు చేసేవారు.. బూతులు తిట్టే నేతలు సైతం వ్యక్తిగత సంభాషణల్లో మాత్రం ఆయన్ను వేలెత్తి చూపించేందుకు.. వంక పెట్టేలా వ్యాఖ్యలు చేసేందుకు జంకుతారు. అలాంటి వ్యక్తిత్వం పవన్ సొంతంగా చెప్పాలి. అదే.. ఆయనకు అంతమంది అభిమానుల్ని తెచ్చి పెట్టిందని చెప్పాలి.
పవన్ మీద అంత అభిమానాన్ని ఎందుకు ప్రదర్శిస్తారన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా పార్టీ ఆవిర్భావ సభకు వారాహితో ఊరేగింపుగా వెళుతున్న వేళ.. చోటుచేసుకున్న ఒక ఉదంతాన్ని ప్రస్తావించాల్సిందే. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లేందుకు వారాహి వాహనం మీద వెళుతున్న పవన్ ను.. వేలాది మంది ఆయన్ను బైకుల మీద అనుసరించటం తెలిసిందే.
అయితే.. అంచనాలకు మించిన వచ్చిన జనసందోహంతో విజయవాడ – మచిలీపట్నం హైవే మీద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఇలాంటి వేళ.. ఒక అంబులెన్సు చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన పవన్ వెంటనే.. తన వారాహి వాహనాన్ని పది నిమిషాల పాటు నిలిపేశారు. అంబులెన్సు వెళ్లేందుకు వీలుగా దారి ఇవ్వటంతో పాటు.. దానికి ఎవరూ అడ్డు కాకూడదన్న విషయాన్ని అదే పనిగా చెప్పటం.. అందుకు తగ్గట్లే జనసైనికులు అంబులెన్సు వెళ్లేందుకు దారివ్వటం చూసినోళ్లు.. పవన్ మానత్వాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. ఇదే జనసేనాని గొప్ప మనసుకు నిదర్శనమని అభివర్ణిస్తున్నారు.
This post was last modified on March 15, 2023 10:43 am
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…
నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…
ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…
ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన…