దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వరుస ట్విస్టులు తెరమీదికి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో సౌత్ గ్రూప్ పాత్ర ఉందని.. 100 కోట్లు ఈ గ్రూప్ .. ఆప్కు చేరవేసిందని ఈడీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఎమ్మెల్సీ కవితకు అరుణ్ రామచంద్ర పిళ్లయే బినామీ అని కూడా చెప్పింది. దీని ఆధారంగానే కవితను విచారించేందుకు కూడా రెడీ అయింది. అయితే.. అనూహ్యంగా పిళ్లయ్.. తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుని.. ట్విస్ట్ ఇచ్చాడు.
ఈ కారణంగానే కవితను అరెస్టు చేయలేదనే వాదన ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. దీని నుంచి ఈడీ కోలుకోక ముందే.. మరో భారీ దెబ్బతగిలింది. ఈడీ తరఫు లిక్కర్ కుంభకోణం కేసులను వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు. పైకి ఆయన వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించినా.. ఈడీ ఒత్తిడి భరించలేకే.. ఆయన రాజీనామా చేశారని.. ఢిల్లీలోని ఆప్ వర్గాలు ప్రచారం ప్రారంభించాయి.
2015 నుంచి ఈడీకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్న రాణా.. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కాంగ్రెస్ కర్ణాటక నాయకుడు డికె శివకుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, అతని కుటుంబం, టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ, రాబర్ట్ లతో సహా అనేక మందికి సంబంధించిన కేసులలో ఫెడరల్ ఏజెన్సీ తరపున వాదనలు వినిపించారు. ఇప్పుడు లిక్కర్ కేసును ఈడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిని కూడా రాణానే వాదిస్తున్నారు. అయితే.. ఆయన తాజాగా రాజీనామాలేఖ సమర్పించడంతో లిక్కర్ కేసు.. వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on March 12, 2023 2:03 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…