Political News

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌!

దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో వ‌రుస ట్విస్టులు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఈ కుంభ‌కోణంలో సౌత్ గ్రూప్ పాత్ర ఉంద‌ని.. 100 కోట్లు ఈ గ్రూప్ .. ఆప్‌కు చేర‌వేసింద‌ని ఈడీ ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఎమ్మెల్సీ క‌విత‌కు అరుణ్ రామచంద్ర పిళ్ల‌యే బినామీ అని కూడా చెప్పింది. దీని ఆధారంగానే క‌విత‌ను విచారించేందుకు కూడా రెడీ అయింది. అయితే.. అనూహ్యంగా పిళ్ల‌య్‌.. త‌న వాంగ్మూలాన్ని వెన‌క్కి తీసుకుని.. ట్విస్ట్ ఇచ్చాడు.

ఈ కార‌ణంగానే క‌విత‌ను అరెస్టు చేయ‌లేద‌నే వాద‌న ఢిల్లీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. దీని నుంచి ఈడీ కోలుకోక ముందే.. మ‌రో భారీ దెబ్బ‌త‌గిలింది. ఈడీ త‌ర‌ఫు లిక్క‌ర్ కుంభ‌కోణం కేసుల‌ను వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు. పైకి ఆయ‌న వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించినా.. ఈడీ ఒత్తిడి భ‌రించ‌లేకే.. ఆయ‌న రాజీనామా చేశార‌ని.. ఢిల్లీలోని ఆప్ వ‌ర్గాలు ప్ర‌చారం ప్రారంభించాయి.

2015 నుంచి ఈడీకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్న రాణా.. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కాంగ్రెస్ క‌ర్ణాట‌క‌ నాయకుడు డికె శివకుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, అతని కుటుంబం, టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ, రాబర్ట్ లతో సహా అనేక మందికి సంబంధించిన కేసులలో ఫెడరల్ ఏజెన్సీ తరపున వాద‌న‌లు వినిపించారు. ఇప్పుడు లిక్క‌ర్ కేసును ఈడీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. దీనిని కూడా రాణానే వాదిస్తున్నారు. అయితే.. ఆయ‌న తాజాగా రాజీనామాలేఖ స‌మ‌ర్పించడంతో లిక్క‌ర్ కేసు.. వ్య‌వ‌హారంలో మ‌రో ట్విస్ట్ చోటు చేసుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 12, 2023 2:03 pm

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

5 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

1 hour ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

2 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

3 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

4 hours ago