ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నా యి. ఒక్కొక్కరుగా.. నాయకులు.. పార్టీకి దూరమవుతున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యవహారం.. కలకలం రేపింది. ఆ తర్వాత ఆనం రామనారాయణరెడ్డి కూడా అదే తరహాలో కలకలం రేపారు. ఇక, ఇప్పుడు వైసీపీకి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు రాజీనామా చేశారు. దీంతో కీలకమైన తూర్పు గోదావరిలో వైసీపీకి పెద్ద తగిలినట్టే భావిస్తున్నారు పరిశీలకులు.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న టీవీ రామారావు.. ఇక్కడ ఎమ్మె ల్యే గెలుపులో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న ఆయన 2009లో కొవ్వూరు నియోజ కవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం నిడదవోలులో జరిగిన ఓ కేసులో ఇరుక్కుని రాజకీయ ఒడుదుడుకులకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయనకు మరోసారి టికెట్ లభించలేదు.
దీంతో 2014లో టీడీపీ నుంచి టికెట్ రాకపోయినా.. కొవ్వూరు నియోజకవర్గంలో కేఎస్.జవహర్కు మద్దతుగా ప్రచారం చేసి టీడీపీ విజయానికి కృషి చేశారు. దీంతో జవహర్.. విజయం దక్కించుకున్నారు. అయితే.. జవహర్ మంత్రి అయ్యాక తమను పట్టించుకోవడం మానేశారంటూ.. రామారావు అలిగి.. పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. దీనికిముందు 2019 ఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ వస్తుందని ఆశించారు.
కానీ, చంద్రబాబు కరుణించలేదు. దీంతో రామారావు 2019లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం కొవ్వూరు నుంచి పోటీ చేసిన తానేటి వనితకు మద్దతుగా ప్రచారం చేసి ఆమె గెలుపు కోసం కృషి చేశారు. కానీ.. అక్కడ కూడా రామారావు వర్గానికి మంత్రి వనిత సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన టీడీపీలోకి చేరనున్నట్టు రామారావు వర్గం చెబుతుండడం గమనార్హం.
This post was last modified on March 11, 2023 1:55 pm
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే…
కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…
జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…
దేశ రాజధాని ఢిల్లీ కూడా ఒక రాష్ట్రమేనని అందరికీ తెలిసిందే. ఇక్కడ చిత్రమైన పరిస్థితి ఉంది. ఇది కేంద్ర పాలిత…
ఈ మధ్యే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో పలకరించింది మృణాల్ ఠాకూర్. తెలుగులో చేసిన గత రెండు చిత్రాలతో పోలిస్తే.. ఇందులో…