Political News

అమరావతి కేసుల్లో జగన్ కు ఎదురుగాలి

ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. శుక్ర, శనివారాల్లో నిర్వహించే సదస్సు కోసం విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిధులకు విశాఖ విశిష్టతను చెప్పడంతో పాటు, కాబోయే రాజధానిగా పరిచయం చేయాలని జగన్ అనుకుంటున్నారు. ఆ దిశగా కొంత సాహిత్యం కూడా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. విశాఖకున్న ప్రయోజనాలను వివరించేందుకు వీడియోలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రమేనని అందరికీ తెలియజెప్పాలని జగన్ సంకల్పంగా కనిపిస్తోంది.

ససేమిరా అన్న సుప్రీం…

అమరావతి కేసుల్లో హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చింది. అమరావతి నుంచి రాజధానిని విశాఖకు మార్చేందుకు అనుమతి లభించలేదు. పైగా రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించే విషయంలోనూ కోర్టు టైమ్ ఫ్రేమ్ విధించింది. దానితో జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకెక్కింది. ఈ నెల 28న విచారణ ఉండగా, తక్షణమే విచారణ చేపట్టాలని అభ్యర్థించింది. విశాఖ పెట్టుబడుల సదస్సు జరుగుతుండగానే విచారణ జరిగితే చెప్పుకునేందుకు ఒక పాయింట్ దొరుకుతుందని ప్రభుత్వం ఎదురు చూసింది. అయితే ఈ నెల 28వ తేదీనే విచారిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. 28వ తేదీకన్నా ముందే కేసు విచారణ జరపాలన్న ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదుల విజ్ణప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.

రాజ్యాంగ పరమైన అంశాలు అమరావతి కేసులో చాలా ఇమిడి ఉన్నాయని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ పేర్కొన్నారు. 28వ తేదీ ఒక్క రోజే విచారణ సరిపోదని… బుధ, గురువారాల్లో అంటే 29,30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సిజెఐ సర్క్కులర్ ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే సిజెఐ ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదు కోరారు. సిజెఐ ముందు ప్రస్తావించడానికి తనకేమీ అభ్యంతరం లేదన్న న్యాయమూర్తి కె ఎం జోసెఫ్…కాకపోతే అందుకు తన అనుమతి అవసరం లేదన్నారు. తను రిటైర్ అయ్యే లోపు ఈ కేసు విచారణ పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు కూడా న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ తెలిపారు…

శుక్రవారం సిజెఐ ముందుకు..

అమరావతి కేసులో విచారణ తేదీలపై క్లారిటీ కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 28 మంగళవారంతో పాటు బుధ, గురు వారాల్లో కూడా విచారణ జరిగే విధంగా డెరెక్షన్ కోసం పిటిషన్ వేయబోతోంది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ధర్మాసనంలో శుక్రవారం ఒక పిటిషన్ వేస్తారు. మరి మూడు రోజుల విచారణకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరిస్తారో లేదో చూడాలి..

This post was last modified on March 2, 2023 12:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

45 minutes ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

2 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

3 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

5 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

5 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

6 hours ago