Political News

అమరావతి కేసుల్లో జగన్ కు ఎదురుగాలి

ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. శుక్ర, శనివారాల్లో నిర్వహించే సదస్సు కోసం విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిధులకు విశాఖ విశిష్టతను చెప్పడంతో పాటు, కాబోయే రాజధానిగా పరిచయం చేయాలని జగన్ అనుకుంటున్నారు. ఆ దిశగా కొంత సాహిత్యం కూడా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. విశాఖకున్న ప్రయోజనాలను వివరించేందుకు వీడియోలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రమేనని అందరికీ తెలియజెప్పాలని జగన్ సంకల్పంగా కనిపిస్తోంది.

ససేమిరా అన్న సుప్రీం…

అమరావతి కేసుల్లో హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చింది. అమరావతి నుంచి రాజధానిని విశాఖకు మార్చేందుకు అనుమతి లభించలేదు. పైగా రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించే విషయంలోనూ కోర్టు టైమ్ ఫ్రేమ్ విధించింది. దానితో జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకెక్కింది. ఈ నెల 28న విచారణ ఉండగా, తక్షణమే విచారణ చేపట్టాలని అభ్యర్థించింది. విశాఖ పెట్టుబడుల సదస్సు జరుగుతుండగానే విచారణ జరిగితే చెప్పుకునేందుకు ఒక పాయింట్ దొరుకుతుందని ప్రభుత్వం ఎదురు చూసింది. అయితే ఈ నెల 28వ తేదీనే విచారిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. 28వ తేదీకన్నా ముందే కేసు విచారణ జరపాలన్న ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదుల విజ్ణప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.

రాజ్యాంగ పరమైన అంశాలు అమరావతి కేసులో చాలా ఇమిడి ఉన్నాయని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ పేర్కొన్నారు. 28వ తేదీ ఒక్క రోజే విచారణ సరిపోదని… బుధ, గురువారాల్లో అంటే 29,30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సిజెఐ సర్క్కులర్ ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే సిజెఐ ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదు కోరారు. సిజెఐ ముందు ప్రస్తావించడానికి తనకేమీ అభ్యంతరం లేదన్న న్యాయమూర్తి కె ఎం జోసెఫ్…కాకపోతే అందుకు తన అనుమతి అవసరం లేదన్నారు. తను రిటైర్ అయ్యే లోపు ఈ కేసు విచారణ పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు కూడా న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ తెలిపారు…

శుక్రవారం సిజెఐ ముందుకు..

అమరావతి కేసులో విచారణ తేదీలపై క్లారిటీ కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 28 మంగళవారంతో పాటు బుధ, గురు వారాల్లో కూడా విచారణ జరిగే విధంగా డెరెక్షన్ కోసం పిటిషన్ వేయబోతోంది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ధర్మాసనంలో శుక్రవారం ఒక పిటిషన్ వేస్తారు. మరి మూడు రోజుల విచారణకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరిస్తారో లేదో చూడాలి..

This post was last modified on March 2, 2023 12:43 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…

51 mins ago

నిఖిల్ క్రేజీ మూవీ ఏమైనట్టు

రెగ్యులర్ కథల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ గా ప్రయత్నిస్తూ కార్తికేయ 2తో పెద్ద బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న యూత్…

53 mins ago

ప్ర‌చారంలో దుమ్మురేపుతున్న భ‌ర్త‌లు!

రాజ‌కీయాలు మారాయి. ఒక‌ప్పుడు భ‌ర్త‌లు ఎన్నిక‌ల రంగంలో ఉంటే.. భార్య‌లు ఉడ‌తా భ‌క్తిగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చూసుకునే వారు. అది…

2 hours ago

థియేటర్ల నిస్తేజం – బాక్సాఫీసుకు నీరసం

ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్…

3 hours ago

తెర‌పైకి మ‌రోసారి బెట్టింగులు.. ఏపీలో హాట్ సీట్ల‌పైనే!

రాజ‌కీయంగా చైత‌న్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ‌. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజ‌కీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్క‌డ…

4 hours ago

విక్ర‌మ్ కొడుకు.. క్రేజీ మూవీ

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండ‌స్ట్రీలో చేసిన రెండు సినిమాల‌తోనే చాలా ప్రామిసింగ్‌గా అనిపించిన వార‌సుల్లో ధ్రువ్ విక్ర‌మ్ ఒక‌డు. అర్జున్…

5 hours ago