ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని అమరావతికి శంకుస్థాపన చేసే సమయంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంకల్పించిన సంగతి తెలిసిందే. కానీ, జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని నిర్వీర్యం చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరోసారి చంద్రబాబు సీఎం అయి ఉంటే ఆంధ్రుల అంతరాత్మ అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా విరాజిల్లుతుండేదని నిపుణులు కూడా అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ డైజెస్ట్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో అమరావతి రాజధానికి 6వ స్థానం దక్కింది. నిర్మాణంలో ఉన్న ప్రపంచ స్థాయి నగరాల జాబితాను ఈ సంస్థ రూపొందించగా అందులో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ఆరో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆ జాబితాలో అమరావతి ఆరో స్థానాన్ని దక్కించుకోవడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
మ్యాగజైన్ ఎంపిక చేసిన భావి నగరాల జాబితాలో అమరావతి ఉండడం సంతోషకరమని ఆయన అన్నారు. స్థిరంగా అభివృద్ధి చెందే ఓ ఆధునిక నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని తాను భావించానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రపంచపటంలో భారత్ గర్వించే స్థాయిలో అమరావతిని నిర్మించాలని సంకల్పించానని అన్నారు.
ఇక, పోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిందని, కానీ, అమరావతి కార్యరూపం దాల్చలేదని ఆ మ్యాగజైన్ వెల్లడించింది. కానీ, భవిష్యత్తులో రూపుదిద్దుకునే కొత్త నగరాలు ఎలా ఉండాలో చెప్పేందుకు అమరావతి ఒక నమూనా అని అభిప్రాయపడింది. అమరావతి ప్లాన్ లో ఒక ప్రభుత్వ భవన సముదాయం నగరానికి వెన్నెముకలా ఉంటుందని, ఢిల్లీలోని ల్యుకింగ్ సెంట్రల్ పార్క్ మాదిరిగా అమరావతి నగరం మధ్యలో భారీగా పచ్చదనం ఉండేలా డిజైన్ చేశారని ప్రశంసించింది. నగరంలో 60 శాతం పచ్చదనం, నీరు ఉండేలా డిజైన్ చేయడం చాలా గొప్ప విషయమని ఆ మ్యాగజైన్ ప్రశంసించింది. అనుకున్నట్టుగా అమరావతి రూపుదిద్దుకొని ఉంటే ప్రపంచ మహా నగరాల్లో అమరావతి సుస్థిర స్థానం దక్కించుకొని ఉండేదని చెప్పింది.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…