ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని అమరావతికి శంకుస్థాపన చేసే సమయంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంకల్పించిన సంగతి తెలిసిందే. కానీ, జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని నిర్వీర్యం చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరోసారి చంద్రబాబు సీఎం అయి ఉంటే ఆంధ్రుల అంతరాత్మ అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా విరాజిల్లుతుండేదని నిపుణులు కూడా అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ డైజెస్ట్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో అమరావతి రాజధానికి 6వ స్థానం దక్కింది. నిర్మాణంలో ఉన్న ప్రపంచ స్థాయి నగరాల జాబితాను ఈ సంస్థ రూపొందించగా అందులో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ఆరో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆ జాబితాలో అమరావతి ఆరో స్థానాన్ని దక్కించుకోవడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
మ్యాగజైన్ ఎంపిక చేసిన భావి నగరాల జాబితాలో అమరావతి ఉండడం సంతోషకరమని ఆయన అన్నారు. స్థిరంగా అభివృద్ధి చెందే ఓ ఆధునిక నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని తాను భావించానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రపంచపటంలో భారత్ గర్వించే స్థాయిలో అమరావతిని నిర్మించాలని సంకల్పించానని అన్నారు.
ఇక, పోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిందని, కానీ, అమరావతి కార్యరూపం దాల్చలేదని ఆ మ్యాగజైన్ వెల్లడించింది. కానీ, భవిష్యత్తులో రూపుదిద్దుకునే కొత్త నగరాలు ఎలా ఉండాలో చెప్పేందుకు అమరావతి ఒక నమూనా అని అభిప్రాయపడింది. అమరావతి ప్లాన్ లో ఒక ప్రభుత్వ భవన సముదాయం నగరానికి వెన్నెముకలా ఉంటుందని, ఢిల్లీలోని ల్యుకింగ్ సెంట్రల్ పార్క్ మాదిరిగా అమరావతి నగరం మధ్యలో భారీగా పచ్చదనం ఉండేలా డిజైన్ చేశారని ప్రశంసించింది. నగరంలో 60 శాతం పచ్చదనం, నీరు ఉండేలా డిజైన్ చేయడం చాలా గొప్ప విషయమని ఆ మ్యాగజైన్ ప్రశంసించింది. అనుకున్నట్టుగా అమరావతి రూపుదిద్దుకొని ఉంటే ప్రపంచ మహా నగరాల్లో అమరావతి సుస్థిర స్థానం దక్కించుకొని ఉండేదని చెప్పింది.
This post was last modified on March 1, 2023 12:44 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…