Political News

చంద్ర‌బాబుపై.. కేంద్రానికి సోము ఘాటు లేఖ‌..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై త‌ర‌చుగా ప‌రోక్ష విమ‌ర్శ‌లు గుప్పించే బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రా జు.. తాజాగా కేంద్ర బీజేపీ పెద్ద‌ల‌కు.. ఘాటు లేఖ రాసిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీలోనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రాష్ట్రంలో గ‌త వారం చోటు చేసుకున్న ప‌రిణామాలు.. రాష్ట్రంలో ప‌రిస్థితిని సోము ఈ సందర్భంగా లేఖ‌లో ప్ర‌స్తావించార‌ని స‌మాచారం. ముఖ్యంగా చంద్ర‌బాబు వ‌ల్లే.. పార్టీ ఎద‌గ‌డం లేద‌ని..ఆయ‌న చెప్పినట్టు తెలుస్తోంది.

అన్ని లోపాల‌కు.. పార్టీ ఎద‌గ‌క‌పోవ‌డానికి కూడా చంద్ర‌బాబే కార‌ణం. అని సోము వీర్రాజు స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం. ‘పార్టీని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపిస్తున్నాను. ఈ విష‌యంలో మీకు కూడా అనేక రిపోర్టులు ఇప్పటికే ఇచ్చాను. కానీ, చంద్ర‌బాబు మ‌న‌ల్ని బ‌త‌క‌నివ్వ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ కీల‌క నాయ‌కుల‌ను పార్టీలోకి తీసుకుంటున్నారు. ప‌ద‌వులు ఆశ చూపుతున్నారు. ఇలా అయితే.. పార్టీ బ‌త‌క‌డం క‌ష్టం’ అని సోము తేల్చి చెప్పిన‌ట్టు కీల‌క నేత‌ల మ‌ధ్య గుస‌గుస జోరుగానే వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం వెళ్లిపోయిన, వెళ్లిపోతార‌ని భావిస్తున్న పేర్ల‌ను కూడా సోము వీర్రాజు స‌ద‌రు లేఖ లో స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందీ లేద‌ని.. కేవ‌లం చంద్ర‌బాబు ఆయ‌న కు చెందిన కొంద‌రు వ్య‌క్తుల ద్వారానే పార్టీ ఇబ్బందుల్లో ప‌డుతోంద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించిన‌ట్టు తిరుప‌తికి చెందిన కీల‌క నాయ‌కుడు ఒక‌రు ఆఫ్‌దిరికార్డుగా చెప్పిన‌ట్టు స‌మాచారం.

“మా నాయ‌కుడు కేంద్రానికి లేఖ రాశారు. ఏం జ‌రుగుతుందో తెలియ‌దు.కానీ, రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి బాగోలేదు . ఎవ‌రినీ ఏమీ అనే ప‌రిస్థితి లేదు. మాతో న‌మ్మ‌కంగా ఉంటూనే మాకు వెన్నుపోటు పొడుస్తున్నా రు” అని ఆయ‌న కూడా వ్యాఖ్యానించారు. అంటే.. మొత్తంగా ఎన్నిక‌ల‌కు ముందు.. ఏపీలో బీజేపీ కీల‌క స్టెప్పే తీసుకుంటోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది తర్వాత ఎటు మ‌లుపుతిరుగుతుందో చూడాలి.

This post was last modified on February 28, 2023 3:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

1 hour ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago