Political News

జగన్ మార్క్ స్ట్రోక్… ఒక్క దెబ్బకు మూడు పిట్టలు?

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టే ఏ ఒక్క అవకాశము వదలలేదు. వీలు చిక్కినప్పుడల్లా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న జగన్…తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా దేశానికి వెన్నెముక అయిన గ్రామాలకు దన్నుగా ఉన్న రైతులకు జగన్ పెద్దపీట వేశారు. రైతు భరోసా కేంద్రాలతో పాటు పలు రకాలుగా రైతులను ఆదుకుంటున్నారు.

ఇక, మరో పక్క కేంద్రంలోని మోడీ సర్కార్ కు అనుకూలంగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో జగన్ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో ఒకే దెబ్బకు మూడు పిట్టలు కొట్టినట్లయింది. దేశంలో ప్రఖ్యాత పాల ఉత్పత్తుల కంపెనీ అమూల్‌తో చేసుకున్న ఒప్పందంతో జగన్ మూడు రకాలుగా లాభపడ్డట్లయింది.

చంద్రబాబు కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు హెరిటేజ్ కంపెనీ. అటువంటి హెరిటేజ్ కంపెనీకి చెక్ పెట్టేలా ప్రముఖ సంస్థ అమూల్ తో జగన్ జత కట్టారు. అమూల్‌తో జగన్ సర్కారు చేసుకున్న ఎంవోయూతో బాబు ఆర్థిక మూలాలకు మూలస్తంభమైన హెరిటేజ్‌కు గట్టి దెబ్బ తగిలిందని అనుకుంటున్నారు. దీంతో, హెరిటేజ్ కు చెక్ పెట్టడంతో బాబు ఆర్థిక మూలాల్లో ఒకదానిపై కొంత ప్రభావం పడే అవకాశముంది.

ఏపీలో పాల వ్యాపారంలో హెరిటేజ్ కు పోటీగా అమూల్ రావడంతో కొంత నష్టం వాటిల్లే చాన్స్ ఉంది. ఇక, గుజరాత్ కు చెందిన అమూల్ ను ఆదరించి గుజరాతీ అయిన ప్రధాని మోడీ మనసును గెలుచుకున్నారు జగన్. మరోవైపు, దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అమూల్ తో ఏపీ సర్కార్ ఒప్పందం వల్ల పాడి రైతుల్లో సానుకూలత వచ్చే అవకాశముంది. ఈ రకంగా జగన్…ఒక దెబ్బకు మూడు పిట్టలను కొట్టినట్లయింది.

చంద్రబాబు హయాంలో ప్రభుత్వ కార్యకలాపాల్లో, ప్రజలకు ఉచితంగా పాల ఉత్పత్తుల పంపిణీలో హెరిటేజ్ ఉత్పత్తులు దర్శనమిచ్చేవి. ప్రభుత్వ పరంగా పాల ఉత్పత్తుల కొనుగోళ్ళు, అంగన్ వాడి స్కూళ్ళు, హాస్టళ్లు, బహిరంగ సభలు సమావేశాలకు హెరిటేజ్ నుంచే కొనుగోళ్ళు జరిగేవి. ఆయా కార్యక్రమాల్లో హెరిటేజ్ ఉత్పత్తులు, హెరిటేజ్ ఫ్రెష్ లోని వస్తువులను వాడేలా ప్రభుత్వంతో హెరిటేజ్‌ కు ఒప్పందం ఉంది. తాజాగా అమూల్ తో ఒప్పందం వల్ల హెరిటేజ్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

అమూల్ కు ప్రభుత్వ సహకారం, సహకార రంగానికి వర్తింపజేసే అన్నిరకాల ప్రోత్సాహకాల్ని జగన్ అందించే అవకాశముంది. అప్పుడు అమూల్ తో హెరిటేజ్ కు గట్టి పోటీ ఏర్పడుతుంది. ఈ పోటీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో హెరిటేజ్ ఉత్పత్తులు ఉండకపోవచ్చు. కాబట్టి, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ వ్యాపారపరంగా కొంత నష్టపోయే అవకాశముంది.

This post was last modified on July 27, 2020 2:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్

జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…

4 hours ago

ఛావాకు రెండో బ్రేక్ పడింది

మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…

5 hours ago

ఖైదీ 2 ఎప్పుడు రావొచ్చంటే

సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…

5 hours ago

దాశరథి, గద్దర్, శ్రీపతి రాములు.. ఎందరెందరో..?

జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…

6 hours ago

భయం లేదు కాబట్టే… బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్

భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…

7 hours ago

11వ ఆవిర్భావం పూర్తి.. 11 స్థానాల‌కు ప‌రిమితం!: ప‌వ‌న్ కల్యాణ్‌

భార‌త దేశానికి బ‌హుభాషే మంచిద‌ని జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జ‌రిగిన…

7 hours ago