Political News

తమిళనాడు రాజధానిని మారుస్తున్నారా?

కొన్నిసార్లు అంతే.. ఏళ్లకు ఏళ్ల క్రితం హాట్ హాట్ గా జరిగిన చర్చల్ని గుర్తు చేసే అంశాలు చోటు చేసుకుంటాయి. తాజాగా తమిళనాడులో అలాంటి పరిస్థితే నెలకొంది. అంతకంతకూ పెరిగిపోతూ.. ఒక్క చెన్నైమహానగరంలోనే లక్షకు కాస్త దగ్గరగా పాజిటివ్ లు పెరిగిపోయిన వేళ.. రాష్ట్ర రాజధాని నగరాన్ని మార్చాలన్న పాత డిమాండ్ సరికొత్తగా తెర మీదకు వచ్చింది. దాదాపు ముప్ఫై ఏళ్ల క్రితం తమిళనాడు రాజధానిని మార్చాలన్న ప్రతిపాదనపై జోరుగా చర్చ సాగింది.

అప్పట్లో ఈ అంశాన్ని అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత మహానేత ఎంజీఆర్ ప్రయత్నించారు. కానీ.. ఫలించలేదు. తర్వాతి కాలంలో ఈ ప్రతిపాదనకు కాస్త మార్పులు చేసిన డీఎంకే మాజీ అధ్యక్షుడు దివంగత నేత కరుణానిధి సైతం విమర్శల్ని ఎదుర్కొన్నారు. తమిళనాడు రాష్ట్ర రాజధానిని చెన్నై నగరం కాకుండా మరో నగరాన్ని చేయటాన్ని అస్సలు ఇష్టపడని పరిస్థితి.

తాజాగా కరోనా వీరతాండవం చేస్తున్న వేళ.. పాత డిమాండ్ సరికొత్తగా తెర మీదకు వచ్చింది. చెన్నై మహానగరంలో జనసాంద్రత ఎక్కువగా ఉండటం వల్లే ఈ స్థాయిలో కరోనా వచ్చినట్లుగా అభిప్రాయపడుతున్నారు. అదే.. చిన్న ప్రాంతం రాజధానిగా ఉంటే.. ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్న వాదన వినిపిస్తోంది.

అప్పట్లో ప్రతిపాదించిన తిరుచ్చి నగరాన్ని తమిళనాడు రాజధానిగా చేసి ఉంటే.. ఈ రోజున 90 వేల మంది పాజిటివ్ గా అయ్యే వారు కాదని చెబుతున్నారు. మరి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెర మీదకు వచ్చిన కొత్త రాజధాని మాట ఎంతవరకు వెళుతుందన్నది ఇప్పటికిప్పుడు అంచనా వేయటం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు అనుకుంటున్నట్లుగా తిరుచ్చిని తమిళనాడు రాజధానిగా మారిస్తే..కొత్త సమస్యల్ని ఎదుర్కొనే వీలుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

This post was last modified on July 27, 2020 12:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago