Political News

తెలంగాణ‌పై టీడీపీ అధిరిపోయే ప్లాన్‌!

తెలంగాణ‌లో టీడీపీ పుంజుకునేలా ఆ పార్టీపెద్ద‌లు అధిరిపోయే ప్లాన్ వేశారు. పార్టీని ఇంటింటికీ తీసుకువెళ్లి.. ప‌రిచ‌యం చేసేందుకు.. పార్టీని పుంజుకునేలా చేసేందుకు.. ఈ ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పూర్వవైభవం దిశగా అడుగులు పడుతుంద‌ని నాయ‌కులు చెబుతున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, విద్యావంతులను పార్టీవైపు తిప్పేలా ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ఆదివారం నుంచి ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పది రోజులపాటు మండలం యూనిట్‌గా ప్రతి బూత్ స్థాయిలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వ‌హించ‌నున్నారు. అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో డివిజన్ల వారీగా కొనసాగుతుంది. అదే ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకుంటూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపడతారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని డివిజన్లలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తారు. కిలో రూ.2 బియ్యం పథకం, పట్వారీ, పటేల్ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తి హక్కు, బీసీ వర్గాలకు పెద్దపీట వంటి అంశాలు వివరించడంతోపాటు టీడీపీ పూర్వ వైభవం కోసం సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.

పది రోజుల తర్వాత మరో 20 రోజులపాటు ప్రతి మండలంలో అన్ని గ్రామాల్లో బస్సు యాత్రలు చేపట్ట‌నున్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మార్చి 27వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ‘సింహగర్జన’ పేరిట లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించ‌నున్నారు. ఆ సభకు ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరవుతారు. ఏదేమైనా.. గ‌తానికి భిన్నంగా టీడీపీ పుంజుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

నవీన్ పొలిశెట్టి… 5500 కోట్ల ఫ్రేమ్

నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…

54 minutes ago

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…

1 hour ago

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…

2 hours ago

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

2 hours ago

గ్రేట్ డైరెక్టర్… సిల్లీ లాజిక్

గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…

3 hours ago

సుప్రీం చెప్పింది… మోడీ క‌దిలారు: దేశ‌వ్యాప్తంగా దాడులు!

సుప్రీంకోర్టు హెచ్చ‌రిక‌లు, దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం క‌దిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో…

3 hours ago