టీడీపీ అధినేత.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడుకు అవమానం జరిగిందా? అది కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావాలనే చేశారా? అంటే.. టీడీపీ నాయకులు ఔననే అంటు న్నారు. ఈ అవమానాన్ని భరించలేక.. చంద్రబాబు బాధపడ్డారని.. వెంటనే తిరుగు ప్రయాణం కూడా అయ్యారని.. చెబుతున్నారు. మరి ఇంతకీ చంద్రబాబును అంతగా వేధించిన ఘటన ఏంటంటే..
తాజాగా ఏపీలో కొత్త గవర్నర్ కొలువుదీరారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్.. ఏపీ కొత్త గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. కొత్త గవర్నర్తో ప్రమాణం చేయించారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్తోపాటు.. మంత్రి వర్గాన్ని కూడా ఆహ్వానించారు. ఇక, ప్రత్యేక అతిథులు కూడా హాజరయ్యారు.
ఇక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఆహ్వానించారు. కొత్త గవర్నర్.. పైగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కావడంతో చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమానికి హాజ రయ్యారు. అయితే.. ఈసందర్భంగా చంద్రబాబుకు అవమానం జరిగిందనేది టీడీపీ నేతలమాట.
టీడీపీ నేతల ఆరోపణలు ఇవే..
అవమానం 1: ప్రధాన ప్రతిపక్ష నేతను మండలి చైర్మన్ పక్కన కూర్చోబెట్టారు. (సహజంగా ముఖ్యమంత్రి పక్కన లేదా.. అదే వరుసలో కూర్చోబెట్టాలి)
అవమానం 2: గవర్నర్ ప్రమాణ స్వీకారం అనంతరం.. ముందుగా ముఖ్యమంత్రిబొకే అందించారు. తర్వాత హైకోర్టు సీజే అందించారు. తర్వాతప్రతిపక్ష నేతగా చంద్రబాబు పుష్పగుచ్ఛంఇవ్వాలి. కానీ, చంద్రబాబును స్టేజ్ మీదకు ఆహ్వానించలేదు.
అవమానం 3: కొత్త గవర్నర్కు ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్ర నేతలను పరిచయం చేశారు. వీరిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా పరిచయం చేయాలి. కానీ, జగన్.. తనను, తన మంత్రి వర్గాన్ని పరిచయం చేసుకున్నారే తప్ప..చంద్రబాబును పరిచయం చేయలేదు.
అవమానం 4: దీంతో చంద్రబాబు రాజ్భవన్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే.. ఇవన్నీ ఓ కంటితో అధికార పార్టీ పెద్దలు పరిశీలించినప్పటికీ.. బాబును పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అవమానం 5: అధికార ఐ అండ్ పీఆర్ ఆన్లైన్లో ఉంచిన గవర్నర్ ప్రమాణస్వీకారోత్సవం వీడియోలో చంద్రబాబును కనిపించకుండా.. సదరు వీడియోను ఎడిట్ చేశారని .. టీడీపీ నేతలు పేర్కొన్నారు.
This post was last modified on February 25, 2023 11:11 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…