టీడీపీ అధినేత.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడుకు అవమానం జరిగిందా? అది కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావాలనే చేశారా? అంటే.. టీడీపీ నాయకులు ఔననే అంటు న్నారు. ఈ అవమానాన్ని భరించలేక.. చంద్రబాబు బాధపడ్డారని.. వెంటనే తిరుగు ప్రయాణం కూడా అయ్యారని.. చెబుతున్నారు. మరి ఇంతకీ చంద్రబాబును అంతగా వేధించిన ఘటన ఏంటంటే..
తాజాగా ఏపీలో కొత్త గవర్నర్ కొలువుదీరారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్.. ఏపీ కొత్త గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. కొత్త గవర్నర్తో ప్రమాణం చేయించారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్తోపాటు.. మంత్రి వర్గాన్ని కూడా ఆహ్వానించారు. ఇక, ప్రత్యేక అతిథులు కూడా హాజరయ్యారు.
ఇక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఆహ్వానించారు. కొత్త గవర్నర్.. పైగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కావడంతో చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమానికి హాజ రయ్యారు. అయితే.. ఈసందర్భంగా చంద్రబాబుకు అవమానం జరిగిందనేది టీడీపీ నేతలమాట.
టీడీపీ నేతల ఆరోపణలు ఇవే..
అవమానం 1: ప్రధాన ప్రతిపక్ష నేతను మండలి చైర్మన్ పక్కన కూర్చోబెట్టారు. (సహజంగా ముఖ్యమంత్రి పక్కన లేదా.. అదే వరుసలో కూర్చోబెట్టాలి)
అవమానం 2: గవర్నర్ ప్రమాణ స్వీకారం అనంతరం.. ముందుగా ముఖ్యమంత్రిబొకే అందించారు. తర్వాత హైకోర్టు సీజే అందించారు. తర్వాతప్రతిపక్ష నేతగా చంద్రబాబు పుష్పగుచ్ఛంఇవ్వాలి. కానీ, చంద్రబాబును స్టేజ్ మీదకు ఆహ్వానించలేదు.
అవమానం 3: కొత్త గవర్నర్కు ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్ర నేతలను పరిచయం చేశారు. వీరిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా పరిచయం చేయాలి. కానీ, జగన్.. తనను, తన మంత్రి వర్గాన్ని పరిచయం చేసుకున్నారే తప్ప..చంద్రబాబును పరిచయం చేయలేదు.
అవమానం 4: దీంతో చంద్రబాబు రాజ్భవన్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే.. ఇవన్నీ ఓ కంటితో అధికార పార్టీ పెద్దలు పరిశీలించినప్పటికీ.. బాబును పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అవమానం 5: అధికార ఐ అండ్ పీఆర్ ఆన్లైన్లో ఉంచిన గవర్నర్ ప్రమాణస్వీకారోత్సవం వీడియోలో చంద్రబాబును కనిపించకుండా.. సదరు వీడియోను ఎడిట్ చేశారని .. టీడీపీ నేతలు పేర్కొన్నారు.
This post was last modified on February 25, 2023 11:11 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…