Political News

హైదరాబాద్ లో ఒక్కరోజులో 50 కరోనా దహనాలు

తెలుగు మీడియాలో సంచలన కథనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఒక అగ్ర పత్రిక ఈ రోజున సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది. ఓపక్క తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా మరణిస్తున్న రోజువారీ మరణాల్ని పదికి మించకుండా చూపించటం తెలిసిందే.

అప్పుడప్పడు తప్పించి.. మిగిలిన రోజుల్లో మాత్రం పది కంటే తక్కువగా చూపిస్తున్నారు. అయితే.. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవానికి ఏ మాత్రం సిద్ధం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. అలా అని ఆ విషయాన్ని ఇప్పటివరకూ నిరూపించింది లేదు.

ఇలాంటివేళ.. ఒక ప్రముఖ మీడియా సంస్థ ఓ ప్రయోగాన్ని చేసింది. హైదరాబాద్ లోని ఈఎస్ఐ శ్మశాన వాటిక వద్ద గురువారం ఉదయం నుంచి అర్థరాత్రి దాటిన తర్వాత వరకూ తన సిబ్బందితో డేగకన్ను వేయించి.. లెక్కలు తీశారు.

కరోనా డెడ్ బాడీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని శ్మశానానికి తీసుకొస్తారో అదే రీతిలో వచ్చిన అంబులెన్స్ ల లెక్కను తీశారు. ఇలా తీస్తే.. ఒక్క ఈఎస్ఐ శ్మశాన వాటికకు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చిన అంబులెన్సులు ఏకంగా 38 కావటం సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ మహానగరంలో కొన్ని శ్మశాన వాటికల్లో కరోనా కారణంగా మరణించిన డెడ్ బాడీలకు నిర్వహించిన అంతిమసంస్కారాల లెక్క తీస్తే.. అవి మరో పన్నెండుగా తేలాయి. సదరు సంస్థ వేసిన లెక్క ఇలా ఉంటే.. వాస్తవ లెక్క మరెలా ఉంటుందన్నది ఒక సందేహం.

తెలంగాణ రాష్ట్రం మొత్తం వదిలేసి.. ఒక్క హైదరాబాద్ లోనే ఇలా ఉంటే.. మిగిలిన రాష్ట్రమంతా లెక్క వేస్తే ఇంకెన్ని మరణాలు? అన్న సూటి ప్రశ్నను సదరు కథనం సంధించింది.

ఇప్పటివరకు నామమాత్రంగానే కరోనా మరణాలు సాగుతున్నాయన్న తెలంగాణ సర్కారు వాదనను తిప్పి కొట్టేలా.. ఆత్మరక్షణలో పడేసేలా తాజా కథనం ఉందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో కరోనా మరణాల అంత్యక్రియలపై తెలంగాణ ప్రభుత్వం ఏమని బదులిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

This post was last modified on July 26, 2020 9:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

11 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

36 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

38 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago