Political News

రావాలి జగన్…జన్మభూమికి… !! ఈ పాట వెనుక మనిషి

సాధారణంగా సినిమా పాటలు జనాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఆయా సాహిత్యాన్ని బట్టి ప్రేక్షకులు స్ఫూర్తి పొందుతుంటారు. అదే తరహాలో పొలిటికల్ సాంగ్స్ కూడా ఓటర్లను …ఆయా పార్టీల అభిమానులను….కొన్ని సార్లు తటస్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. 2019 ఎన్నికల ప్రచారంలో రావాలి జగన్…కావాలి జగన్..మన జగన్ అన్న పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

2018లో విడుదలైన ఈ పాటకు యూట్యూబ్ లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ పొందిన పొలిటికల్ క్యాంపెయిన్ సాంగ్ గా ఈ పాట రికార్డు క్రియేట్ చేసింది. ఫిదాచిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తిక్ కంపోజ్ చేసిన ఈ పాటను ప్రముఖ సినీ గేయ రచయిత, డాక్టర్ సుద్దాల అశోక్ తేజ(సినీ నటుడు ఉత్తేజ్ మేనమామ) రచించారు.

అయితే, తాజాగా ఈ పాటల వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో సుద్దాల అశోక్ తేజ…గతంలో టీడీపీకి కూడా పాటలు రాశారని టీడీపీ అభిమానులు ట్వీట్ చేశారు.

ఈ విషయం వైసీపీ అభిమానులకు తెలీదంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ పాటకు నాటి సీఎం చంద్రబాబు దగ్గర నుంచి అందుకున్న ప్రశంసల గురించి స్వయంగా సుద్దాల చెప్పిన పేపర్ కటింగ్ ను పోస్ట్ చేశారు.

1997లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో జన్మభూమి కార్యక్రమం కోసం ‘తరలుదాం రండి మనం జన్మభూమికి’ అనే పాటను రాశానని, ఆరోజు వేదికపై చంద్రబాబునాయుడుగారు ప్రశంసించిన విషయాన్ని ఎప్పటికీ మరువలేనని సుద్దాల నాడు వెల్లడించారు.

ఈ రకంగా టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో జరిగిన వెర్బల్ వార్ వల్ల….ఈ పాటల వెనుక ఉన్న చరిత్ర తెలుసుకునే అవకాశం కలిగిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

This post was last modified on July 25, 2020 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

31 minutes ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

2 hours ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

2 hours ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

3 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

4 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

4 hours ago