టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో యూట్యూర్, విమర్శకుడు.. మహాసేన పేరుతో యూట్యూబ్ నిర్వహి స్తున్న రాజేష్ టీడీపీ కండువా కప్పుకొన్నారు. రాజేష్ తరచుగా వైసీపీ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అనేక విధానాలను, ముఖ్యంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారంటూ.. రాజేష్ చేసిన వీడియోలను వీక్షకులు బాగానే ఆదరించారు. ఈ క్రమంలోనే ఆయన జనసేన వైపు చూశారు. అయితే.. అటు వైపు నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోవడంతో టీడీపీ సైకిల్ ఎక్కారు.
ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. సామర్లకోటలో ఎస్సీ నేతలతో నిర్వహిం చిన సమావేశం అనంతరం.. రాజేష్కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే.. గతంలో చంద్రబాబు ను రాజేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన తన కుమారుడిని ముఖ్యమంత్రి చేసుకునేందుకే ప్రయత్నిస్తున్నారని.. వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దళిత ద్రోహి ఎవరైనా ఉన్నారా? అంటే.. అది చంద్రబాబేనని ప్రకటించారు. దీంతో అప్పట్లో తీవ్ర స్థాయిలో రాజేష్ వ్యాఖ్యలు ఎస్సీ వర్గాల్లోకి చేరుకున్నాయి.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాజేష్.. తాజాగా మాట్లాడుతూ.. 2019లో తప్పు చేయకుండా ఉండుంటే ఈపాటికే అమరావతి నిర్మాణం పూర్తయ్యేదని వెల్లడించారు. దళితులు ఎవరి కాళ్ల మీద వారు నిలబడేలా చంద్రబాబు చేశారని కొనియాడారు. చీకటి వచ్చాకే వెలుగు విలువ తెలుస్తుందని హితవు పలికారు. జగన్ తుగ్లక్ పాలన చూశాక.. చంద్రబాబు పాలన రామరాజ్యం అనే విషయం అర్థమవుతోందని మహాసేన రాజేష్ అన్నారు.
ఆ టికెట్ ఖాయమేనా?
ఇక, ఊరకరారు మహానుభావులు అన్నట్టుగా ఎవరు పార్టీ తీర్థం పుచ్చుకున్నా.. టికెట్ కోసమే కదా! ఇప్పు డు రాజేష్కు టికెట్ రెడీగా ఉందని అంటున్నారు టీడీపీ నాయకులు. అదే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవ ర్గం.. అమలాపురం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి రాజేష్ పోటీచేసే అవకాశం ఉందని అంటున్నారు. లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడిని ఎంపీగా పంపించి.. రాజేష్కు ఈ టికెట్ ఇస్తారని తెలుస్తోంది. వైసీపీ తరఫున మంత్రి పినిపే విశ్వరూప్కే మరోసారి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…