ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంత అగౌరవం జరిగిందో అందరికీ తెలిసిందే. కనీసం.. జడ్ ప్లస్ భద్రతలో ఉన్న ఆయన నడుచుకుంటూ వెళ్లినా.. పోలీసులు పట్టించుకోలేదు. ఇక, ఆయన ప్రసంగించేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. కాదని… ప్రసంగించిన చంద్రబాబు పోలీసులపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. అయితే.. బాబు సభ ముగియగానే ఆయన ప్రసంగించిన వాహనాన్ని.. మైకును కూడా స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు.
అయితే.. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా తూర్పు ఎస్పీ రంగంలోకి దిగి.. తమ వైపు తప్పు ఏమీ లేదని.. అంతా టీడీపీనే చేసిందని వివరణ ఇచ్చారు. తమ పోలీసులను సమర్ధించుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సభకోసం అనుమతికావాలని కోరారని.. ఎస్పీ తెలిపారు. అయితే, పోలీస్యాక్ట్, జీవో నంబర్-1 అనుసరించి రోడ్డుపై ఎలాంటి బహిరంగ సభలకు అనుమతిలేదని చెప్పామన్నారు.
వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది కలగకుండా ర్యాలీ నిర్వహించుకోవచ్చంటూ నిబంధనలను వారికి తెలియజేశామని ఎస్పీ వివరించారు. ప్రతిపక్ష నాయకులు సభను నిర్వహించుకునేందుకు అనుకూలం గా ఉండే రెండు బహిరంగ ప్రదేశాలను కూడా తామే టీడీపీకి సజ్జస్ట్ చేసినట్టు ఎస్పీ చెప్పుకొచ్చారు. కళాక్షే త్రంతోపాటు, ఒక లే అవుట్లో బహిరంగ సభ నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చని సూచించామన్నారు. అంతేకాకుండా తగిన భద్రతనుకూడా కల్పిస్తామని వివరించినట్టు తెలిపారు.
పోలీసుల విజ్క్షప్తిని టీడీపీ నేతలు తోసిపుచ్చారు. పోలీసు సూచనలను పట్టించుకోలేదు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నడిరోడ్డుపై సభ నిర్వహించారు. జీవో-1 కు విరుద్ధంగా నడుచుకున్నారు. ఈ ఘటనలో చట్టాలను,నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసు యంత్రాంగం చట్టంప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఈ మొత్తం ఘటనకు టీడీపీనే బాధ్యత వహించాలి
అని ఎస్పీ కుండబద్దలు కొట్టారు.
This post was last modified on February 18, 2023 1:27 pm
సక్సెస్ లేని దర్శకుడితో సినిమా అంటే ఎన్నో లెక్కలుంటాయి. ఆడితే ఓకే కానీ తేడా కొడితే మాత్రం విమర్శల పాలు…
రెండు రోజుల్లలో తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన…
ఇంకో పదమూడు రోజుల్లో విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 కోసం అభిమానులే కాదు సగటు సినీ ప్రియులు సైతం…
వలసవాద బ్రిటీష్ విధానాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్థి చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రిమినల్ చట్టా లను మార్పు చేశారు.…
కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు మాసాలే అయింది. అయితే.. ఇంతలోనే అతి పెద్ద సమస్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. విశాఖ…
సైకో కిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే చూస్తాం కానీ కొన్ని ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటే అవి నిజంగా…