Political News

ఫస్ట్ టైమ్: పోలీసులపై తిరుగుబాటు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌వాళ్లు రువ్వారు. అన‌ప‌ర్తిలో త‌న‌కు ఎదురైన ఆంక్ష‌లు.. నిర్బంధాల‌పై ఆయన తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌స్తుతం ఉన్న పోలీసులు గ‌తంలో త‌న ద‌గ్గ‌రే ప‌నిచేశార‌ని.. రాబోయే టీడీపీ ప్ర‌భుత్వంలోనూ త‌మ ద‌గ్గ‌రే ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని.. ఈ విష‌యాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

అన‌ప‌ర్తిలో త‌ను నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స‌భ‌కు పోలీసులు మొదట అనుమతి ఇచ్చార‌ని చంద్ర‌బాబు చెప్పారు. కానీ, తర్వాత అనుమతి రద్దు చేశార‌ని, ఇదేం ప‌ద్ధ‌త‌ని ప్ర‌శ్నించారు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నామని ప్రకటించారు. ఇంతటితో రౌడీరాజ్యం అంతం చేసేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభ మైందని హెచ్చరించారు. మా కార్యకర్తలు ముందుకు వస్తే పోలీస్ స్టేషన్లు సరిపోవని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

ఎంత మందిపైన కేసులు పెడతారో చూస్తామని అన్నారు. చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు దిగాయి. అనపర్తిలో స‌భ ఉంటుంద‌ని.. ముందుగానే ప్ర‌క‌టించ‌డంతో దేవీచౌక్కు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. అయితే.. పోలీసులు బారికేడ్లు పెట్ట‌డంతో వాటిని కూడా తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు.

దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులను తప్పించుకుని పలువురు దేవీచౌక్ సెంటర్కు చేరుకున్నారు. దీంతో అనపర్తిలో దుకాణాలను పోలీసులు మూసి వేయించారు. ఒక రకంగా చెప్పాలంటే.. అన‌ప‌ర్తి ర‌ణ‌రంగాన్నే త‌ల‌పించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 18, 2023 9:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

1 hour ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago