అదేంటి అనుకున్నారా? కొన్నాళ్ల కిందట ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏపీలోని వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ..”ఇదేం ఖర్మమన రాష్ట్రానికి” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. కొన్నాళ్ల తర్వాత.. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టడంతో ఇదేం ఖర్మ కార్యక్రమం వాయిదా పడింది. అయితే.. ఇప్పుడు మరోసారి.. చంద్రబాబు ఈ కార్యక్రమానికి రెడీ అయ్యారు.
ఈ క్రమంలో చంద్రబాబు ‘ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మూడు రోజుల్లో మూడు నియోజకవర్గాల్లో ఆయన రోడ్షోల్లో పాల్గొననున్నారు. అదే ఇధంగా బహిరంగ సభల్లో పాల్గొంటారు.
తొలిరోజు జగ్గంపేట, రెండవ రోజు జగ్గంపేట, పెద్దాపురం.. మూడవ రోజు పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. మూడు రోజులు.. 145 కి.మీ పొడవున రోడ్షో, పర్యటన సాగనుంది. జగ్గంపేటలో పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పూర్తి చేశారు. ఇక గోకవరంలో పర్యటన ఏర్పాట్లను నెహ్రూ, వంతల రాజేశ్వరి తదితరులు పూర్తి చేశారు.
జగన్పై ఇరువైపుల దాడి
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ చాలా వ్యూహాత్మక పోరును చేస్తోంది. ఒకవైపు యువగళం పాదయాత్ర ద్వారా.. పోరును పెంచి సీమ ప్రాంతంలో నారా లోకేష్ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తుతున్నారు. ఇక, ఇటువైపు చంద్రబాబు తూర్పు నుంచి నరుక్కొస్తున్నారనే చెప్పాలి. అంటే.. టీడీపీ చాలా వ్యూహాత్మకంగా ఇరు వైపుల నుంచి సర్కారుపై దాడిని ముమ్మరం చేసిందని అంటున్నారు.
This post was last modified on February 15, 2023 10:21 pm
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…