అదేంటి అనుకున్నారా? కొన్నాళ్ల కిందట ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏపీలోని వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ..”ఇదేం ఖర్మమన రాష్ట్రానికి” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. కొన్నాళ్ల తర్వాత.. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టడంతో ఇదేం ఖర్మ కార్యక్రమం వాయిదా పడింది. అయితే.. ఇప్పుడు మరోసారి.. చంద్రబాబు ఈ కార్యక్రమానికి రెడీ అయ్యారు.
ఈ క్రమంలో చంద్రబాబు ‘ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మూడు రోజుల్లో మూడు నియోజకవర్గాల్లో ఆయన రోడ్షోల్లో పాల్గొననున్నారు. అదే ఇధంగా బహిరంగ సభల్లో పాల్గొంటారు.
తొలిరోజు జగ్గంపేట, రెండవ రోజు జగ్గంపేట, పెద్దాపురం.. మూడవ రోజు పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. మూడు రోజులు.. 145 కి.మీ పొడవున రోడ్షో, పర్యటన సాగనుంది. జగ్గంపేటలో పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పూర్తి చేశారు. ఇక గోకవరంలో పర్యటన ఏర్పాట్లను నెహ్రూ, వంతల రాజేశ్వరి తదితరులు పూర్తి చేశారు.
జగన్పై ఇరువైపుల దాడి
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ చాలా వ్యూహాత్మక పోరును చేస్తోంది. ఒకవైపు యువగళం పాదయాత్ర ద్వారా.. పోరును పెంచి సీమ ప్రాంతంలో నారా లోకేష్ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తుతున్నారు. ఇక, ఇటువైపు చంద్రబాబు తూర్పు నుంచి నరుక్కొస్తున్నారనే చెప్పాలి. అంటే.. టీడీపీ చాలా వ్యూహాత్మకంగా ఇరు వైపుల నుంచి సర్కారుపై దాడిని ముమ్మరం చేసిందని అంటున్నారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…