మరో మూడు టర్మ్ లు మా నాయకుడు పాలించే సత్తా ఉందంటూ తరచూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానిస్తుంటారు. ఆయన ఆ మాటలు అనే ప్రతి సందర్భంలోనూ కేటీఆర్ కు ముఖ్యమంత్రిపదవి బదిలీ చేసే ప్రక్రియ జోరుగా సాగుతుందన్న ప్రచారం జరగటాన్ని అండర్ లైన్ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర యువరాజుగా టీఆర్ఎస్ దళాలు ముద్దుగా పిలుచుకునే కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గతంలో ఎప్పుడూ చూడనంత భారీగా శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.
సోషల్ మీడియాలో ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పేందుకు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు పోటీ పడటం గమనార్హం. ఎందుకిలా జరుగుతోంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అవుతోంది. గతంలోనూ ఎన్నో పుట్టినరోజులు కేటీఆర్ జరుపుకున్నారు. ఎప్పుడూ లేని రీతిలో సోషల్ మీడియాలో ఇంత భారీగా విషెస్ రావటానికి కారణం కరోనాగా అనుకుంటే.. అన్నిరంగాలకు చెందిన వారు పోటాపోటీగా ట్వీట్లు చేయాల్సిన అవసరం ఏమిటి? అన్నది ఒక ప్రశ్న.
మాజీ మంత్రి గంటా లాంటి వారైతే.. కేటీఆర్ తో తాను సన్నిహితంగా ఉన్న ఫోటో పోస్టు చేస్తే.. కన్నడ రాజకీయాల్లో సమ్ థింగ్ స్పెషల్ గా ఉండే ప్రకాశ్ రాజ్ అయితే కేటీఆర్ ఎంతలా కష్టపడతారు.. మరెంతలా శ్రమిస్తారన్న విషయాన్ని అర్థమయ్యేలా ఒక వీడియోను పోస్టు చేసి దానికి పుట్టినరోజు శుభాకాంక్షల్ని చెప్పటం కనిపించింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా తమ విషెస్ ను చెప్పే ప్రయత్నం చేశారు.
ఇక.. అధికార పార్టీకి చెందిన నేతలు పలువురు రక్తదానాలు.. ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. కేటీఆర్ అంటే తమకెంత అభిమానమన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా చూసినప్పుడు ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుందని చెప్పటం తప్పే అవుతుంది. కాకుంటే.. ఒక రాజ్యానికి యువరాజును పట్టాభిషేకం చేసేందుకు జరిగే కసరత్తు భారీగా ఉంటుంది. ఇలా అనుకొని అలా చేసేయటం చాలా తక్కువ సందర్భాల్లోనూ.. ప్రత్యేక సమయాల్లోనే జరుగుతుంది. విడి సమయాల్లో వివిధ దశల్ని అధిగమించాల్సి ఉంది. ప్రస్తుతం కేటీఆర్ అలాంటి ప్రాసెస్ లో ఉన్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న నేపథ్యంలోనే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి.
This post was last modified on July 24, 2020 8:13 pm
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…