Political News

అమరావతి రియల్ ఎస్టేట్‌కు మళ్లీ కదలిక

ఏపీ రాజధాని విషయంలో ఇటీవల కేంద్రం ఇచ్చిన స్పష్టతతో పరిస్థితులు మారుతున్నాయి. ఓవైపు వైజాగ్ తరలిపోతామని సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పటికీ విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని అమరావతేనని కేంద్రం పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేయడంతో స్థానికంగా మళ్లీ ఉత్సాహం మొదలైంది. ముఖ్యంగా అమరావతి చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మళ్లీ కదలిక మొదలైంది. సుప్రీంకోర్టు కూడా ఈ వివాదంపై త్వరలో తీర్పు ఇవ్వనుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆశావహంగా కనిపిస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది. గుంటూరు, విజయవాడ మధ్యన వెలగపూడి ప్రాంతంలో ప్రభుత్వం రాజధాని ఏర్పాటు చేయ డంతో పెద్ద ఎత్తున రియల్‌ వ్యాపారం జరిగింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందలాది రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వెలిశాయి. గుంటూరు- విజయవాడ మధ్యన చెన్నై రహదారికి రెండు వైపులా తాడేపల్లి నుంచి మంగళగిరి వరకు పెద్ద ఎత్తున అపార్టుమెంట్లు.. విల్లాల నిర్మాణం చేపట్టారు.

వందల కోట్లు పెట్టుబడులు పెట్టి ఇక్కడ రియల్‌ వ్యాపారం మొదలు పెట్టిన వ్యాపారవేత్తలు మూడు రాజధానుల ప్రకటనతో పూర్తిగా దెబ్బతిన్నారు.
అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందుతుందని భావించిన సమయంలో.. నిర్మాణ సమయంలోనే విల్లాలు, అపార్టుమెంట్లకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడింది. కొందరు అడ్వాన్సులు కట్టి ఫ్లాట్లు, విల్లాలు బుక్‌ చేసుకున్నారు.

మరికొన్ని చోట్ల నిర్మాణం పూర్తయితే మరింత రేటు వస్తుందనే ఆశాభావంతో నిర్మాణదారులు ముందస్తు బుకింగ్‌కు ఇష్టం చూపలేదు. ఇక వెంచర్లలో పెద్ద ఎత్తున అడ్వాన్సులు చెల్లించి ప్లాట్లు బుక్‌ చేసుకున్నారు. వివిధ వర్గాల నుంచి స్పందన పెద్ద ఎత్తున వస్తున్న నేపధ్యంలో..వ్యాపారులు సైతం రైతులతో ఒప్పందం చేసుకొని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేశారు.

ఈ క్రమంలో శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మూడు రాజధానుల ప్రకటనతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందనే భరోసా రాని స్థితిలో కేంద్ర ప్రభుత్వ ప్రకటన రియల్‌ వ్యాపారుల్లో మళ్లీ ఆశ చిగురించింది.

అప్పులు చేసి మరీ ఈ ప్రాంతంలో స్థలాలు కొన్నవారు ధరలు తగ్గిపోవడంతో వాటిని ఉంచలేక, వదిలించుకోక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో అమరావతి మళ్లీ రాజధాని అని కోర్టో, కేంద్రమో చెప్పినా.. టీడీపీ ప్రభుత్వం వచ్చినా పరిస్థితులు మారుతాయని.. మళ్లీ మంచి రోజులొస్తాయని వ్యాపారులు, స్థలాలు కొన్నవారు, ఇల్లు కొన్నవారు ఎదురుచూస్తున్నారు.

This post was last modified on February 14, 2023 11:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago