ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు 14 నెలలే ఉందని, గడప గడపకు కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యేలకు, పార్టీ శ్రేణులకు ఆయన హితబోధ చేశారు. కార్యక్రమాన్ని ఆషామాషీగా నిర్వహిస్తే ఊరుకోబోనని కుండబద్దలు కొట్టారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనని కొందరు ఎమ్మెల్యేలపై సీఎం జగన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తిరగని వారు, తక్కువ రోజులు తిరిగిన వారికి క్లాస్ తీసుకున్నారు. కొడాలి నాని, ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్.. గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనలేదని వెల్లడించారు. వరెస్ట్ పెర్ఫార్మెన్స్ జాబితాలో 20 నుండి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని జగన్ వార్నింగ్ ఇచ్చారు.
మార్చి 18 నుంచి ‘మా భవిష్యత్ నువ్వే జగన్’ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈలోగా కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణా కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు.
సీఎం జగన్ ఈ మధ్య కాలంలో తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో కూడా ఆయన తీవ్ర అసహనంగా కనిపించారని అంటున్నారు. ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లకుండా మొహం చాటేస్తున్నారని ఆయన ఆగ్రహం చెందుతున్నారు. పీకే టీమ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జగన్ అన్ని విషయాలు మాట్లాడినట్లు తెలుస్తోంది.. మరి ఎమ్మెల్యేలు దారికి వస్తారో లేదో చూడాలి.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…