బీసీలు ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కాకలు తీరిన రాజకీయ యోధుడు కళా వెంకట్రావుకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం అందుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు తన పని చేసుకుపోతుండగా ఆయన్ను డిస్టర్బ్ చేయకుండా కొన్ని పనులను కళా వెంకట్రావుకు అప్పగించారు.
ఉత్తరాంధ్రలో టీడీపీ ఇప్పుడు సామాజికవర్గం లెక్కలు చూస్తోంది. కాపు వర్గాలను పూర్తిగా తమ వైపుకు తిప్పుకుంటే వైసీపీని నేలమట్టం చేయవచ్చన్న ఆలోచనలో టీడీపీ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వెంకట్రావుకు ఉన్న పరపతితో సొంత కాపు సామాజిక వర్గానికి గాలం వేయాలని చంద్రబాబు ఆదేశించారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ శ్రీకాకుళం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. ఈ సారి మొత్తం సీట్లు గెలిస్తే కళా వెంకట్రావు సేవలను గుర్తిస్తామని అధిష్టానం ఆఫరిచ్చినట్లు చెబుతున్నారు..
ఈ నెల 25న విశాఖలో టీడీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు అన్ని నియోజకవర్గాల ఇంఛార్జులు హాజరవుతారు. దాదాపు 4 వేల మంది వస్తారని, చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు. ప్రాంతీయంగా పార్టీ పరిస్థితి, నియోజకవర్గాల వారీగా జయాపజయాలపై కళావెంకట్రావు పార్టీ అధిష్టానానికి ఒక నివేదిక సమర్పిస్తారు. మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు ఫోకస్ పెడుతోంది…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…
టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…
తెలుగులో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీకి వంద కోట్ల వసూళ్లు రావడం అన్నది అనూహ్యమే. అందులోనూ అది ఫ్యామిలీ సినిమా…
వీకెండ్ వసూళ్లను ఘనంగా రాబట్టుకున్న లెనిన్ అసలు పరీక్ష మొదలుపెట్టింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద…