Political News

ఏపీలో కరోనా ఉగ్రరూపం…ఒక్క రోజే దాదాపు 8 వేల కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. తీరం దాటిన తుపానులా ఏపీపై కరోనా పంజా విసురుతోంది. గత రెండు రోజులుగా ఏపీలో 5 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రజలు కలవరపడతున్నారు. తాజాగా, ఏపీలో రికార్డు స్థాయిలో 7998 పాజిటివ్ కేసులు నమోదవడం మరింత కలవరపెడుతోంది. అయితే, డిశ్చార్జిల విషయంలో ఏపీలో పురోగతి ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో 5,428 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 34,114 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 58,052 శాంపిల్స్ ను పరీక్షించగా….వాటిలో 7998 పాజిటివ్ వచ్చాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 69816కు చేరింది. ఏపీలోని 3 జిల్లాల్లో ఒకే రోజు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవడం విశేషం.

గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుంచి కోలుకుని 5248 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తం 34,818మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 61 మంది మృత్యువాతపడ్డారు. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో అత్యధికం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు, అనంతపురం జిల్లాలున్నాయి. తూర్పు గోదావరిలో 1391, గుంటూరులో 1184, అనంతపురంలో 1016 కేసులు, కర్నూలులో 904, విశాఖపట్నంలో 684, పశ్చిమ గోదావరిలో 748 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో 14 మంది, గుంటూరులో 7, కర్నూలులో 7, కృష్ణాలో 6, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 5, విజయనగరంలో 5, చిత్తూరులో 3, పశ్చిమగోదావరిలో 3, ప్రకాశంలో 3, కడపలో ఒక్కరు, అనంతపురం జిల్లాలో ఒకరు కరోనా బారినపడి చనిపోయారు. దీంతో, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 884కి పెరిగింది.

This post was last modified on July 23, 2020 7:39 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago