Political News

ఏపీలో కరోనా ఉగ్రరూపం…ఒక్క రోజే దాదాపు 8 వేల కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. తీరం దాటిన తుపానులా ఏపీపై కరోనా పంజా విసురుతోంది. గత రెండు రోజులుగా ఏపీలో 5 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రజలు కలవరపడతున్నారు. తాజాగా, ఏపీలో రికార్డు స్థాయిలో 7998 పాజిటివ్ కేసులు నమోదవడం మరింత కలవరపెడుతోంది. అయితే, డిశ్చార్జిల విషయంలో ఏపీలో పురోగతి ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో 5,428 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 34,114 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 58,052 శాంపిల్స్ ను పరీక్షించగా….వాటిలో 7998 పాజిటివ్ వచ్చాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 69816కు చేరింది. ఏపీలోని 3 జిల్లాల్లో ఒకే రోజు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవడం విశేషం.

గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుంచి కోలుకుని 5248 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తం 34,818మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 61 మంది మృత్యువాతపడ్డారు. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో అత్యధికం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు, అనంతపురం జిల్లాలున్నాయి. తూర్పు గోదావరిలో 1391, గుంటూరులో 1184, అనంతపురంలో 1016 కేసులు, కర్నూలులో 904, విశాఖపట్నంలో 684, పశ్చిమ గోదావరిలో 748 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో 14 మంది, గుంటూరులో 7, కర్నూలులో 7, కృష్ణాలో 6, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 5, విజయనగరంలో 5, చిత్తూరులో 3, పశ్చిమగోదావరిలో 3, ప్రకాశంలో 3, కడపలో ఒక్కరు, అనంతపురం జిల్లాలో ఒకరు కరోనా బారినపడి చనిపోయారు. దీంతో, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 884కి పెరిగింది.

This post was last modified on July 23, 2020 7:39 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

4 hours ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

5 hours ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

5 hours ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

7 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

7 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

7 hours ago