Political News

రాజమండ్రి బాలిక ఇక టీడీపీ బిడ్డ… మేమే చదివిస్తాం- చంద్రబాబు

రాజకీయం తెలియకనే మూడు సార్లు ముఖ్యమంత్రి కావడం అన్నది సాధ్యం కాదు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చంద్రబాబును బలహీన పరచడానికి ఎప్పటికపుడు ఇక చంద్రబాబుకు రిటైర్ మెంటే అన్నట్లు ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని తన చేతలతో చంద్రబాబు పటాపంచలు చేస్తున్నారు. తానింకా ఫుల్ ఫాంలో ఉన్నట్లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల వర్చువల్ గా మహానాడు నిర్వహించి ఇంటర్నెట్ తోనే వైసీపీకి షాక్ ఇచ్చిన చంద్రబాబు తాజాగా రాజమండ్రి బాలిక రేప్ కేసులో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు.

రాజమండ్రిలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెలుగులోకి రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వం అసమర్థత అంటూ ఏకిపారేశాడు. అంతేకాదు తాజాగా ఆ బాలిక కు పార్టీ తరఫున 2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు చంద్రబాబు. ఘటనపై పార్టీ తరఫున నిజనిర్ధారణ కమిటీ వేసి నివేదిక తెప్పించుకున్నారు. కమిటీ సభ్యులు నిన్న రాజమండ్రికి వెళ్లి బాధితురాలని పరామర్శించారు. సకల వివరాతో నివేదికను చంద్రబాబుకు అందించారు. వెంటనే చంద్రబాబు ఆ నివేదిక మేరకు తక్షణ సాయం కింద నగదు సాయం ప్రకటించారు.

ఈ సందర్భంగా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. శాశ్వతంగా ఆ పాప బాధ్యత తెలుగుదేశం పార్టీదే అన్నారు. బాలిక పదో తరగతి వరకు చదువుకుందని, ఇక ఆ అమ్మాయిని పార్టీ తరఫున చదివిస్తామన్నారు. తనకు టీడీపీ అండగా ఉంటుందనే భరోసాను కలిగించాలని చెబుతూ ‘‘ఇలాంటి దుర్మార్గాలపై పోరాడే వీరవనితగా ఆమెను తీర్చిదిద్దాలని‘‘ సంచలన వ్యాఖ్య చేశారు.

చంద్రబాబు తాజా నిర్ణయం… స్థానికంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. వేగంగా పార్టీ ఈ ఘటనలో రియాక్టైన తీరు పార్టీ పై చాలా సానుకూల ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

This post was last modified on July 23, 2020 7:02 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

3 minutes ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

3 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

3 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

4 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

6 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

10 hours ago