Political News

రాజమండ్రి బాలిక ఇక టీడీపీ బిడ్డ… మేమే చదివిస్తాం- చంద్రబాబు

రాజకీయం తెలియకనే మూడు సార్లు ముఖ్యమంత్రి కావడం అన్నది సాధ్యం కాదు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చంద్రబాబును బలహీన పరచడానికి ఎప్పటికపుడు ఇక చంద్రబాబుకు రిటైర్ మెంటే అన్నట్లు ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని తన చేతలతో చంద్రబాబు పటాపంచలు చేస్తున్నారు. తానింకా ఫుల్ ఫాంలో ఉన్నట్లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల వర్చువల్ గా మహానాడు నిర్వహించి ఇంటర్నెట్ తోనే వైసీపీకి షాక్ ఇచ్చిన చంద్రబాబు తాజాగా రాజమండ్రి బాలిక రేప్ కేసులో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు.

రాజమండ్రిలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెలుగులోకి రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వం అసమర్థత అంటూ ఏకిపారేశాడు. అంతేకాదు తాజాగా ఆ బాలిక కు పార్టీ తరఫున 2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు చంద్రబాబు. ఘటనపై పార్టీ తరఫున నిజనిర్ధారణ కమిటీ వేసి నివేదిక తెప్పించుకున్నారు. కమిటీ సభ్యులు నిన్న రాజమండ్రికి వెళ్లి బాధితురాలని పరామర్శించారు. సకల వివరాతో నివేదికను చంద్రబాబుకు అందించారు. వెంటనే చంద్రబాబు ఆ నివేదిక మేరకు తక్షణ సాయం కింద నగదు సాయం ప్రకటించారు.

ఈ సందర్భంగా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. శాశ్వతంగా ఆ పాప బాధ్యత తెలుగుదేశం పార్టీదే అన్నారు. బాలిక పదో తరగతి వరకు చదువుకుందని, ఇక ఆ అమ్మాయిని పార్టీ తరఫున చదివిస్తామన్నారు. తనకు టీడీపీ అండగా ఉంటుందనే భరోసాను కలిగించాలని చెబుతూ ‘‘ఇలాంటి దుర్మార్గాలపై పోరాడే వీరవనితగా ఆమెను తీర్చిదిద్దాలని‘‘ సంచలన వ్యాఖ్య చేశారు.

చంద్రబాబు తాజా నిర్ణయం… స్థానికంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. వేగంగా పార్టీ ఈ ఘటనలో రియాక్టైన తీరు పార్టీ పై చాలా సానుకూల ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

This post was last modified on July 23, 2020 7:02 pm

Share

Recent Posts

సీఎం సినిమా తడబడుతుంది

అసలే తెలుగు నుంచి తమిళంలోకి రీమేక్ అయిన సినిమా. పైగా విడుదల చాలా ఆలస్యం అయింది. మధ్యలో సినిమా ఆన్…

1 hour ago

పాత రోజుల్లోకి నారా రోహిత్

రాజకీయాలకు పేరుపడ్డ నారా కుటుంబం నుంచి ఒక నటుడు వస్తున్నాడంటే మొదట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఇతను ఏమాత్రం సక్సెస్ అవుతాడో…

2 hours ago

అఖిల్ భారతీయుడు కాదా?

భారతీయులకు విదేశీ పౌరసత్వాలు దక్కడం కొత్తేమీ కాదు. ముందు ఇండియాలోనే పుట్టి పెరిగి.. తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాక…

3 hours ago

ష‌ర్మిల ఎక్క‌డున్నారు… ఫోన్ స్విచ్ఛాఫ్‌!?

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు? అనే విష‌యాలు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌స్తుతం…

3 hours ago

మోడీ పై ఆర్ ఎస్ ఎస్ గుస్సా…?

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో…

5 hours ago

అన్ని దారులు `ధ‌ర్మేంద్ర` వైపే..!

కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని రూపాల్లో ప్ర‌య‌త్నించినా.. విద్యార్థుల ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక‌పోతోంది. ఇప్ప‌టికే బ‌ల ప్ర‌యోగం చేయ‌డంతో ఇది తీవ్ర వివాదానికి…

7 hours ago