రాజకీయం తెలియకనే మూడు సార్లు ముఖ్యమంత్రి కావడం అన్నది సాధ్యం కాదు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చంద్రబాబును బలహీన పరచడానికి ఎప్పటికపుడు ఇక చంద్రబాబుకు రిటైర్ మెంటే అన్నట్లు ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని తన చేతలతో చంద్రబాబు పటాపంచలు చేస్తున్నారు. తానింకా ఫుల్ ఫాంలో ఉన్నట్లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల వర్చువల్ గా మహానాడు నిర్వహించి ఇంటర్నెట్ తోనే వైసీపీకి షాక్ ఇచ్చిన చంద్రబాబు తాజాగా రాజమండ్రి బాలిక రేప్ కేసులో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు.
రాజమండ్రిలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెలుగులోకి రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వం అసమర్థత అంటూ ఏకిపారేశాడు. అంతేకాదు తాజాగా ఆ బాలిక కు పార్టీ తరఫున 2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు చంద్రబాబు. ఘటనపై పార్టీ తరఫున నిజనిర్ధారణ కమిటీ వేసి నివేదిక తెప్పించుకున్నారు. కమిటీ సభ్యులు నిన్న రాజమండ్రికి వెళ్లి బాధితురాలని పరామర్శించారు. సకల వివరాతో నివేదికను చంద్రబాబుకు అందించారు. వెంటనే చంద్రబాబు ఆ నివేదిక మేరకు తక్షణ సాయం కింద నగదు సాయం ప్రకటించారు.
ఈ సందర్భంగా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. శాశ్వతంగా ఆ పాప బాధ్యత తెలుగుదేశం పార్టీదే అన్నారు. బాలిక పదో తరగతి వరకు చదువుకుందని, ఇక ఆ అమ్మాయిని పార్టీ తరఫున చదివిస్తామన్నారు. తనకు టీడీపీ అండగా ఉంటుందనే భరోసాను కలిగించాలని చెబుతూ ‘‘ఇలాంటి దుర్మార్గాలపై పోరాడే వీరవనితగా ఆమెను తీర్చిదిద్దాలని‘‘ సంచలన వ్యాఖ్య చేశారు.
చంద్రబాబు తాజా నిర్ణయం… స్థానికంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. వేగంగా పార్టీ ఈ ఘటనలో రియాక్టైన తీరు పార్టీ పై చాలా సానుకూల ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
This post was last modified on July 23, 2020 7:02 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…